- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
వైద్యంలో పదివేల కొలువులు
ఏడు మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులు
నర్సింగ్ కళాశాలలకు 720 ఉద్యోగాలు
ఈనాడు, హైదరాబాద్: కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు వైద్య కళాశాలలు, 15 నర్సింగ్ కాలేజీల్లో 10 వేలకు పైగా కొలువులు రానున్నాయి. రెగ్యులర్ ప్రాతిపదికన 7,727 మందిని నియమిస్తారు. ఈ మేరకు పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి ముందు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, ఆర్థిక శాఖల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. మంజూరు చేసిన పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ సర్వీసు నిబంధనలు వర్తిస్తాయని వివరించారు. ఈ వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీల్లో 3,035 మందిని అవుట్సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు ప్రభుత్వం బుధవారం అనుమతించిన విషయం తెలిసిందే. ఏడు వైద్య కళాశాలల్లో 2,135 మందిని, 15 నర్సింగ్ కళాశాలల్లో 900 మందిని తీసుకోవచ్చని పేర్కొంది.
ఒక్కో వైద్య కళాశాలకు 1,001 పోస్టులు
రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, నాగర్కర్నూల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాలల్లో వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ప్రతి కళాశాలలో 34 వైద్య విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు సహా ఇతర పోస్టులను మంజూరు చేశారు. ఒక్కో వైద్య కళాశాలకు 1,001 పోస్టుల చొప్పున ఏడు కళాశాలలకు 7,007 మంజూరు చేశారు.
నర్సింగ్ కళాశాలకు 48 పోస్టులు
రాష్ట్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన 13 నర్సింగ్ కళాశాలలు, మరో రెండు కొత్త నర్సింగ్ కళాశాలలకు 720 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి నర్సింగ్ కళాశాలకు ప్రొఫెసర్/ప్రిన్సిపల్, ప్రొఫెసర్/వైస్ ప్రిన్సిపల్, మరో ఏడు గురు ప్రొఫెసర్లు, 12 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 20 మంది లెక్చరర్ల పోస్టులున్నాయి. పరిపాలన విభాగానికి ఏడు ఉద్యోగాలున్నాయి. మొత్తం 48 మంది చొప్పున 15 నర్సింగ్ కళాశాలలకు 720 పోస్టులను మంజూరు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Zaporizhzhia: అలాగైతే ఆ ప్లాంట్ను మూసివేస్తాం.. రష్యా హెచ్చరిక!
-
Movies News
Viruman: సూర్య, కార్తిలకు డైమండ్ బ్రాస్లెట్, గోల్డ్ చైన్లు...
-
India News
Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
-
Movies News
Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
-
India News
Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
-
Technology News
Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్వాచ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్షిప్పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- CBI searches: రూ.11కోట్ల నాణేలు అదృశ్యం.. 25చోట్ల సీబీఐ సోదాలు
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!