Water Dispute: ముదురుతున్న వివాదం
కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ అధికారులను తెలంగాణ పోలీసులు అనుమతించలేదు.
జూరాల నుంచి పులిచింతల వరకు ప్రాజెక్టులపై పహారా
రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలని కోరుతున్న తెలంగాణ
విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఆంధ్రప్రదేశ్ వినతి
ఈనాడు - హైదరాబాద్
న్యూస్టుడే యంత్రాంగం
కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ అధికారులను తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఆ ప్రాజెక్టు ఎస్.ఇ తెలంగాణ జెన్కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. జూరాల డ్యాంపైకి తెలంగాణ రాకపోకలు నిలిపివేయగా, ఆర్డీఎస్ కుడికాలువ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసు బలగాలను మోహరించింది. ఈ పనులను నిలిపివేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించగా, పోతిరెడ్డిపాడు వద్ద పోలీసులను పెంచి ఆంధ్రప్రదేశ్ ఎవరినీ అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల ఎస్పీలు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ గట్టిగా కోరుతోంది. అయితే 841 అడుగుల దిగువన ఉన్నప్పుడు నీటిని తీసుకోవడానికి అవకాశం లేదంటూ రాయలసీమ ప్రాజెక్టును కొనసాగించడానికి ఏపీ ప్రయత్నిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణాపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టడంతోపాటు పూర్తి స్థాయిలో జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలు పరస్పరం బోర్డుకు ఫిర్యాదులు చేసుకొంటూనే ఇంకోవైపు విద్యుదుత్పత్తి, ఆయకట్టుకు నీటివిడుదల, నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. వీటికి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జూరాల డ్యాంపై రాకపోకల నిషేధం
జూరాలలో పూర్తి స్థాయి నీటినిల్వ 9.66 టీఎంసీలు కాగా, 7.86 టీఎంసీలు ఉన్నాయి. 21,877 క్యూసెక్కుల నీరొస్తుండగా, 20,986 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. గురువారం మధ్యాహ్నానికి జూరాలలోకి ప్రవాహం తగ్గింది. జూరాల డ్యాంపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. ప్రభుత్వ వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. దీంతో మక్తల్, నారాయణపేట, ఆత్మకూరు తదితర ప్రాంతాలకు వెళ్లేవారికి ఇబ్బంది ఏర్పడింది. డ్యాం వద్ద, జలవిద్యుత్తు కేంద్రం వద్ద ప్రత్యేక పోలీసులను నియమించారు.
శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాల భద్రత
శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.55 టీఎంసీలు ఉన్నాయి. కనీస నీటిమట్టం 834 అడుగులు కాగా, 823.40 అడుగుల మట్టం ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి, స్థానికంగా కురిసే వర్షాలతో కలిపి బుధవారం ఉదయం ఆరుగంటల నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల్లో 30,610 క్యూసెక్కులు శ్రీశైలంలోకి రాగా, ఈ మొత్తం నీటిని బయటకు వదిలారు. విద్యుదుత్పత్తితో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడుగంటలకు జూరాల నుంచి 6,282 క్యూసెక్కులు, సుంకేశుల నుంచి 4446 క్యూసెక్కులు రాగా, శ్రీశైలం డ్యాం వద్ద 21 వేల క్యూసెక్కులు నమోదైంది. అయితే బయటకు మాత్రం 28,252 క్యూసెక్కుల నీటిని వదలడంతో శ్రీశైలంలో నీటిమట్టం కొంత తగ్గింది. జూరాల నుంచి విడుదల తగ్గడంతో శ్రీశైలంలోకి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణ 12.928 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసింది. మరోవైపు డ్యాం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసుభద్రత పెంచాయి. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసుభద్రతను పెంచినట్లు తెలిసింది.
ఏపీ అధికారులను అనుమతించని పోలీసులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా 176.06 టీఎంసీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కనీస నీటిమట్టం 510 అడుగులు కాగా, 534 అడుగుల మట్టం ఉంది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తితో 24 గంటల్లో సరాసరిన 27,533 క్యూసెక్కుల నీరు సాగర్కు వచ్చి చేరింది. సాగర్ నుంచి 32,190 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలారు. ఇక్కడ పూర్తి సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరేందుకు ఆంధ్రప్రదేశ్కు చెందిన నీటిపారుదల, పోలీసు, రెవిన్యూ అధికారులు యత్నించగా తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. జెన్కో సీఈని కలిసి వినతిపత్రం ఇవ్వాలని కోరగా, కలిసి వినతిపత్రం తీసుకునేందుకు అంగీకరించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అధికారులు వెనుదిరిగారు. సాగర్ డ్యాంపై తెలంగాణ పోలీసులు మోహరించారు.
పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలపాలని జెన్కో ఎస్ఈకి వినతి
పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా గురువారం ఉదయానికి 20.36 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తిద్వారా విడుదల చేస్తున్న నీటితో ఈ ప్రాజెక్టులోకి 24 గంటల్లో సరాసరిన 37,140 క్యూసెక్కులు వచ్చాయి. ఈ ప్రాజెక్టు వద్ద 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు ఆంధ్ర పర్యవేక్షణలో ఉండగా, ఇక్కడి విద్యుదుత్పత్తి తెలంగాణ జెన్కోకు సంబంధించినది. ఒక్కొక్కటి 30 మెగావాట్లతో 4 యూనిట్లు ఉండగా, ఒక్కొక్క దాంట్లో 15 మెగావాట్ల చొప్పున విద్యుదుత్పత్తి చేసి 3,229 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజిలో పూర్తి స్థాయి మట్టం ఉందని, ఇంకా డెల్టాకు నీటిని విడుదల చేయనందున పులిచింతలలో విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసే నీటిని వృథాగా సముద్రంలోకి విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి విద్యుదుత్పత్తి నిలిపివేయాలని పులిచింతల ఎస్.ఇ. జెన్కో ఎస్.ఇని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు మోహరించారు. మరోవైపు పులిచింతలలో విద్యుదుత్పత్తి నిలిపివేసేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. కృష్ణా డెల్టా అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యుదుత్పత్తి చేస్తే నీటిని సముద్రంలోకి వృథాగా వదలాల్సి వస్తుందని, నాగార్జునసాగర్, పులిచింతలలో విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేసే నీటిని తెలంగాణ వాటా కింద జమచేయాలని కూడా కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.