H1b: బోగస్ కంపెనీలు.. ఉత్తుత్తి ఉద్యోగాలు
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వృత్తి నిపుణులుగా అమెరికా, ఇతర దేశాలకు వెళ్లేందుకు అవసరమైన హెచ్-1బీ వీసాలను ఇప్పిస్తామంటూ హైదరాబాద్
భారీగా హెచ్-1బీ వీసాల కుంభకోణం
హైదరాబాద్కు చెందిన ‘క్లౌడ్జెన్’ కన్సల్టెన్సీకి జరిమానా
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారుల తనిఖీతో వెలుగులోకి..
మిలియన్ డాలర్ల జరిమానా, అయిదేళ్ల నిషేధం విధించిన హ్యూస్టన్ కోర్టు
ఈనాడు - హైదరాబాద్
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వృత్తి నిపుణులుగా అమెరికా, ఇతర దేశాలకు వెళ్లేందుకు అవసరమైన హెచ్-1బీ వీసాలను ఇప్పిస్తామంటూ హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న క్లౌడ్జెన్ సిస్టమ్స్ సంస్థ భారీగా అక్రమాలకు పాల్పడింది. అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ విభాగం అధికారులకు అనుమానం వచ్చి రికార్డులు పరిశీలించగా.. ఈ కుంభకోణం వెలుగుచూసింది. 2013 మార్చి నుంచి 2020 డిసెంబరు వరకు క్లౌడ్జెన్ సంస్థ పదుల సంఖ్యలో వృత్తి నిపుణులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు హెచ్-1బీ వీసాలు ఇప్పించినట్టు నిర్ధారణ కావడంతో టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ కోర్టు ఆరు రోజుల క్రితం క్లౌడ్జెన్ సిస్టమ్స్ సంస్థకు మిలియన్ డాలర్ల జరిమానా (భారత కరెన్సీలో రూ.7 కోట్లు), అయిదేళ్లపాటు ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదంటూ నిషేధం విధిస్తూ తీర్పు ప్రకటించింది. తాము తప్పు చేశామంటూ క్లౌడ్జెన్ సిస్టమ్స్ ప్రతినిధి జోమన్ చక్కలక్కల్ కోర్టులో అంగీకరించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్ జెన్నీఫర్ బి.లౌరీ తెలిపారు. హైదరాబాద్లో క్లౌడ్జెన్ సంస్థపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కాగా, హైదరాబాద్లోని కార్యాలయాన్ని సంస్థ మూసేసింది.
హైదరాబాద్.. మాన్సాస్.. కెనడా.. రొమేనియా..
క్లౌడ్జెన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయాన్ని గచ్చిబౌలిలోని ది ప్లాటినియా భవనంలో కొన్నేళ్ల క్రితం ప్రవాసాంధ్రులు శశి పల్లెంపాటి, సందీప్ ప్రారంభించారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలోని మనాసస్తో పాటు కెనడా, రొమేనియా దేశాల్లోనూ తమ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లేవారికి ఈ సంస్థ కన్సల్టెన్సీగా వ్యవహరిస్తోంది. సాఫ్ట్వేర్ సంస్థల ప్రాజెక్టులూ ఇస్తున్నామంటూ నిర్వాహకులు ప్రకటించుకున్నారు. ఇందులో విదేశీయులనూ భాగస్వాములను చేసుకున్నారు. వర్జీనియాలోని మనాసస్ నగరంలో అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శశి పల్లెంపాటి, సందీప్, సుసాన్ థామస్, ఎడ్వర్డ్ లార్డ్, నసీర్ సిద్దిఖీలు ఈ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు.
బోగస్ కంపెనీలు సృష్టించి..
అమెరికాకు వెళ్లేందుకు హెచ్-1బీ వీసాలు ఇప్పిస్తామంటూ ఎనిమిదేళ్ల క్రితం క్లౌడ్జెన్ సిస్టమ్స్ ప్రతినిధులు ప్రకటించారు. సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో పెద్ద సంఖ్యలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వృత్తి నిపుణులు వీరిని ఆశ్రయించారు. కెనడాతో పాటు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఉన్నాయని, వాటిల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, కమీషన్ ఇవ్వాలన్నారు. టెక్సాస్, వర్జీనియా, కెనడాల్లో బోగస్ కంపెనీలను సృష్టించారు. వాటిలో ఉద్యోగాలొచ్చాయంటూ పత్రాలతో అమెరికాకు పంపించడం మొదలుపెట్టారు. ఇలా ఏడేళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వృత్తి నిపుణులను పంపించారు. వారి నుంచి సుమారు అయిదు లక్షల డాలర్లు కమీషన్గా పొందారు.
బెంచ్ అండ్ స్విచ్ కుంభకోణం..
* అమెరికాలో అక్రమంగా ప్రవేశించి ఉద్యోగాలు పొందడాన్ని బెంచ్ అండ్ స్విచ్ కుంభకోణం అంటారు.
* సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వృత్తి నిపుణులు అమెరికాకు హెచ్-1బీ వీసాపై వెళ్లాలంటే అమెరికాలో ఉన్న సంస్థ, కంపెనీ ఉద్యోగం ఇస్తున్నట్టు నియామక పత్రం తప్పనిసరి. తొలుత మూడేళ్లు మాత్రమే అనుమతి ఉంటుంది.
* క్లౌడ్జెన్ సిస్టమ్స్ సంస్థ ద్వారా అమెరికా వెళ్లాలనుకునేవారికి అక్కడి ఒక కంపెనీ పేరుతో (అక్కడున్న వారే సృష్టిస్తారు) ఉద్యోగం ఇస్తామంటూ నియామక పత్రం పంపిస్తుంది. దీని ఆధారంగా హెచ్-1బీ వీసాపై అక్కడికి వెళ్తారు. వాస్తవానికి అక్కడ ఉద్యోగం ఉండదు. దీన్నే ‘బెంచ్’ అంటారు.
* ఉద్యోగాలు లేకుండా వెళ్లినవారిని ఇక్కడి నుంచి పంపించిన కన్సల్టెన్సీ ఇళ్లు, హోటళ్లలో కొద్ది రోజులు ఉంచుతుంది. ఆ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వృత్తి నిపుణులు అమెరికన్ సంస్థలకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఉద్యోగం రాగానే ఉత్తుత్తి కంపెనీ ఇచ్చిన హెచ్-1బీ వీసాను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి పంపిస్తారు. కొత్త సంస్థలో చేరినందున తమకు ఆ కంపెనీ తరఫున హెచ్-1బీ వీసా ఇప్పించాలని దరఖాస్తు చేసుకుంటారు. అలా అధికారికంగా హెచ్-1బీ వీసా సంపాదిస్తారు. దీన్నే ‘స్విచ్’గా వ్యవహరిస్తారు.
* ఉత్తుత్తి కంపెనీలకు సంబంధించిన హెచ్-1బీ వీసాలను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తనిఖీ చేయడంతో క్లౌడ్జెన్ సంస్థ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి