Corona Vaccine: మరో 44 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డర్
కేంద్ర ప్రభుత్వం కొత్తగా 44 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 25 కోట్ల డోసులు కొవిషీల్డ్ కాగా, 19 కోట్ల డోసులు కొవాగ్జిన్. ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య ఇవి అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మంగళవారం వెల్లడించారు.
25 కోట్లు కొవిషీల్డ్, 19 కోట్లు కొవాగ్జిన్
ఆగస్టు-డిసెంబరు మధ్యలో అందుబాటులోకి 74 కోట్ల డోసులు
స్థోమత ఉన్నవారు పేదలకు టీకా ఖర్చును భరించవచ్చు
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా 44 కోట్ల డోసుల వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 25 కోట్ల డోసులు కొవిషీల్డ్ కాగా, 19 కోట్ల డోసులు కొవాగ్జిన్. ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య ఇవి అందుబాటులోకి వస్తాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ మంగళవారం వెల్లడించారు. బయోలాకల్-ఈ సంస్థకు ఇప్పటికే 30 కోట్ల డోసులకు ఆర్డర్ ఇచ్చామని, వీటితో కలిపి మొత్తం 74 కోట్ల డోసులు ఆగస్టు - డిసెంబరు మధ్య అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇప్పటివరకు వేసిన వాటితో కలిపి జులై చివరి నాటికి మొత్తం 53.6 కోట్ల డోసులు ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ సంస్థలకు అదనంగా 30% సొమ్ము అడ్వాన్సుగా విడుదల చేసినట్లు తెలిపారు. ఆయన చెప్పిన ఇతర వివరాలు..
ప్రాధాన్యంపై రాష్ట్రాలదే నిర్ణయం
జులై 21 నుంచి అమల్లోకి రాబోయే నూతన మార్గదర్శకాల ప్రకారం 75% వ్యాక్సిన్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ ఉచిత వ్యాక్సిన్లలో తొలి ప్రాధాన్యం వైద్య ఆరోగ్య సిబ్బందికి, తర్వాత వరుసగా ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏళ్ల పైబడిన వారు, రెండో డోసు వారు, 18 ఏళ్ల పైబడిన వారికి ఇవ్వాలి.
* 18 ఏళ్ల పైబడినవారిలో ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న నిర్ణయాన్ని రాష్ట్రాలు సొంతంగా తీసుకోవచ్చు.
* జనాభా, రోగ తీవ్రత, ఇప్పటివరకు చేపట్టిన వ్యాక్సినేషన్లో ఉన్న పురోగతి ఆధారంగా రాష్ట్రాలకు టీకాలు కేటాయిస్తుంది.
* దేశీయ తయారీదారులు తాము నెలవారీగా చేసే ఉత్పత్తిలో 25% నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు విక్రయించుకోవడానికి అనుమతి లభించింది.
మారుమూల ప్రాంతాలకూ సకాలంలో సరఫరా
డిమాండ్కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్లు సరఫరా చేయడానికి, చెల్లింపులు చేపట్టడానికి నేషనల్ హెల్త్ అథారిటీ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా చేయూతనందిస్తుంది. దీనివల్ల మారుమూల ప్రైవేటు ఆసుపత్రులకూ సకాలంలో వ్యాక్సిన్లు సరఫరా అవుతాయి. ప్రాంతీయ సమతౌల్యం సాధ్యమవుతుంది.
ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధరలను వ్యాక్సిన్ తయారీదారులు నిర్ణయిస్తారు. ప్రైవేటు ఆసుపత్రులు గరిష్ఠంగా సర్వీస్ ఛార్జి కింద రూ.150 వసూలు చేయడానికి అనుమతి ఇచ్చినందువల్ల అవి పెద్ద సంఖ్యలో ముందుకు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఆదాయాలతో సంబంధం లేకుండా ప్రజలంతా ఉచిత వ్యాక్సిన్ అందుకోవడానికే అర్హులే. స్థోమత ఉన్నవారు ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ తీసుకోవచ్చని కేంద్రం సూచిస్తోంది.
ఉచితం విలువ రూ.1.45 లక్షల కోట్లు
దిల్లీ: దేశంలో 18 ఏళ్లు పైబడినవారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయడానికి, 80 కోట్ల మంది పేదలకు నవంబరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడానికి కేంద్రం రూ.1.45 లక్షల కోట్ల మేర భారాన్ని అదనంగా భరించనుంది. వీటిలో ఒక టీకాలపైనే రూ. 45,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు ఖర్చు కానుంది. కేంద్రం మొదట వేసిన అంచనాల ప్రకారం ఈ మొత్తం రూ. 35,000 కోట్లు. నిరుపేద లబ్ధిదారులకు నెలకు ఐదు కిలోల బియ్యం, లేదా గోధుమలు, ఒక కిలో పప్పు చొప్పున దీపావళి వరకు ఇవ్వడానికి రూ.1.10 లక్షల కోట్ల నుంచి రూ. 1.3 లక్షల కోట్ల వరకు ఖర్చు కానుంది. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి.. ఆశించినదానికంటే ఎక్కువగా రూ. 99,122 కోట్లు డివిడెండ్ లభించడం, పెట్రో ఉత్పత్తులపై రికార్డు స్థాయిలో పన్నులు జమ అవుతుండడం వల్ల ప్రభుత్వానికి ఈ అదనపు భారం పెద్ద కష్టమేమీ కాదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. కొవాగ్జిన్, కొవిషీల్డ్లకు అదనంగా రష్యాకు చెందిన స్పుత్నిక్-వి మరికొద్దిరోజుల్లో మన దేశంలోకి వాణిజ్యపరంగా రానుంది.
ఎలక్ట్రానిక్ వోచర్తో ఆదుకోవచ్చు
డబ్బున్నవారు ఎలక్ట్రానిక్ వోచర్స్ని కొనుగోలుచేసి వాటిని ఎవరికైనా ఇవ్వొచ్చు. ఆ వోచర్ ఉన్నవారు నేరుగా ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి దాన్ని చూపి వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
కొవిన్ యాప్లో ముందుగా బుకింగ్ చేసుకోవడంతోపాటు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఉమ్మడి సేవా కేంద్రాలు, కాల్సెంటర్ల సేవలను ఉపయోగించుకోవాలి.
కొవిషీల్డ్ రూ.780 కొవాగ్జిన్ రూ.1410
దిల్లీ: ప్రైవేటు ఆసుపత్రుల్లో వేసే కరోనా టీకాలకు గరిష్ఠ ధరను కేంద్రం నిర్ణయించింది. ఒక డోసు కొవిషీల్డ్కు రూ.780, కొవాగ్జిన్కు రూ.1,410, స్పుత్నిక్-వి వ్యాక్సిన్కు రూ.1,145 మించకుండా వసూలు చేయాలని స్పష్టంచేసింది. ఇంతకంటే ఎక్కువ ధర అడిగితే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసింది. సేవా రుసుముల కింద ప్రైవేటు ఆసుపత్రులు ఒక డోసుకు గరిష్ఠంగా రూ.150 చొప్పున వసూలు చేసుకోవచ్చని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు