AP News: విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు
ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లోని పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో హైడ్రామా నడుమ సోదాలు నిర్వహించింది.
దాదాపు 10 గంటల పాటు హైదరాబాద్లో తనిఖీలతో ఉత్కంఠ
కళ్లుతిరిగి పడిపోయిన మాజీ అధికారి
ఆసుపత్రికి తరలింపు..
గంటా సుబ్బారావు ఫాంహౌస్లోనూ..
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే-షాబాద్: ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్లోని పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో హైడ్రామా నడుమ సోదాలు నిర్వహించింది. విచారణ సందర్భంగా ఉద్వేగానికి గురైన లక్ష్మీనారాయణ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు పది గంటల పాటు సోదాలు చేసిన సీఐడీ అధికారులు.. తిరిగి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అదే సమయంలో.. చంద్రబాబు హయాంలో ఐటీ సలహాదారుగాను, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్లోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు.
గురువారమే హైదరాబాద్కు సీఐడీ బృందం
లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాల కోసం సీఐడీ పోలీసులు గురువారమే హైదరాబాద్ చేరుకుని, అదే రోజు రాత్రి జుబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించారు. మర్నాడు తాము సోదాలు చేస్తామని, ఓ మహిళా కానిస్టేబుల్ను, మరో ఇద్దరు పోలీసు సిబ్బందిని తమకు సహాయంగా పంపాలని కోరారు. ఇందుకు తాము ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని, ఇతర వివరాలు కూడా కావాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరారు. అయితే సోదాలు ఎక్కడ చేయాలన్న సమాచారం తమకు సీల్డ్ కవర్లో అందాకే వివరాలు అందించగలమని సీఐడీ సిబ్బంది చెప్పి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ పోలీసుల సాయం తీసుకోకుండానే... డీఎస్పీ ధనుంజయుడు, సీఐ జీవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలోని దాదాపు పదిమంది పోలీసు బృందం జూబ్లీహిల్స్ నవనిర్మాణ నగర్లో ప్లాట్ నెంబర్ 108లో నివసించే విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకుంది.
లక్ష్మీనారాయణ, ఆయన కుటుంబసభ్యులు పోలీసులను లోనికి రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. నోటీసులు ఇవ్వకుండా.. వచ్చింది ఎవరో తెలియకుండా, వారెంట్ లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించబోమన్నారు. సీఐడీ పోలీసులు తమ వద్ద ఉన్న పత్రాలను చూపించడంతో లక్ష్మీనారాయణ వారిని ఇంట్లోకి అనుమతించారు. ఈ క్రమంలోనే సీఐడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని లక్ష్మీనారాయణ ఇంట్లో ఉన్న పని మనుషులు ఆరోపించారు. సోదాల్లో భాగంగా కంప్యూటర్ హార్డ్ డిస్కు, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు సిబ్బంది సోదాలు చేస్తుండగా మరికొందరు లక్ష్మీనారాయణను ప్రశ్నించడం మొదలుపెట్టారు. సోదాల విషయం తెలుసుకున్న తెదేపా నేతలు పయ్యావుల కేశవ్, కాట్రగడ్డ ప్రసూన, జీవీజీ నాయుడు, పొగాకు జయరాం తదితరులు అక్కడికి చేరుకున్నారు. సీఐడీ పేరుతో కుట్రకు పాల్పడుతున్నారని, గో బ్యాక్ సీఐడీ అంటూ నినాదాలు చేశారు. దీంతో తమకు భద్రత కావాలంటూ సీఐడీ అధికారులు అప్పుడు జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించారు. ముందుగా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పినా పట్టించుకోకుండా సోదాలకు వెళ్లడంపై జుబ్లీహిల్స్ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసు సిబ్బందిని లక్ష్మీనారాయణ ఇంటికి పంపారు. వారు వచ్చిన తర్వాత నినాదాలు చేస్తున్న తెలుగుదేశం నాయకులను శాంతింపజేసి, అక్కడి నుంచి పంపించారు. ఇదే సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అక్కడకు వచ్చారు. ‘మీరు ఇక్కడ ఉంటే లక్ష్మీనారాయణ సహకరిస్తారు. త్వరగా పని పూర్తిచేసుకొని వెళ్తాం’ అని సీఐడీ అధికారులు కోరడంతో ఆయన అక్కడ కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. అనంతరం సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణను ప్రశ్నించడం కొనసాగించారు. ఈ క్రమంలో ఉద్వేగానికి గురైన ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై పడిపోయారు. తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు స్టార్ ఆసుపత్రిలో పనిచేసే తమ కుటుంబ వైద్యుడు దిలీప్కు ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. ఆ వెంటనే ఆయన అక్కడకు చేరుకొని లక్ష్మీనారాయణకు వైద్యపరీక్షలు చేశారు. రక్తపోటు పెరిగినట్లు గుర్తించారు. అక్కడే కొన్ని వైద్యపరీక్షలు, ప్రాథమిక చికిత్స చేశారు. ఆయనను ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించినా సీఐడీ అధికారులు అంగీకరించక, ఇంట్లోనే వైద్యం అందించాలని కోరారు. అయితే లక్ష్మీనారాయణకు గతంలో రెండు శస్త్రచికిత్సలు జరగడం, రక్తపోటు పెరగడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యబృందం స్పష్టం చేసింది. కుటుంబసభ్యులు కూడా సీఐడీ అధికారులను నిలదీశారు. అనారోగ్యంతో పడిపోయినా ఆసుపత్రికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. చివరకు సీఐడీ అధికారులు అంగీకరించడంతో ఆయనను బంజారాహిల్స్లోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అనంతరం సీఐడీ బృందంలోని కొందరు సభ్యులు తాము స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, ఇతర పత్రాలు తీసుకొని రెండు వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోగా మరికొందరు కొద్దిసేపు లక్ష్మీనారాయణ ఇంట్లోనే ఉండి, సాయంత్రం 6 గంటల సమయంలో వెళ్లారు. ఈ నెల 13న ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణకు తమ ఎదుట హాజరుకావాలంటూ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు నోటీసు అందించారు.
నాకు మాత్రమే నోటీసు ఇవ్వడం ఏంటి?
నైపుణ్యాభివృద్ధి సంస్థలో తాను సంచాలకుడిగానే పనిచేశానని, అప్పుడు గౌరవ వేతనం కూడా తీసుకోలేదని లక్ష్మీనారాయణ చెప్పారు. తన ఇంటి వద్ద విలేకర్లతో మాట్లాడుతూ, ఈ సంస్థలో ఛైర్మన్తో పాటు ఐదుగురు కార్యదర్శులు ఉన్నారని, వీరిలో కొందరు ఇప్పటికీ పనిచేస్తున్నారన్నారు. వారందరినీ వదిలేసి తనకు నోటీసులు ఇవ్వడం ఏంటని పోలీసులను ప్రశ్నించానన్నారు.
కక్ష సాధించాలంటే మొదట్లోనే చర్యలుండేవి కదా?: సజ్జల
ఈనాడు, అమరావతి: ‘నిజంగా కక్ష సాధింపులకు దిగాలనుకుంటే.. మేం 2019 మే నెలలో అధికారంలోకి వచ్చాం. అదే ఏడాది డిసెంబరులోపే వీళ్లందరిపై కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టేవాళ్లం. తెదేపా హయాంలో పోలవరం సహా మామూలు దోపిడీ చేశారా? మేం కక్ష సాధింపునకు దిగలేదు కాబట్టే ఇప్పుడు చర్యలకు రెండేళ్లకు పైనే పట్టింది’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు కక్షసాధింపు చర్యలన్న తెదేపా నేతల వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా సజ్జల పైవిధంగా స్పందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు