Deep Ocean Mission: సాగర మథనానికి సై
సముద్ర గర్భంలో దాగిన అనంతమైన సహజ వనరులను ఒడిసి పట్టుకొని ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా వాటిని వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వనరుల అన్వేషణ కోసం వచ్చే అయిదేళ్లలో
రూ.4,077 కోట్లతో సముద్ర గర్భంలో వనరుల అన్వేషణ
‘డీప్ ఓషన్ మిషన్’కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
రసాయన ఎరువుల రాయితీ ఖరారు
ఈనాడు, దిల్లీ: సముద్ర గర్భంలో దాగిన అనంతమైన సహజ వనరులను ఒడిసి పట్టుకొని ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా వాటిని వినియోగించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి, వనరుల అన్వేషణ కోసం వచ్చే అయిదేళ్లలో రూ.4,077 కోట్ల వ్యయంతో ‘డీప్ ఓషన్ మిషన్’ చేపట్టనుంది. బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తొలి దశ కింద మొదటి మూడేళ్ల (2021-24)లో రూ.2,823.4 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ(మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్) పర్యవేక్షిస్తుంది. 7,517 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం, 1,382 ద్వీపాలున్న మన దేశం సాగర గర్భంలోని వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ‘డీప్ ఓషన్ మిషన్’కు శ్రీకారం చుట్టింది. ఇందులో మొత్తం ఆరు అంశాలు ఇమిడి ఉంటాయి.
1. డీప్ సీ మైనింగ్ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి: సముద్ర గర్భంలో 6వేల మీటర్ల లోతులో అన్వేషణ చేపట్టడానికి అనువుగా ముగ్గురు మనుషులు ప్రయాణించేందుకు వీలైన జలాంతర్గామి (సబ్మెర్సిబుల్)ని సైంటిఫిక్ సెన్సర్లు, టూల్స్తో అభివృద్ధి చేస్తారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా తర్వాత మన దేశానికి మాత్రమే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మధ్య హిందూ మహాసముద్రంలో 6 కిలో మీటర్ల లోతు నుంచి పాలీ మెటాలిక్ మైనింగ్ నోడ్యుల్స్ను వెలికి తీయడానికి సమీకృత మైనింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. ఇక్కడ జరిగే అధ్యయనాలు సమీప భవిష్యత్తులో వాణిజ్య అవసరాల కోసం ఖనిజ తవ్వకాలు చేపట్టేందుకు బాటలు వేస్తాయి. సముద్ర గర్భం నుంచి ఖనిజాలు, ఇంధన వనరులను వెతికిపట్టుకోవడం బ్లూ ఎకానమీకి దోహదం చేస్తుంది.
2. సముద్ర వాతావరణ మార్పులపై అధ్యయనం: సముద్ర వాతావరణంలో వచ్చే మార్పులను అర్థం చేసుకోవడానికి సముచితమైన విధానాలను అభివృద్ధి చేస్తారు. తద్వారా తాజా పరిస్థితులతో పాటు రాబోయే దశాబ్దాల్లో వచ్చే మార్పులనూ అంచనావేసి అందుకు అనువైన చర్యలు తీసుకుంటారు. ఇది కోస్తా తీరంలో పర్యాటకాభివృద్ధికి, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.
3. జీవ వైవిధ్య రక్షణకు వినూత్న చర్యలు: సముద్రగర్భంలో ఉన్న జీవజాలంపై అధ్యయనం చేస్తారు. అక్కడ ఉండే జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తూనే సముద్ర గర్భంలోని వనరులను వెలికితీయడంపై దృష్టి సారిస్తారు.
4. డీప్ ఓషన్ సర్వే: హిందూ మహాసముద్రంలో ఉన్న మధ్య సాగర కనుమల్లో (మిడ్ ఓషనిక్ రిడ్జెస్) నిక్షిప్తమై ఉన్న విలువైన, అరుదైన ఖనిజాలను గుర్తించడం దీని ప్రధాన ఉద్దేశం.
5. ఇంధనాలు, తాగునీటి సేకరణ: సముద్ర వనరుల నుంచి ఇంధనం ఉత్పత్తితో పాటు నిర్లవణీకరణ ప్లాంట్లు నెలకొల్పి సముద్ర నీటిని తాగునీటిగా మార్చడంపై దృష్టిసారిస్తారు.
6. ప్రత్యేక మెరైన్ కేంద్రాలు: సముద్ర జీవులపై అధ్యయనం కోసం ఆధునిక మెరైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ చేసే పరిశోధనలు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా చేయూతనందిస్తారు.
త్వరలో దేశీయ నౌకా బిల్లు
దేశీయ జల వనరుల్లో రాష్ట్రాల మధ్య జరిగే జల రవాణా, వాణిజ్య కార్యకలాపాలకు ఉద్దేశించిన చట్టాల్లో ఏకరూపత తీసుకురావడం కోసం త్వరలో దేశీయ నౌకా బిల్లు (ఇన్ల్యాండ్ వెసల్ బిల్)ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర సహాయ మంత్రి మాండవీయ తెలిపారు. రాష్ట్రాల మధ్య జల రవాణాకు అవసరమైన అనుమతులు పొందటానికి ఎదురవుతున్న ఇబ్బందులూ తొలగిపోతాయన్నారు. దేశంలో 4వేల కి.మీ. పొడవైన అంతర్ జలమార్గాలున్నాయి.
రూ.1200కే డీఏపీ బస్తా
అంతర్జాతీయంగా డీఏపీ ఎరువుల ధర పెరిగినా ఆ భారాన్ని రైతులపై మోపకూడదని గత నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. గత ఏడాది మాదిరిగానే రైతులకు డీఏపీ (50 కిలోల) బస్తా రూ.1200కే లభించనుంది. ఒక్కో బస్తాపై కేంద్రం గత ఏడాది రూ.500 రాయితీని భరించగా ఇప్పుడు దానికి మరో రూ.700 జత చేసి మొత్తంగా రూ.1200 చొప్పున సబ్సిడీ కల్పించనుంది. అంతర్జాతీయ ధరల ప్రకారం అయితే డీఏపీ బస్తా అసలు ధర రూ.2400గా ఉంది. యూరియా బస్తాపై రూ.900 రాయితీ కల్పిస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. దీనివల్ల ఖజానాపై రూ.14,775 కోట్ల భారం పడుతుందని మంత్రి వెల్లడించారు.
ఎరువుల రాయితీల నిర్ధారణ
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఫాస్పెటిక్, పొటాసిక్ (పీ అండ్ కే) రకం ఎరువులకు పోషకాధారిత రాయితీ రేట్లను నిర్ధారించింది. 2021-22 కాలానికి ఈ కొత్త ధరలు వర్తిస్తాయి. తాజా నిర్ణయం ప్రకారం.. కిలో నైట్రోజన్ (ఎన్) ఎరువుకు రూ.18.789, ఫాస్పరస్(పి)కు రూ.45.323, పొటాష్(కె)కు రూ.10.116, కిలో సల్ఫర్ (ఎస్) ఎరువుకి రూ.2.374 చొప్పున రాయితీగా అందిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు ఎంతో సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ