LockDown: సడలింపు పెంపు
రాష్ట్రంలో లాక్డౌన్ను సోమవారం నుంచి మరో పది రోజుల (జూన్ 9) పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. బయట ఉన్నవారు ఇళ్లకు చేరడానికి మరో గంట అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు కల్పించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాటి ఉదయం 6 వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశించింది.
ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు
లాక్డౌన్ పది రోజులు కొనసాగింపు
ఏడు వైద్య కళాశాలలకు ఆమోదం
ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా
ధాన్యం సేకరణలో కేంద్ర వైఖరిపై అసంతృప్తి.. ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కరోనా టీకాలు
మంత్రిమండలి నిర్ణయం
ఈనాడు - హైదరాబాద్
పాజిటీవిటీ రేటు మరింత తగ్గితే లాక్డౌన్ ఎత్తివేత
కరోనా ఉద్ధృతి వల్ల లాక్డౌన్ విధించాం. దాన్ని ఎత్తివేయాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు, వినతులు వస్తున్నాయి. జీవనోపాధి సమస్యల దృష్ట్యా తమ గురించి ఆలోచించాలని ప్రధానంగా చిరువ్యాపారులు, పేదలు కోరుతున్నారు. అయితే వెంటనే ఎత్తివేసే పరిస్థితి లేదు. లాక్డౌన్ వల్ల కరోనా పాజిటివిటీ రేటు 29 నుంచి 9.5 శాతానికి వచ్చింది. ఇలాగే కట్టడి కొనసాగితే అది 5 శాతానికి తగ్గుతుంది. అప్పుడు లాక్డౌన్ ఎత్తివేస్తాం.- ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్రంలో లాక్డౌన్ను సోమవారం నుంచి మరో పది రోజుల (జూన్ 9) పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. బయట ఉన్నవారు ఇళ్లకు చేరడానికి మరో గంట అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు కల్పించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాటి ఉదయం 6 వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశించింది. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయంది. ఏడు కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతించింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వెంటనే కరోనా టీకాలు ఇవ్వాలని సూచించింది. ధాన్యం సేకరణను పూర్తిగా చేపట్టకుండా తెలంగాణ పట్ల కేంద్రం అవలంబిస్తున్న వైఖరిపై చర్చించిన మంత్రిమండలి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా మే 12 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులున్నాయి. అయితే కరోనా కేసుల్లో తగ్గుదల ఉన్నా.. వ్యాధి నియంత్రణ ఆశించిన స్థాయిలో లేనందున లాక్డౌన్ను కొనసాగించాలని, సడలింపు సమయాన్ని పెంచాలని మంత్రి మండలి నిర్ణయించింది. మినహాయింపులున్నవారు తప్ప లాక్డౌన్ సమయంలో ప్రజలెవ్వరూ బయట తిరగకుండా కఠిన ఆంక్షలు అమలుచేయాలని మంత్రిమండలి డీజీపీని ఆదేశించింది. కరోనా నిబంధనలను పాటిస్తూ రాష్ట్రావతరణ వేడుకలను అతి తక్కువ మందితో జరుపుకోవాలన్నారు. ప్రగతిపథంలో ముఖ్యమంత్రి, ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది.
* కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్, గద్వాల, నారాయణపేట, మక్తల్, నాగార్జునసాగర్, కోదాడ, హుజూర్నగర్ వంటి ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా నియంత్రణకు తగు చర్యలను తీసుకోవాలంది. రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా, తదితర దవాఖానాల పరిస్థితులను సమీక్షించి అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలంది.
* కరోనా మూడో దశ వస్తుందనే సమాచారంపై వైద్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.
* కొవిడ్ కారణంగా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకునేందుకు కొత్తచర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ, గృహనిర్మాణ సంస్థ ఆధీనంలోని భూములు, ఇళ్ల అమ్మకం కోసం తక్షణమే చర్యలను ప్రారంభించాలని నిర్దేశించింది.
16కు చేరిన ప్రభుత్వ వైద్యకళాశాలలు
* మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, నాగర్కర్నూల్, మంచిర్యాలలో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలను నెలకొల్పేందుకు అనుమతించింది. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్ కళాశాలలు లేని చోట వాటిని మంజూరు చేసేందుకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రస్తుతం 9 వైద్య కళాశాలలుండగా కొత్తవాటితో ఈ సంఖ్య 16కి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో బీబీనగర్ ఎయిమ్స్, సనత్నగర్ ఈఎస్ఐ వైద్యకళాశాలున్నాయి. ప్రైవేటు రంగంలో మరో 23 ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో వైద్యకళాశాలల సంఖ్య 41కి చేరనుంది.
87 శాతం ధాన్యం సేకరణ పూర్తి
* ధాన్యం దిగుబడి పెరుగుతున్నందున నూతన రైస్ మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి ఆదేశించింది. ఇప్పటికే 87 శాతం ధాన్యం సేకరణ జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. వరిధాన్యంలో సన్నాలకు మార్కెట్లో డిమాండు ఉంటుందనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. పొరుగు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యానికి డిమాండు తగ్గుతున్న నేపథ]్యంలో వరి కన్నా భవిష్యత్తులో పత్తికే ఎక్కువ లాభాలొస్తాయని మంత్రిమండలి అంచనా వేసింది. కందులకున్న డిమాండు నేపథ్యంలో ఆ పంటను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖకు సూచించింది.
* వానాకాలం సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ అన్ని విధాలుగా సన్నద్ధం కావాలంది. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
* రాష్ట్రంలోకి రుతుపవనాల రాక నేపథ్యంలో వరినాట్లు కాకుండా వెదజల్లే పద్ధతిని అవలంబించాలని రైతాంగానికి కేబినెట్ పిలుపునిచ్చింది. గతేడాది మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేసింది. భూసారాన్ని పెంచడానికి ప్రత్యేక దృష్టి సారించాలంది. వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ శాఖలో రెండు అదనపు సంచాలకుల పోస్టులను మంజూరు చేసింది.
* రాష్ట్రంలో రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలని, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. రైతుబంధు సంఘాల అధ్యక్షులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఇందులో పాల్గొనాలని కోరింది.
* రాష్ట్రంలో ఆహారశుద్ధి యూనిట్ల కోసం తొమ్మిది నుంచి పది క్లస్టర్లను ఎంపిక చేయాలని, కొత్త జోన్ల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించాలని పేర్కొంది.
విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు టీకాలు
తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. విద్యార్థులు 45 ఏళ్ల లోపు వారు కావడంతో వారికి ఇంకా టీకాల కార్యక్రమం ప్రారంభం కాలేదు. అయితే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మినహాయింపు ఇచ్చింది. ఈ విషయమై తగిన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
* రైతుబంధు ఆర్థిక సాయాన్ని జూన్ 15 నుంచి 25 వరకు అందించాలని, యాసంగిలో లాగే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. జూన్10ని కటాఫ్గా పెట్టుకుని, పార్ట్ బి నుంచి పార్ట్ ఏ లోకి మారిన భూముల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలను ఆదేశించింది.
మామునూరులో జైలు
వరంగల్లోని సెంట్రల్ జైలును తరలించి దాని స్థానంలో మల్టీసూపర్స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు అంగీకారం తెలిపింది. మామునూరులో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన జైలును నిర్మించాలని నిర్ణయించింది. ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించి ఆ స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను వచ్చే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టాలని సూచించింది.
* రాష్ట్రంలో అమల్లో ఉన్న బీసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించే ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
* మాజీ ప్రధానమంత్రి పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కిమీ) పీవీ నరసింహారావు (పీవీఎన్ఆర్) మార్గ్గా నామకరణం చేసేందుకు అనుమతించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
కేసీఆర్ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు