Maoist Leader RK: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (60) అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన ఆయన తీవ్రమైన మధుమేహం, కీళ్ల
దీర్ఘకాలంగా అనారోగ్యం
మరణాన్ని ధ్రువీకరించిన పోలీసులు
ఈనాడు - హైదరాబాద్
మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే (60) అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన ఆయన తీవ్రమైన మధుమేహం, కీళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధితో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో గురువారం మృతి చెందారు. మూడేళ్లుగా ఆయన ఎముకల క్యాన్సర్తోనూ బాధపడుతున్నట్లు సమాచారం. ఆర్కే మరణాన్ని పోలీసులు ధ్రువీకరించారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న ఆయన ఆంధ్ర ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. 38 ఏళ్ల క్రితం ఉద్యమంలోకి వెళ్లిన ఆర్కే 2004లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన చర్చలకు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ప్రతినిధిగా హాజరయ్యారు. 2004 అక్టోబరు 15, 16, 17 తేదీల్లో చర్చలు జరిగాయి. ఆ ఘట్టం మొదలై శుక్రవారానికి సరిగ్గా 17 ఏళ్లు. సాకేత్, శ్రీనివాసరావు, ఎస్వీ, సంతోష్, గోపాల్, పంతులు ఆయన మారుపేర్లు.
చర్చల ప్రతినిధి
మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకమైన శాంతి చర్చల ప్రస్తావన రాగానే ఆర్కే గుర్తొస్తారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్వార్కు మూడు రాష్ట్ర కమిటీలు ఉండేవి. ఉత్తర తెలంగాణ నుంచి గాజర్ల రవి అలియాస్ గణేశ్, ఏవోబీ తరఫున సుధాకర్, ఆంధ్ర రాష్ట్ర కమిటీ వైపున రామకృష్ణ, జనశక్తి తరఫున రియాజ్ హాజరయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మూడు రోజులపాటు చర్చలు జరిగాయి.
ఆది నుంచీ ఉద్యమబాటే
గుంటూరు జిల్లా మాచర్లలో డిగ్రీ చదువుతున్నప్పుడు ఆయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొనేవారు. అప్పుడే ఆయనకు పీపుల్స్వార్తో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన 1983లో పీపుల్స్వార్లో చేరారు. అజ్ఞాతంలోకి వెళ్లి ఎక్కువగా నల్లమల అడవుల్లోనే పనిచేశారు. గుంటూరు జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ కమిటీ కార్యదర్శిగా 1996 నుంచి 2006 వరకు ఉన్నారు.2008 నుంచి 2016 వరకూ ఏవోబీ కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. అప్పటికే మావోయిస్టు ఉద్యమంపై పోలీసులది పైచేయి కావడం, వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతలు చనిపోవడంతో మావోయిస్టు కేంద్ర నాయకత్వం ముఖ్యమైన నాయకులను ఛత్తీస్గడ్లోని అబూజ్మడ్కు రమ్మని ఆదేశించింది. పదేళ్లుగా ఛత్తీస్గఢ్లోనే ఉంటున్న ఆయన కొంతకాలం సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగారు.
పెద్దసంఖ్యలో కేసులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తోపాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఆర్కేపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది చంద్రబాబునాయుడిపై అలిపిరిలో జరిగిన ఘటన. బలిమెలలో గ్రేహౌండ్స్ బలగాలపై జరిగిన దాడిలోనూ ఆర్కే నిందితుడు. ఆయనపై ఒడిశా రూ.20 లక్షలు, ఛత్తీస్గఢ్ రూ.40 లక్షలు, ఝార్ఖండ్ రూ.12 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.
వ్యక్తిగత జీవితం
ఉద్యమంలోనే కందుల నిర్మల అలియాస్ శిరీష అలియాస్ శారద అలియాస్ పద్మ అలియాస్ శిరీషతో పరిచయమైంది. పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.ఆమె డివిజన్కమిటీ సభ్యురాలిగా పనిచేశారు.
ఉద్యమంలోనూ ఉపాధ్యాయుడే
స్వతహాగా ఉపాధ్యాయుడైన ఆర్కే ఉద్యమంలోనూ అదే పంథా కొనసాగించారు. పెద్దమనిషి తరహాలో వ్యవహరిస్తూ ఉద్యమంలోకి వచ్చేవారికి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. దాదాపు 20 ఏళ్లపాటు నల్లమలలో పనిచేసి అక్కడి యువత ఉద్యమంపట్ల ఆకర్షితులు కావడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్ర కమిటీకి వెళ్లిన తర్వాత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ముఖ్యమైన సమావేశాలకు మాత్రం హాజరయ్యేవారు. మంచంమీద పడుకోబెట్టుకొని మరీ సహచరులు ఆయనను మోసుకుంటూ వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని సమాచారం.
చుట్టుముట్టిన గ్రేహౌండ్స్ బలగాలు
శాంతి చర్చలు ముగిసిన 15 రోజులకే ఆర్కేను గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుముట్టాయి. చిత్తూరు జిల్లాలోని శేషాచలం కొండల్లో ఆర్కే ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆయనను చుట్టుముట్టాయి. విషయం తెలియగానే విరసం నేత వరవరరావు మొదలు ప్రజాసంఘాల నేతలు హుటాహుటిన అప్పటి హోంమంత్రి జానారెడ్డిని కలిశారు. అయితే ఆర్కేని పోలీసు బలగాలు చుట్టుముట్టినట్లు పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.
తృటిలో తప్పించుకొని
2016 అక్టోబరు 23న ఒడిశాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆర్కే త్రుటిలో తప్పించుకున్నారు.ఈ ఘటనలో మొత్తం 30 మంది మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులు ఏర్పాటు చేసిన సమావేశంపై గ్రేహౌండ్స్ దళాలు విరుచుకుపడ్డాయి. అప్పటికే నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ తోటి మావోయిస్టుల సాయంతో ఈ సమావేశానికి హాజరయ్యారు. పోలీసులు కాల్పులు జరుపుతుండగానే సహచరులు ఆర్కేని తప్పించారు. అయినప్పటికీ ఆయకు బుల్లెట్ గాయం అయిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే ఎన్కౌంటర్లో ఆయన కుమారుడు పృథ్వీ అలియాస్ శివాజీ అలియాస్ మున్నా చనిపోయాడు. తల్లి శిరీషతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న మున్నా తండ్రిని కలిసి వస్తానని చెప్పి 2010లో ఒడిశా వెళ్లి ఉద్యమంలో చేరాడు. అంతకు ముందు కూడా ఆర్కే అనేకసార్లు పోలీసుల కాల్పుల నుంచి బయటపడ్డారు.
కుటుంబమంటే ఎంతో ఇష్టం
అన్నతో అనుబంధాన్ని ‘ఈనాడు’తో పంచుకున్న రాధేశ్యాం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: తల్లిదండ్రులు, సోదరులంటే ఆర్కేకు ఎంతో ఇష్టం. ఉద్యమం కోసం అడవుల బాటపట్టిన తొలినాళ్లలో వారిని చూడటానికి రహస్యంగా మూడుసార్లు హైదరాబాద్కు వచ్చి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు రాధేశ్యాం తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉంటున్న ఆయన, ఆర్కే చనిపోయారన్న విషయం తెలిసి, గురువారం ‘ఈనాడు’ ప్రతినిధితో మాట్లాడారు. మరో సోదరుడు సుబ్బారావుతో కలిసి అన్నతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన మాటల్లోనే... ‘‘ మా కుటుంబం 1980 దశకంలో హైదరాబాద్కు వచ్చింది. తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, సచ్చిదానందరావు. మేము ఆరుగురు సంతానం. అయిదుగురు మగపిల్లలు కాగా ఒక కుమార్తె. ఆర్కే పెద్దవాడు. తండ్రి కూడా ఆర్ఎస్యూ భావజాలం కలిగి ఉండేవారు. రాజేంద్రనగర్లోని స్ప్రింగ్ఫీల్డ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు. ఆర్కే అదే పాఠశాలలో 1980 నుంచి 1981 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తరువాత పీపుల్స్వార్లో చేరి అడవుల బాటపట్టారు. 1981-90 మధ్య తల్లిదండ్రులను చూసేందుకు పోలీసుల కళ్లుగప్పి మూడు సార్లు రాజేంద్రనగర్కు వచ్చారు. రోజంతా కుటుంబసభ్యులతో గడిపి రెండు పూటలా భోజనం చేసి వెళ్లారు. 1990 తరువాత ఒక్కసారి కూడా రాలేదు. చర్చల సమయంలో ఇంటికి వచ్చి తల్లిని, ఇతర కుటుంబసభ్యులను కలిసేందుకు ఆయన ఆసక్తి చూపినా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న అనుమానంతో పోలీసులు నిరాకరించారు. దాంతో కుటుంబ సభ్యులందరం చర్చల ప్రాంతానికే వెళ్లి అన్నను కలిసి మాట్లాడటం సంతృప్తి నిచ్చింది.మూడేళ్ల కిందట బలిమెల ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు పృథ్వీ చనిపోయినప్పుడు వెళ్లి వదినను కలిశాం. అతని అంత్యక్రియల్లో పాల్గొన్నాం. పోలీసుల నిఘా అధికంగా ఉండటం వల్ల కొన్నేళ్లుగా వదినతోకూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు.
అనుమతిస్తే అంత్యక్రియలకు సిద్ధం
ప్రస్తుతం ఇద్దరు సోదరులు నైజీరియాలో ఉండగా మరో సోదరుడు సుబ్బారావు, నేను రాజేంద్రనగర్లో ఉంటున్నాం. సోదరి ఎల్బీనగర్లో ఉంటోంది. తండ్రి సచ్చిదానందరావు 2003లో, తల్లి రాజ్యలక్ష్మి 2013లో చనిపోయారు. తల్లి చనిపోయినప్పుడు ఆర్కే వస్తాడేమోనన్న సమాచారంతో రాజేంద్రనగర్లో పోలీసులు కాపు కాశారు. ప్రస్తుతం తెరాస స్థానిక నాయకుడిగా కొనసాగుతున్నా. ఆర్కే చనిపోయిన విషయం అధికారికంగా గురువారం రాత్రి వరకు తెలియదు. వదినకు ఫోన్ చేద్దామంటే నంబరు లేదు. ప్రభుత్వాలు అవకాశమిస్తే ఆర్కే మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని రాధేశ్యాం వివరించారు.
చదువరి.. వామపక్షవాది
పల్నాడులోనే ఆర్కే విద్యాభ్యాసం
పీపుల్స్వార్ గ్రూపుతో పయనం
గురజాల, మాచర్ల, న్యూస్టుడే: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే విద్యాభ్యాసం పల్నాడులోనే సాగింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రెంటచింతల మండలం తుమృకోటలో 1 నుంచి 10వ తరగతి వరకు, మాచర్ల కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివారు. చదువుకునేటప్పుడు సౌమ్యుడిగా, చదువరిగా ఉండేవాడని ఆయనతోపాటు ఇంటర్, డిగ్రీ కలిసి చదువుకున్న ఓ న్యాయవాది వ్యాఖ్యానించారు.
* ఆర్కే మాచర్ల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివే సమయంలో రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశారు. డిగ్రీ తర్వాత గుత్తికొండకు వెళ్లారు. రామకృష్ణ గుత్తికొండలో ప్రైవేటు టీచరుగా పనిచేస్తూ విద్యార్థులను పీపుల్స్వార్ ఉద్యమంలోకి తీసుకొచ్చారు. మావోయిస్టు ఉద్యమ వ్యవస్థాపకుడు చారుమజుందార్ను తీసుకొచ్చి గుంటూరు వైద్యకళాశాలలో సమావేశం నిర్వహించారు.
సారాపై ఉద్యమం
పల్నాడులో ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా ఆర్కే ఉద్యమించారు. పల్నాడు కేంద్రంగా సారా గుత్తేదారులపై దాడులకు పాల్పడి వానని గ్రామాల నుంచి తరిమేశారు. పల్నాడులో ఫ్యాక్షనిజం రూపుమాపడానికి కృషిచేశారు. ఆయన భావాలకు ఆకర్షితులై జూలకల్లు, పిడపర్తివారిపాలెం, గుంటూరు నగరానికి చెందిన డేవిడ్, నూనె నరసింహారెడ్డి, అప్పారావు, చింతల వెంకటస్వామి వంటి ప్రధాన నేతలు ఆయనతో పాటు మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత