TS News: సభలో సలసల
బియ్యం సేకరణ అంశం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో సలసలా మరిగింది. అటు లోక్సభ, ఇటు రాజ్యసభలోనూ ప్రధాన చర్చగా మారింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బియ్యం ఎంత కొంటారో చెప్పాలంటూ తెరాస సభ్యులు కేశవరావు, కేఆర్ సురేష్రెడ్డి కేంద్రమంత్రిపై ....
బియ్యం కొనుగోలుపై పార్లమెంటులో వాడీవేడీ..
ఏడాదికెంత సేకరిస్తారో తేల్చాలని ఉభయ సభల్లో నిలదీసిన తెరాస
కొత్త రాష్ట్రం సమస్యలను ఆలకించాలని కేంద్రాన్ని కోరిన టీఎంసీ ఎంపీ
మద్దతు పలికిన శివసేన, కాంగ్రెస్, బీజేడీ, ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం
ఇవ్వాల్సిన బియ్యమే తెలంగాణ ఇంకా ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి గోయల్
మంత్రి సమాధానంపై అసంతృప్తి.. తెరాస ఎంపీల వాకౌట్
బియ్యం సేకరణ అంశం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో సలసలా మరిగింది. అటు లోక్సభ, ఇటు రాజ్యసభలోనూ ప్రధాన చర్చగా మారింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో బియ్యం ఎంత కొంటారో చెప్పాలంటూ తెరాస సభ్యులు కేశవరావు, కేఆర్ సురేష్రెడ్డి కేంద్రమంత్రిపై ప్రశ్నాస్త్రాలు సంధించగా, లోక్సభలో ఆ పార్టీ పక్షనేత నామా నాగేశ్వరరావు రాష్ట్ర సమస్యపై కేంద్ర మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పట్టుబట్టారు. ఉదయం సభా సమయానికి ముందు గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేసిన ఎంపీలు సభలోకి అడుగుపెట్టిన తర్వాతా అదే పంథాను కొనసాగించారు. రైతు సమస్యలపై పోరాడుతున్న తమకు మద్దతివ్వాలంటూ నామా చేసిన విన్నపానికి లోక్సభలోని వివిధ పక్షాల నేతలు, రాజ్యసభలో బీజేడీ సభ్యులు మద్దతుగా నిలిచారు. ఎట్టకేలకు రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్గోయల్ సమాధానమిచ్చారు. ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని లేఖ ఇచ్చి ఇప్పుడు ఈ అంశంపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈ రబీలో ఎంత కొంటారనే అంశంపై కేంద్రమంత్రి స్పష్టమైన ప్రకటన చేయనందుకు నిరసనగా రాజ్యసభ నుంచి, ఐదు రోజులుగా తాము చేస్తున్న డిమాండ్పై కేంద్రం తన వైఖరిని వెల్లడించనందుకు లోక్సభ నుంచి తెరాస ఎంపీలు వాకౌట్ చేశారు. మొత్తంగా తెరాస ఎంపీల పోరాటం శుక్రవారం తారస్థాయికి చేరింది. ఈ అంశంపై స్వల్ప కాలిక చర్చకోసం ఉభయసభలలో నోటీసులు ఇవ్వాలని ఎంపీలు నిర్ణయించారు.
ఎంత కొంటారో తేల్చండి
లోక్సభలో నామా, రాజ్యసభలో కేకే డిమాండ్
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్ల అంశంపై లోక్సభలో శుక్రవారం తెరాస ఎంపీలు ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ నుంచి ఏడాదికి ఎంత మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని తెరాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలకు తెరాస నినాదాలు ఆటంకంగా మారుతుండడంతో సభాపతి ఓం బిర్లా మాట్లాడేందుకు నామాకు అవకాశం ఇచ్చారు. గత అయిదు రోజులుగా తాము తెలంగాణ రైతుల సమస్యలపై ఆందోళన చేస్తున్నామని, రైతుల దగ్గర నుంచి ఎంత ధాన్యం కొంటారో సంబంధిత మంత్రితో సభలో స్పష్టమైన ప్రకటన చేయించాలని నామా కోరారు. ధాన్యం కొనుగోళ్లపై ఒక్కో మంత్రి ఒక్కో ప్రకటన చేస్తున్నారన్నారు. ఈ సమయంలో సభాపతి మైక్ ఆపేయడంతో ఆగ్రహించిన తెరాస సభ్యులు మరింత పెద్దగా నినాదాలు చేస్తూ వెల్లో బైఠాయించారు. ఈ కారణంగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుండడంతో విపక్ష నేతలు స్పందించారు. తొలుత తృణమూల్ లోక్సభ పక్ష నేత సుదీప్ బందోపాధ్యాయ ఈ అంశంపై సభాపతిని సమయం కోరారు. ‘తెలంగాణ కొత్త రాష్ట్రం. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. వారు కొన్ని సమస్యలు లేవనెత్తుతున్నారు. ఒక పార్టీకి చెందిన ఎంపీలు వెల్లోకి వచ్చి నిరంతరంగా నినాదాలు చేస్తున్నారు. సంబంధిత మంత్రి స్పందించి తగిన సమయంలో జవాబు ఇస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఈ విషయంపై మీరు దృష్టిసారించాలని’’ సభాపతి ఓం బిర్లాను కోరారు. కాంగ్రెస్, బీజేడీ, శివసేన, ఎస్పీ, బీఎస్పీ, సీపీఎం సభ్యులు మద్దతు పలికారు. ఆందోళనకు విపక్షాలు మద్దతు పలకడంతో జీరో అవర్లో నామా నాగేశ్వరరావుకు మరోసారి మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ ‘‘పార్లమెంటు సమావేశాలకు ముందు 28వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లోనూ తెలంగాణలో ధాన్యం సేకరణ సమస్యను వివరించాం. వేడి వాతావరణంతో రాష్ట్రంలో యాసంగిలో ఉప్పుడు బియ్యమే వస్తాయి. అవి వద్దంటున్నారు. అందువల్లనే ఒక ఏడాదిలో ఎంత మొత్తం, ఏఏ రకాలు సేకరిస్తారో చెప్పాలని కోరాం. మీ ద్వారా ప్రభుత్వం నుంచి సమస్య పరిష్కారాన్ని కోరుతున్నాం’’ అని విజ్ఞప్తి చేశారు. నామా మాట్లాడిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెరాస ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ఒక దశలో ఫ్లకార్డులు చించి, వెల్లోకి విసిరి సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభలో నిలదీసిన కేకే, సురేష్రెడ్డి
రాజ్యసభలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఆ పార్టీ ఎంపీ కె.ఆర్. సురేష్రెడ్డి ధాన్యం సేకరణ అంశాన్ని లేవనెత్తారు. ‘‘బియ్యం రకాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ నుంచి మొత్తం కొనుగోలుచేయడానికి సిద్ధంగా ఉందా? లేదా? కేంద్ర కేబినెట్ మంత్రి (కిషన్రెడ్డి) ప్రతి బియ్యం గింజనూ కొంటామని చెప్పారు. దానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా? గత ఏడాది 94 లక్షల టన్నులు తీసుకున్నారు. ఈసారి కూడా కనీసం గత ఏడాది తీసుకున్న 94 లక్షల టన్నులైనా తీసుకుంటారా? లేదా?’’ అనినిలదీశారు. స్పందించిన కేంద్ర మంత్రి మంత్రి పీయూష్గోయల్ సమాధానమిచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రం బియ్యం ఇవ్వలేదని, ఇప్పుడు భవిష్యత్తులో సేకరించేదాని గురించి మాట్లాడుతూ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.కేంద్ర మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తూ తెరాస సభ్యులు ఆయన సమాధానం పూర్తయిన వెంటనే వాకౌట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన్లో సాయంత్రం తెలంగాణ ఎంపీలు విలేకరులతో మాట్లాడారు.
తిప్పితిప్పి అదే సమాధానం: కె.కేశవరావు
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తిప్పితిప్పి అదే సమాధానం ఇస్తున్నారు. రైతు ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదు. రైతు, పేదల వ్యతిరేక ప్రభుత్వం ఇది. కేంద్రం స్పష్టమైన ప్రకటన ఇచ్చేంతవరకూ ఆందోళనలు ఉపసంహరించుకోబోం.
కుట్రపూరిత వ్యవహారం: నామా
వానాకాలం, యాసంగి పంటల కొనుగోలుపై భాజపా నేతలు కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో ఒకలా మాట్లాడుతున్నారు. పరిశ్రమలను అమ్ముతూ కార్మికులకు, ధరలు పెంచుతూ పేదలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రైతుల విషయంలోనూ అలానే ప్రవర్తిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ