తలొగ్గిన గూగుల్, ఫేస్బుక్
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలకు అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సంస్థలూ తలొగ్గాయి. భారీ స్థాయిలో అభ్యంతరకర కంటెంట్ను తమ వేదికల నుంచి తొలగించాయి. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకొని, తొలి నెలవారీ నివేదికలను ప్రచురించాయి
అభ్యంతరకర సమాచారం తొలగింపు
కొత్త నిబంధనల ప్రకారం నెలవారీ నివేదిక
సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) నిబంధనలకు అంతర్జాతీయ సామాజిక మాధ్యమ సంస్థలు గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా ఇతర సంస్థలూ తలొగ్గాయి. భారీ స్థాయిలో అభ్యంతరకర కంటెంట్ను తమ వేదికల నుంచి తొలగించాయి. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకొని, తొలి నెలవారీ నివేదికలను ప్రచురించాయి. ఈ పరిణామంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఫేస్బుక్, గూగుల్, ఇన్స్టాగ్రామ్.. తదితర సంస్థలు కొత్త ఐటీ నిబంధనల ప్రకారం అభ్యంతరకర పోస్టులను స్వచ్ఛందంగా తొలగించి.. తొలి నెలవారీ నివేదికను ప్రచురించడం సంతోషకరం. పారదర్శకత దిశగా ఇదో పెద్ద ముందడుగు’’ అని రవిశంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. మే 26 నుంచి అమల్లోకి వచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం.. 50 లక్షలకు పైగా ఖాతాదారులున్న సామాజిక మాధ్యమ సంస్థలు అభ్యంతరకర సమాచారాన్ని(కంటెంట్) ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఫిర్యాదులు స్వీకరిస్తూ.. వాటిని పరిష్కరిస్తూ.. నెలవారీ నివేదికలను విడుదల చేయాలి. ఈ నిబంధనలను పాటించేందుకు ఫేస్బుక్, గూగుల్ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. ట్విటర్ అమలు చేయలేదు. దీంతో ఆ సంస్థకు కల్పించిన ‘సురక్షిత ఆశ్రయం’ హోదాను భారత్ రద్దు చేసింది. దీంతో ఎవరైనా ట్విటర్పై భారత శిక్షాస్మృతి కింద భారత న్యాయస్థానాల్లో చర్యలు తీసుకోవచ్చు.
ఫేస్బుక్ 3 కోట్లు.. ఇన్స్టా 20 లక్షలు
కొత్త ఐటీ నిబంధనల ప్రకారం.. 3 కోట్లకు పైగా కంటెంట్ (పోస్టులు, వీడియోలు, ఫొటోలు, కామెంట్లు)పై చర్యలు తీసుకున్నామని ఫేస్బుక్ తెలిపింది. దాని అనుబంధ సంస్థ ఇన్స్టాగ్రామ్ 20లక్షల కంటెంట్పై కొరడా ఝళిపించినట్లు పేర్కొంది. ఈ మేరకు నెలవారీ నివేదికను విడుదల చేశాయి. ఫేస్బుక్లో చర్యలు తీసుకున్న కంటెంట్లో అత్యధికం నకిలీ వార్తలకు సంబంధించినవే కావడం గమనార్హం. 2.5కోట్ల స్పామ్ సంబంధిత కంటెంట్, హింసను ప్రేరేపించేలా ఉన్న 25లక్షల పోస్టులు, నగ్నచిత్రాలు, లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన 18లక్షల కంటెంట్, విద్వేషాన్ని పెంచేలా ఉన్న 3లక్షల పోస్టులు, ఆత్మహత్యలకు సంబంధించి 5.8లక్షల పోస్టులు, వేధింపులు, ఉగ్రవాద ప్రచారానికి సంబంధించిన కంటెంట్పై చర్యలు తీసుకున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. ప్రస్తుతానికి ఇది మధ్యంతర నెలవారీ నివేదిక మాత్రమే అని, జులై 15న పూర్తి నివేదికను విడుదల చేస్తామని ఫేస్బుక్ తెలిపింది. తుది నివేదికలో వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై చేపట్టిన చర్యలతో పాటు వాట్సాప్కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తామని తెలిపింది. ఇటీవల గూగుల్ కూడా నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో తమకు యూజర్ల నుంచి 27వేలకు పైగా ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించి దాదాపు 60వేల పోస్టుల్లోని కంటెంట్ను తమ మాధ్యమం నుంచి తొలగించామని గూగుల్ తన నివేదికలో పేర్కొంది. ఇందులో అత్యధికంగా 96శాతం కాపీరైట్ ఉల్లంఘనకు సంబంధించినవే అని తెలిపింది.
త్వరలోనే ఫిర్యాదుల అధికారిని నియమిస్తాం
- దిల్లీ హైకోర్టుకు తెలిపిన ట్విటర్దిల్లీ: కొత్త ఐటీ నిబంధనలు అమల్లో జాప్యం చేస్తున్న ట్విటర్.. త్వరలోనే తాము నిబంధనల అమలును పర్యవేక్షించే ముఖ్య అధికారితో పాటు, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమిస్తామని దిల్లీ హైకోర్టుకు తెలిపింది. తాము ఇప్పటికే నియమించిన మధ్యంతర గ్రీవెన్స్ అధికారి గత నెల 21న పదవి నుంచి వైదొలిగారని న్యాయస్థానానికి తెలిపింది. దీంతో కొత్త అధికారిని నియమించే లోపు.. భారతీయ వినియోగదారుల సమస్యలను జనరల్ గ్రీవెన్స్ అధికారి ద్వారా పరిష్కరిస్తామని.. ఐటీ రూల్స్ పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్కు స్పందనగా ట్విటర్ తెలిపింది. దీనిపై విచారణను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వ నూతన ఐటీ చట్టాల ప్రకారం భారత్కు చెందిన వ్యక్తిని రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిగా నియమించాల్సి ఉంటుంది. వినియోగదారులు చేసే ఫిర్యాదులకు సదరు హోదాలో ఉన్న అధికారి స్పందించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్