Supreme Court: కోర్టుల ప్రత్యక్ష ప్రసారంపై ముసాయిదా
న్యాయస్థానాల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత తీసుకువచ్చే దిశలో మరో అడుగు ముందుకు పడింది. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు, చిత్రీకరణకు (రికార్డింగ్)కు సంబంధించిన నియమ నిబంధనల ముసాయిదాను సుప్రీంకోర్టు ఈ-కమిటీ సోమవారం విడుదల చేసింది.
విడుదల చేసిన సుప్రీంకోర్టు
ఈనాడు, దిల్లీ: న్యాయస్థానాల కార్యకలాపాల్లో మరింత పారదర్శకత తీసుకువచ్చే దిశలో మరో అడుగు ముందుకు పడింది. కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలు, చిత్రీకరణకు (రికార్డింగ్)కు సంబంధించిన నియమ నిబంధనల ముసాయిదాను సుప్రీంకోర్టు ఈ-కమిటీ సోమవారం విడుదల చేసింది. ముసాయిదాలోని నిబంధనలకు అనుగుణంగా ప్రత్యక్ష ప్రసారాలు, రికార్డింగ్ అంశాల్లో మరింత మెరుగుపర్చేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర భాగస్వాములకు ఈ-కమిటీ ఛైర్మన్ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ లేఖలు రాశారు. ఈ నెల 30వ తేదీలోపు తమ అభిప్రాయాలు వెల్లడించాలని సూచించారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం న్యాయం పొందే హక్కులో కోర్టుల ప్రత్యక్ష ప్రసారం పొందే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో మరింత పారదర్శకత, న్యాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి, విశ్వసనీయత పెంపునకు ప్రత్యక్ష ప్రసారం తోడ్పడుతుందని కమిటీ పేర్కొంది. ప్రత్యక్ష ప్రసారాల నిబంధనల రూపకల్పనకు బొంబాయి, దిల్లీ, మద్రాస్, కర్ణాటక హైకోర్టుల న్యాయమూర్తులతో ఒక ఉప సంఘాన్ని ఈ-కమిటీ ఏర్పాటు చేసింది. ఈ ఉప కమిటీ విస్తృతమైన చర్చలు జరపడంతో పాటు స్వప్నిల్ త్రిపాఠి కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంది.
ముసాయిదా ప్రకారం...
* వివాహ, లైంగిక వివాదాలు, మహిళలు, చిన్నారులపై లైంగిక హింస, చిన్నారులకు సంబంధించిన కేసులు, ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కేసులు, శాంతిభద్రతలకు భంగం కలిగించే కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారాల నుంచి మినహాయిస్తారు.
* క్రిమినల్ కేసుల్లో క్రాస్ఎగ్జామినేషన్, సాక్షుల వాంగ్మూలం, సాక్ష్యాల నమోదును ప్రత్యక్ష ప్రసారం చేయరు.
* వ్యక్తుల వ్యక్తిగత వివరాలకు సంబంధించిన అంశాలను ప్రసారం చేయరు.
* కేసుల విచారణల్లో విచారణ మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలా..? లేదా.. అందులో ఏ భాగాన్నైనా ప్రసారం చేయకూడదా అనే విషయంలో ధర్మాసనానిదే (బెంచ్) తుది నిర్ణయం. ఏ దశలోనైనా ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసే అధికారం ధర్మాసనానికి నేతృత్వం వహించే న్యాయమూర్తికి ఉంటుంది. ఇందుకు సంబంధించిన రిమోట్ సంబంధిత న్యాయమూర్తి వద్ద ఉంటుంది.
* ప్రతి కోర్టులో ప్రత్యక్ష ప్రసారాల నిర్వహణకు సంబంధించిన కంట్రోల్ రూం (డీసీఆర్) ఏర్పాటు చేయాలి.
* ప్రతి కోర్టులోనూ ప్రత్యక్ష ప్రసారాలకు అయిదు దిశల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలి. అందులో ఒకటి ధర్మాసనం, రెండు, మూడు వాదప్రతివాదుల న్యాయవాదుల వైపు, నాలుగోది నిందితుని వైపు, అయిదు సాక్షి, ప్రతివాది వైపు ఉంచాలి.
* కోర్టు కార్యక్రమాల సమయంలో ధర్మాసనం అనుమతి మేరకు న్యాయవాదులు, సాక్షులు, నిందితులు, కోర్టు అనుమతించిన ఇతరులు మైక్రోఫోన్లు వినియోగించవచ్చు.
* ప్రత్యక్ష ప్రసారాలను వీక్షకులు, పాత్రికేయులు, సామాజిక మాధ్యమాలకు చెందిన వారు, సాక్షులు, వాదప్రతివాదులు, న్యాయవాదులు వీడియో, ఆడియో రికార్డు చేయకూడదు. ప్రత్యక్ష ప్రసారం చేయకూడదు. ఎవరైనా ఈ నిబంధన ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం శిక్షిస్తారు.
* న్యాయమూర్తులు వారిలో వారు మాట్లాడుకునే మాటలు, విచారణ సందర్భంలో న్యాయమూర్తి న్యాయస్థానం సిబ్బందికి ఇచ్చే ఆదేశాలు, న్యాయమూర్తులకు అందించే పత్రాలు, కార్యకలాపాలు సాగుతున్న సమయంలో న్యాయమూర్తి చేసే ప్రకటనలను ప్రసారం చేయకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!