Huzurabad By Election: కిషన్రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత
హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న ప్రచారంలో తెరాస, భాజపా శ్రేణులు ఘర్షణకు దిగాయి...
హుజూరాబాద్ నియోజకవర్గంలో తెరాస, భాజపా వర్గాల ఘర్షణ
ఈనాడు డిజిటల్, కరీంనగర్, జమ్మికుంట గ్రామీణం, న్యూస్టుడే: హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ నిర్వహిస్తున్న ప్రచారంలో తెరాస, భాజపా శ్రేణులు ఘర్షణకు దిగాయి. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో మంత్రి వాహన శ్రేణికి ముందు తెరాస నాయకులు, కార్యకర్తలు భాజపా అభ్యర్థి ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భాజపా శ్రేణులు కూడా తెరాస వైఖరిని నిరసిస్తూ ప్రతి నినాదాలిచ్చారు. మాటలు మీరుతూ ఉభయవర్గాలు తోసుకున్నాయి. ఎస్సై తిరుపతి సహా సిబ్బంది నిలువరించే ప్రయత్నం చేశారు. సుమారు 15 నిమిషాలపాటు అక్కడ గందరగోళం నెలకొంది. తెరాస కార్యకర్త ఎస్సైను వెనక్కి నెట్టడంతో ఆయన.. అతడిపై చేయి చేసుకున్నారు. కొద్దిసేపటికి ఇరువర్గాలు శాంతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ గొడవ తర్వాత వాహనంపై నుంచి ఈటల, కిషన్రెడ్డి ప్రసంగించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘‘మేము ఎన్నికల నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని ప్రచారం నిర్వహిస్తుండగా, మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై తెరాస నాయకులు దాడికి పాల్పడడం సరైన పద్ధతి కాదు. ఇక్కడ తెరాస అరాచకాలకు ఇది నిదర్శనం’’ అని అన్నారు.
కేసు నమోదు: కేంద్రమంత్రి ప్రచారానికి అడ్డుతగిలి గొడవకు కారణమైన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఇల్లందకుంట ఎస్సై తిరుపతి తెలిపారు. తన చొక్కా పట్టుకుని వెనక్కి తోసిన తెరాసకు చెందిన ప్రవీణ్తోపాటు ఈ ఆందోళనకు కారణమైన మరికొందరిని వీడియో ఆధారంగా గుర్తించి కేసు నమోదు చేస్తామని తెలిపారు.
ఈసీకి ఫిర్యాదు చేశాం: సంజయ్
హుజూరాబాద్ పట్టణం, న్యూస్టుడే: సిరిసేడులో కిషన్రెడ్డి ప్రచారం చేస్తుండగా తెరాస శ్రేణులు దాడులకు పాల్పడటం దుర్మార్గపు చర్య అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. శుక్రవారం రాత్రి హుజూరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దాడి జరిగిందని, ఉప ఎన్నిక వాయిదా వేసేందుకే ఇటువంటి వాటికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
భాజపా దాడిని ఖండిస్తున్నాం: పల్లా
జమ్మికుంట గ్రామీణం: సిరిసేడులో తెరాస కార్యకర్తలపై భాజపా కార్యకర్తలు దాడి చేశారని దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘తెరాస కార్యాలయం ముందు నుంచి ఈటల రాజేందర్ ర్యాలీగా వెళ్తూ భాజపా కార్యకర్తలతో కేసీఆర్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు చేయించారు. అయినప్పటికీ తెరాస కార్యకర్తలు సంయమనం పాటించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, అభ్యర్థి ఈటల రాజేందర్ భాజపా కార్యకర్తలను రెచ్చగొట్టి తెరాస శ్రేణులపై దాడి చేయించడమే కాకుండా అక్రమ కేసు బనాయించారు’’ అని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ