The Great Resignation: మనసు విరిగిన ఉద్యోగి
కొవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది. భయానక జీవన పరిస్థితులను కళ్లకు కట్టింది. కుటుంబం విలువేమిటో, డబ్బు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో
కొవిడ్ పాఠాలతో కొత్త మార్గాల అన్వేషణ
ప్యాకేజీలు పెంచినా ఆగని రాజీనామాలు
అగ్రదేశాల్లో ‘ది గ్రేట్ రెజిగ్నేషన్’ సునామీ!
వాషింగ్టన్: కొవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త పాఠం నేర్పింది. భయానక జీవన పరిస్థితులను కళ్లకు కట్టింది. కుటుంబం విలువేమిటో, డబ్బు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించింది. మహమ్మారి పుణ్యమాని అనేకమంది కొలువులు కోల్పోయారు. కంపెనీల ఆదాయం తగ్గడంతో.. ఉద్యోగాలు ఉన్నా, వేతన జీవులకూ వెతలు తప్పలేదు. కరోనా నెమ్మదించి, ప్రస్తుతం వ్యాపారాలు పుంజుకొంటున్నాయి. ఆకర్షణీయ జీతాలు, ప్యాకేజీలు ఇస్తామని ఇప్పుడు కంపెనీలు ప్రకటిస్తున్నా... చాలామంది ఉద్యోగులు ఉండటం లేదు. కొలువులను ధైర్యంగా వదిలేసి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. ‘ది గ్రేట్ రిజిగ్నేషన్’గా పిలిచే ఈ సంక్షోభం అగ్రరాజ్యాలను కుదిపేస్తోంది.
ఏ రంగాల్లో అంటే..
రిటైల్, గోదాములు, రెస్టారెంట్లు, హెల్త్కేర్ విభాగాల్లో మాత్రం రిజిగ్నేషన్లు రికార్డుస్థాయిలో ఉంటున్నట్టు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. ఇలాంటి వారిలో తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ పరిణామాన్ని ‘ఒత్తిడి వాతావరణంలో పనిచేస్తున్నా తక్కువ వేతనాలు అందడంపై తిరుగుబాటు’గా వాషింగ్టన్ పోస్టు పత్రిక పేర్కొంది. టెక్సాస్లో ఓ మహిళ వాల్మార్ట్పై ఆరోపణలుచేస్తూ టిక్టాక్లో ఓ వీడియో పెట్టింది. దీంతో ఆ సంస్థ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అగ్రరాజ్యంలో మహిళలు భారీ సంఖ్యలో కొలువులను వీడుతున్నట్లు కార్మిక విభాగ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కరోనా సమయంలో పని వాతావరణానికి ప్రాధాన్యం పెరగడం కూడా ఉద్యోగుల రాజీనామాలకు కారణమవుతున్నట్టు ‘స్టేట్ ఆఫ్ వర్క్ ఇన్ అమెరికా’ సర్వేలో వెలుగులోకి వచ్చింది.
పరిశ్రమలకు తిప్పలు..
అమెరికాలో గత ఆగస్టు నాటికి 1.4 కోట్ల కొలువులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు ఉన్న ఉద్యోగులను కాపాడుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తూనే, మరోవైపు ప్రతిభావంతులను భారీ జీతాలు ప్రకటిస్తున్నట్టు ప్రొఫెసర్ ఆంటోనీ క్లాట్జ్ పేర్కొన్నారు. అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా రెస్టారెంట్లు, బార్లలో పనిచేసేవారి గంట వేతనం 15 డాలర్లకు చేరడం గమనార్హం! అమెజాన్, సీవీసీ, వాల్గ్రీన్స్ కూడా ఇంతే మొత్తం చెల్లిస్తున్నాయి. ఐరోపా విషయానికొస్తే... కొవిడ్ సంబంధిత రాజీనామాలు అత్యధికంగా జర్మనీలో నమోదయ్యాయి. అక్కడ మొత్తం 6% మంది కొలువులను వదిలేశారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్ (4.7%), నెదర్లాండ్స్ (2.9%), ఫ్రాన్స్ (2.3%), బెల్జియం(1.9%) నిలిచాయి.
ఏమిటీ రాజీనామాల పర్వం?
‘ది గ్రేట్ రిజిగ్నేషన్’ అనే పదాన్ని తొలిసారిగా 2019లో టెక్సాస్లోని ఏ-అండ్-ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆంటోనీ క్లాట్జ్ ప్రయోగించారు. మహమ్మారి మందగించిన తర్వాత కోట్ల సంఖ్యలో ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేస్తారని అంచనా వేశారు. సరిగ్గా ఇప్పుడు అదే నిజమవుతోంది! ఒక్క అమెరికాలోనే గత ఆగస్టులో 43 లక్షల మంది తమ కొలువులకు రాజీనామా చేశారు. ఆ దేశ ఉద్యోగాల్లో ఈ సంఖ్య 2.9 శాతమని కార్మిక విభాగం గురువారం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో 50% మంది ఉద్యోగులు కొత్త కొలువుల కోసం చురుగ్గా వేట మొదలుపెట్టారని ‘గాల్ అప్’ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 40% మంది ఉద్యోగులు.. రాజీనామా చేయడం/కంపెనీ మారడంపై ఆలోచిస్తున్నట్టు గత మార్చిలోనే మైక్రోసాఫ్ట్ సర్వేలో తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.