CM KCR: కాకతీయలో పీవీ పీఠం
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పీఠం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ వీసీ పంపిన
భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెడతాం
దిల్లీ, వంగర, తెలంగాణ జిల్లాల్లో మాజీ ప్రధాని విగ్రహాలు
శతజయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పీఠం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ వీసీ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తున్నామన్నారు. ‘పీవీ మన తెలంగాణ ఠీవీ. ఒక కీర్తి శిఖరం. దీప స్తంభం. స్థితప్రజ్ఞుడు, బహుభాషా కోవిదుడు. విద్యానిధి, సాహిత్య పెన్నిధి, సంస్కరణవాది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల నిష్ణాతుడు. ఆయనను ఎంత గౌరవించుకున్నా తక్కువే. ఆ స్ఫూర్తిప్రదాత చరిత్ర అందరికీ ఆదర్శం’ అని కొనియాడారు. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెడతామని ప్రకటించారు. పీవీ స్వగ్రామంతోపాటు, జిల్లాల్లో, దిల్లీలో పీవీ విగ్రహాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వారి కుటుంబాన్ని గౌరవించుకునేందుకే వాణీదేవికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. ఆమెను గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పీవీ శతజయంత్యుత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్లోని జ్ఞానభూమి(పీవీఘాట్)లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
800 ఎకరాల భూమిని ధారాదత్తం చేశారు
‘పీవీ చేపట్టిన భూ సంస్కరణలను దేశంలోని ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకమయ్యాయి. 800 ఎకరాల విలువైన సొంత భూమిని ఆయన ప్రజలకు ధారాదత్తం చేశారు. ఆ విధంగా తన నిబద్ధతను చాటుకుంటూ భూ సంస్కరణలను అమలు చేశారు. అనేక పుస్తకాలు రచించారు. అనేక రచనలను అధ్యయనం చేశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా గురుకుల, నవోదయ పాఠశాలలను తీసుకొచ్చారు. ఆయన ప్రారంభించిన గురుకుల పాఠశాలలోనే చదివి డీజీపీని కాగలిగానని మహేందర్రెడ్డి తెలిపారు. ఇలా ఎంతో మంది పీవీని స్మరించుకుంటున్నారు. దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి వల్లే నేడు పెట్టుబడులు వస్తున్నాయి. ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. రాష్ట్రాల బడ్జెట్ రూ.లక్షల కోట్లకు చేరింది. కరోనా అతలాకుతలం చేస్తున్నప్పటికీ.. గతేడాది కాలంలో కేకే ఆధ్వర్యంలో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. విదేశాల్లో నిర్వహించిన మహేశ్ బిగాలకు ప్రత్యేక అభినందనలు. ఇవాళ ఆవిష్కరించిన పీవీ విగ్రహాన్ని చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఈ రహదారికి ‘పీవీ మార్గ్’ అని నామకరణం చేయడం సంతోషంగా ఉంది’ అని సీఎం తెలిపారు.
ఘనంగా శతజయంత్యుత్సవాలు: కేకే
తెలంగాణ శాసనసభలో త్వరలోనే పీవీ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరిస్తారని, మాజీ ప్రధాని సొంతూరు వంగరలో పీవీ పార్కు, మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని పీవీ శతజయంత్యుత్సవ కమిటీ ఛైర్మన్, ఎంపీ కేశవరావు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఏడాది కాలం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. కరోనా కారణంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టలేకపోయామన్నారు. ఆయన రచనలను వెలుగులోకి తెచ్చామని, నమస్తే పీవీ తదితర తొమ్మిది పుస్తకాలను తీసుకొచ్చామని, వెబినార్లు, అంతర్జాతీయ సమావేశం నిర్వహించామని చెప్పారు. పీవీ ఖ్యాతిని చాటేలా ఈ ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి, ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారని పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి ప్రశంసించారు.
26 అడుగుల విగ్రహావిష్కరణ
హైదరాబాద్ నెక్లెస్ రోడ్కు పీవీ మార్గ్గా నామకరణం చేసిన అనంతరం 26 అడుగుల మాజీ ప్రధాని విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవీ రాసిన 4, ఆయనపై ఇతరులు రచించిన తొమ్మిది పుస్తకాలను గవర్నర్, సీఎం విడుదలచేశారు.
మంత్రుల నివాళి
మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ కవిత పీవీకి నివాళులర్పించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా నివాళులు అర్పించినవారిలో ఉన్నారు.
తెలంగాణ తల్లి సంతోషిస్తోంది: గవర్నర్
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేదల పెన్నిధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కర్త అని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఆయన రాజకీయాలకతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని కలాం చెప్పేవారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదర్శమూర్తికి అర్పించిన ఘన నివాళి...తరతరాలకు గుర్తుండిపోతుందన్నారు.
నరసింహారావు సేవలు చిరస్మరణీయం
‘‘శతజయంతి సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు నివాళి. దేశ అభివృద్ధికి ఆయన అందించిన విస్తృత సేవలు చిరస్మరణీయం. అసాధారణమైన ప్రతిభ, జ్ఞానం ఆయన సొంతం’’
- ప్రధాని మోదీ
పాలనాదక్షుడు
‘‘చురుకైన పరిపాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, విప్లవాత్మక ఆర్థిక సంస్కరణల మార్గదర్శి అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు శతజయంతి సందర్భంగా నా నివాళి. మాతృభాషలో బోధనను ప్రోత్సహించారు. పీవీ సేవల్ని జాతి చిరకాలం గుర్తుపెట్టుకుంటుంది’’
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!