TS News: లాక్డౌన్ తొలగింపు?
రాష్ట్రంలో లాక్డౌన్కు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు కొనసాగించేందుకు యోచిస్తోంది. థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి
రాకపోకలు యథాతథం
జనసమ్మర్దంపై ఆంక్షలు
నేడు మంత్రిమండలి అత్యవసర సమావేశంలో నిర్ణయించే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్కు ముగింపు పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జన సమ్మర్థం, రద్దీపై ఆంక్షలు కొనసాగించేందుకు యోచిస్తోంది. థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు వంటి వాటి మూసివేత కొనసాగనుంది. వివాహాలు, అంత్యక్రియల లాంటి వాటిపై పాత నిబంధనలు అమలు చేయనుంది. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో లాక్డౌన్తో పాటు ఇతర కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ గడువు శనివారంతో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో దానిపై నిర్ణయం తీసుకునే ప్రధాన ఎజెండాపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా మంత్రిమండలి సమావేశం జరపాలని సీఎం నిర్ణయించారు. మంత్రులందరికీ ఆయన స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అందుబాటులో ఉన్న మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ తదితరులతో సీఎం శుక్రవారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు అత్యవసర సమాచారం ఇచ్చారు. ప్రాథమికంగా కొన్ని అంశాలతో ఎజెండాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతుండడంపై వైద్య ఆరోగ్యశాఖ నివేదిక రూపొందించినట్లు తెలిసింది. మూడో దశ గురించి ఉన్న భయాందోళనలపైనా సీఎం వైద్య ఆరోగ్యశాఖ నుంచి స్పష్టత కోరారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో లాక్డౌన్ మినహాయింపునకే ప్రభుత్వం మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మాస్క్ల ధారణ వంటి కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎంపికపై...
రాష్ట్రంలో ఈ నెల 16న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి పదవీ విరమణతో ఆ స్థానం ఖాళీ అయింది. అప్పటికే ఖాళీ అయిన ఎమ్మెల్యేల కోటా ఆరు స్థానాలతో కలిపి దీనిని భర్తీ చేయాలని మొదట ప్రభుత్వం భావించింది. ఏపీలో నామినేటెడ్ ఎమ్మెల్సీల నియామకం జరగడంతో.. ఇక్కడా వెంటనే భర్తీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిని టేబుల్ ఎజెండాలో చేరుస్తున్నట్లు సమాచారం.
కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం
రాష్ట్రంలో వ్యవసాయ సీజన్లో ఇబ్బందులు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. పోలీసు, వ్యవసాయ శాఖలను అప్రమత్తం చేయడంతో అవి విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలను పెద్దఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ విత్తనాలపై మరింత కట్టడికి మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీ ప్రాజెక్టులపై...
ఏపీ ప్రభుత్వం కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సీఎం మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారుల నుంచి తీసుకున్నారు. అక్రమ ప్రాజెక్టులపై కఠిన వైఖరిని అవలంబించాలనే అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. మంత్రిమండలిలో దీనిపై సమగ్ర చర్చ జరగనుంది.
హుజూరాబాద్పై...
మంత్రిమండలి అధికారిక ఎజెండా అనంతరం మంత్రులతో సీఎం రాజకీయపరమైన అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. ప్రధానంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అందరి అభిప్రాయాలు సీఎం తీసుకోనున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలు, రెండు పురపాలికలకు ఇన్ఛార్జీల నియామకం, పర్యటనలు, ఇతరత్రా వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!