అవే ధరలు.. అమలే సవాలు!
కొవిడ్ చికిత్సలకు మళ్లీ పాత ధరలే ఖరారయ్యాయి. 2020 జూన్లో ఏ ధరలనైతే స్థిరీకరించారో.. మళ్లీ వాటినే కొనసాగిస్తూ వైద్యఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.
కొవిడ్ చికిత్సలకు పాత ధరలే ఖరారు
వైద్య ఆరోగ్యశాఖ తాజా ఉత్తర్వులు
కొత్తగా పీపీఈ కిట్, ఇతర నిర్ధారణ పరీక్షల ఖరీదు స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ చికిత్సలకు మళ్లీ పాత ధరలే ఖరారయ్యాయి. 2020 జూన్లో ఏ ధరలనైతే స్థిరీకరించారో.. మళ్లీ వాటినే కొనసాగిస్తూ వైద్యఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ ధరలు తమకు ఏమాత్రం సమ్మతం కాదని.. వాటిని పెంచాలంటూ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేసిన వినతులను తోసిపుచ్చింది. ఈ దఫా మాత్రం పీపీఈ కిట్, ఇతర నిర్ధారణ పరీక్షల ధరలను స్పష్టీకరించింది. అత్యవసర సేవల్లో వినియోగించే అంబులెన్సు ధరలను కూడా స్థిరీకరించింది. ఈ మేరకు స్వల్ప మార్పులు చేస్తూ వైద్యఆరోగ్యశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలను కచ్చితంగా అమలు చేయాలని.. అధిక ధరలు వసూలు చేసినట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా మళ్లీ మళ్లీ సీటీ స్కాన్లు, ఇతర నిర్ధారణ పరీక్షలు చేయవద్దని.. నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
రోగికి మేలే కానీ..
వైద్యఆరోగ్యశాఖ ఇచ్చిన తాజా ఉత్తర్వులు రోగికి మేలు చేసేవే కానీ.. చెల్లుబాటు అవడంపైనే పలు సందేహాలు నెలకొన్నాయి. గతేడాది జీవో ఇచ్చినప్పుడు వాస్తవ దూరంగా ధరలను నిర్ణయించారంటూ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు వినతిపత్రాలు అందజేశాయి. పైగా ఏ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయలేదు. ఇష్టానుసారంగా చికిత్సల ధరలను వసూలు చేశాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ధరల బాగోతంపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై తూతూమంత్రంగానే చర్యలు తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ అధిక ఫీజులపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో చికిత్సల ధరలను ఖరారు చేస్తూ ఉత్తర్వులివ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కొవిడ్ చికిత్సల ధరల్లో మార్పులుండొచ్చని అనుకున్నారు. అయితే, ఆరోగ్యశాఖ ఇచ్చిన తాజా ఉత్తర్వుల్లో పాత ధరలనే ఖరారు చేయడంతో.. ఈ ఆదేశాలను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు అమలు చేస్తాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. వీటిని అమలుచేయడమే అసలైన సవాల్ అని.. అధికారులు దృష్టిసారించకుంటే గతంలో మాదిరిగా నామమాత్రపు ఉత్తర్వుల్లాగానే ఇవీ మిగిలిపోయే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చికిత్స ధరలు.. (రోజుకు)
* ఐసొలేషన్, సాధారణ వార్డులో : రూ.4,000
* ఐసీయూలో: రూ.7,500
* ఐసీయూలో వెంటిలేటర్తో: రూ.9,000
ఇవి కూడా కలిపి
కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రొటీన్ యూరిన్ పరీక్ష, హెచ్ఐవీ, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, సిరమ్ క్రియేటినైన్, అల్ట్రాసౌండ్ స్కాన్, 2డి ఎకో, ఎక్స్రే, ఈసీజీ పరీక్షలు సహా అవసరమైన ఔషధాలు, వైద్యుని సంప్రదింపులు, పడకకయ్యే వ్యయం, భోజనాలు, మూత్రనాళంలో గొట్టం తదితర వైద్య ప్రక్రియలు.
వీటికి అదనం
ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్లు వంటివి ఉదాహరణకు.. బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్లు, సెంట్రల్లైన్, కీమోపార్ట్ ఇన్సెర్షన్, బయాప్సీ, పొట్టలో నుంచి ద్రవాన్ని తీయడం తదితర వైద్య ప్రక్రియలకు అదనంగా ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. అయితే వీటికి 2019 డిసెంబరు 31 నాటికి ఎంతైతే ధర నిర్ధారించారో.. అంతే వసూలు చేయాలి.
* ఇమ్యూనోగ్లోబిన్స్, మెరోపెనిమ్, పేరెంటల్ న్యూట్రిషన్, టొసిలిజుమాబ్ తదితర ఖరీదైన ఔషధాలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటికి గరిష్ఠ చిల్లర ధరనే వసూలు చేయాలి.
* ఉత్తర్వుల్లో ఇక్కడి వరకూ గతేడాదివే తిరిగి ఇచ్చారు.
కొత్తగా చేరినవి..
* ఒక్కో పీపీఈ కిట్ ధర గరిష్ఠంగా రూ.273 మాత్రమే. ఇంతకు మించి వసూలు చేయడానికి వీల్లేదు.
* ఈ ఉత్తర్వులు బీమా సంస్థల చెల్లింపులకు వర్తించవు. ఏ తరహా పరస్పర అవగాహన ఒప్పందంతో చికిత్స పొందే విధానాలకైనా ఈ ధరలు వర్తించవని ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
* దూరప్రాంతాలకు సాధారణ అంబులెన్సులో వెళ్లాల్సి వస్తే గరిష్ఠంగా కిలోమీటరుకు రూ.75 చొప్పున వసూలు చేయాలి. అదే ఆక్సిజన్, ఇతర వసతులతో కూడిన అంబులెన్సు అయితే కిలోమీటరుకు రూ.125 చొప్పున తీసుకోవాలి.
* సాధారణ అంబులెన్సును గుండుగుత్తగా మాట్లాడుకుంటే మినిమమ్ ఛార్జి రూ.2000. ఇతర వసతులున్న అంబులెన్సయితే ఈ మొత్తం రూ.3000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు