Crowdfunding: ఆశాదీపం.. క్రౌడ్ఫండింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో వందల మందికి ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది.
ఆన్లైన్లో అభ్యర్థన చూసి విరాళాలిస్తున్న దాతలు
కరోనా విపత్కర వేళ ఎన్నో ప్రాణాలు నిలబెడుతున్న వైనం
ఎలాంటి వ్యాధికైనా చికిత్సకు నిధుల సమీకరణకు ఇదో మార్గం
ఆయనో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కొవిడ్ బారిన పడి విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఊపిరితిత్తులు 80 శాతం మేర దెబ్బతిన్నాయి. తొలుత స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా.. పరిస్థితి మెరుగుపడకపోవటంతో హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. పొదుపు చేసుకున్న సొమ్ముకు తోడు బంధుమిత్రుల నుంచి అప్పు తెచ్చింది కలిపి ఇప్పటికే దాదాపు రూ.20 లక్షలు ఖర్చయింది. ఆయన పరిస్థితి మెరుగుపడాలంటే మరో రూ.30 లక్షల వరకూ వెచ్చించాలి. అంత సొమ్ము తక్కువ వ్యవధిలో ఎలా సమకూర్చుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆయన కుటుంబానికి ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ దారి చూపించింది. గత రెండు రోజుల్లోనే రూ.2 లక్షల వరకూ విరాళాలు వచ్చాయి. ఇంకా దాతలు స్పందిస్తూనే ఉన్నారు.
ఈనాడు- అమరావతి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో వందల మందికి ప్రస్తుత కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది. కరోనా, బ్లాక్ఫంగస్ లేదా ఇతరత్రా తీవ్ర వ్యాధులు, ఆరోగ్య సమస్యలకు సంబంధించో చికిత్స కోసం ఎంతోమంది బాధితులు, వారి కుటుంబసభ్యులు తమ వద్ద అందుబాటులో ఉన్న, అప్పటి వరకూ పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేసేస్తున్నారు. బీమా సదుపాయం వంటివీ వినియోగిస్తున్నారు. కొంతమంది ఆస్తులూ అమ్ముకుంటున్నారు. అయినా ఇంకా చికిత్సకు లక్షల్లో ఖర్చుపెట్టాల్సి వస్తే దిక్కుతోచని స్థితే. కొందరైతే అప్పులు తెచ్చి చికిత్స చేయించుకుంటున్నా.. కోలుకున్నాక ఆ రుణం తీర్చలేక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో తల్లకిందులవుతున్న పేద, మధ్యతరగతి వర్గాల వారికి ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ ఓ దారి చూపుతోంది.
ఆన్లైన్లో నమోదు చేసుకుంటే చాలు..
* బాధితులకు వైద్య ఖర్చుల కోసం ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ విధానంలో దేశ, విదేశాల నుంచి విరాళాల సమీకరణకు మిలాప్, కెట్టో, ఇంపాక్ట్గురు వంటి సంస్థలు సేవలందిస్తున్నాయి.
* చికిత్సకు అవసరమైన డబ్బును వెచ్చించే పరిస్థితి లేదా స్తోమత బాధితులకు లేనప్పుడు.. వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఎవరైనా సరే నిధుల సమీకరణ చేపట్టొచ్చు.
* మిలాప్, కెట్టో, ఇంపాక్ట్గురు తదితర సంస్థల వెబ్సైట్ల్లోకి వెళ్లి బాధితుడి పేరు, చిత్రాలు, ఆరోగ్య సమస్య, చికిత్సకు సంబంధించిన పత్రాలు, వైద్యుల నివేదికలు వంటివి పొందుపరచాలి. వైద్యానికి ఎంత ఖర్చవుతుందో, విరాళాల రూపంలో ఎంత అవసరమో చెప్పాలి. బాధితులు లేదా వారి కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వంటి వివరాలివ్వాలి.
* నిధులు సమీకరిస్తున్న వారి పేరు, వివరాలతో ఓ పోస్టును రూపొందించి ఆయా సంస్థలు వారి వెబ్సైట్లో ఉంచుతాయి. తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ విస్తృత ప్రచారం కల్పిస్తాయి. ఆ పోసు లింక్నూ బాధితుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, పరిచయస్తులు షేర్ చేయొచ్చు. వీటి ఆధారంగా బాధితులకు తెలిసిన వారితో పాటు తెలియనివారి నుంచి విరాళాలు వచ్చే అవకాశం ఉంటుంది.
* ఎంత నిధులు సమకూరాయి? అనే వివరాల్ని బాధితుల తరఫున నిధుల సమీకరణ పోస్టు పెట్టిన వారు ఎప్పటికప్పుడు ఆయా సంస్థల వెబ్సైట్లలోకి వెళ్లి తెలుసుకోవచ్చు. వైద్యఖర్చులకు అవసరమైన నిధిలో ఎంత పోగయ్యిందో దాతలకూ కనిపిస్తుంది.
* బాధితులు ఒకేసారి మొత్తం నిధిని తీసుకోవచ్చు. లేదంటే ఎప్పటికప్పుడు మెడికల్ బిల్లుల్ని వెబ్సైట్లో పొందుపరిచి వారికి సమకూరిన నిధి నుంచి డ్రా చేసుకోవచ్చు.
ఆమె ఓ సాధారణ గృహిణి. కొవిడ్ బారినపడి అత్యంత విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరగా, రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. అంత చెల్లించే స్థోమత లేక ‘ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్’ను ఆశ్రయించారు. ఇంపాక్ట్గురు అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోగా కొన్ని రోజుల్లోనే ఆమె చికిత్సకు అవసరమైన రూ.10 లక్షలూ విరాళాలుగా అందాయి.
మీకు తెలుసా!
* మన దేశంలో ప్రజలు ఏటా వేలాది కోట్ల రూపాయలు ప్రైవేటు రంగంలో వైద్యానికి ఖర్చుపెడుతున్నారు. ఇందులో 60 శాతం మాత్రమే బాధితుల పొదుపు సొమ్ము. మిగిలిన 40 శాతం అప్పులు చేసి, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఇచ్చినదానిలో నుంచే ఖర్చు పెడుతున్నారని క్రౌడ్ఫండింగ్ సంస్థలు చెబుతున్నాయి.
దాతలకు పన్ను మినహాయింపు
* ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్కు నిధులిచ్చే దాతలకు పన్ను మినహాయింపు వర్తింపజేస్తున్నారు.
* కొన్ని సంస్థలు ఈ సేవలందించేందుకు నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నాయి. అవి కూడా దాతల నుంచి తీసుకుంటున్నాయి. ఉచిత సేవలందించే సంస్థలూ ఉన్నాయి.
* కొంతమంది బాధితులకు అవసరమైన నిధి రెండు, మూడు రోజుల్లోనే సమకూరుతోంది. మరికొందరికి ఎక్కువ రోజుల సమయం పడుతోంది.
* కొవిడ్ వేళ కేవలం కొన్ని సంస్థలు.. ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేందుకు, కొవిడ్కేర్ కేంద్రాల ఏర్పాటుకు, పీపీఈ కిట్లు అందించేందుకు, కొవిడ్ బాధిత కుటుంబాలకు సాయం చేసేందుకు ఇలా విభిన్న అవసరాలకు కూడా నిధులు సమీకరిస్తున్నాయి.
ఆన్లైన్ మెడికల్ క్రౌడ్ ఫండింగ్ చేసే కొన్ని సంస్థల వెబ్సైట్ల వివరాలు
* milaap.org
* ketto.org
* impactguru.com
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్