Omicron: గాలి ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తి
ఒమిక్రాన్ వేరియంట్ అతి వేగంగా విస్తరిస్తోందని.. దీనిబట్టి ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమవుతోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలో అతి సూక్ష్మరేణువులు కొద్దిసేపు తేలియాడుతుంటాయనీ,
ఇంటాబయటా మాస్కు తప్పనిసరి
సోకిన వారిద్దరూ విదేశీయులే
త్వరలో ఆంక్షలుండొచ్చు.. లాక్డౌన్ ఉండదు
ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ అతి వేగంగా విస్తరిస్తోందని.. దీనిబట్టి ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు స్పష్టమవుతోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలో అతి సూక్ష్మరేణువులు కొద్దిసేపు తేలియాడుతుంటాయనీ, ఆ సమయంలో అక్కడి గాలిని పీల్చినవారికి ఈ వేరియంట్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. అందుకే ఇంటాబయటా మాస్కు ధరించడం తప్పనిసరని చెప్పారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన ఇద్దరు విదేశీయుల్లోనే ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిందనీ, రాష్ట్ర ప్రజల్లో ఒక్కరిలోనూ నమోదుకాలేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ నిర్ధారణ అయిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవనీ, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. బుధవారం కోఠిలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు.
ఆందోళన అవసరం లేదు
‘‘ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ప్రభుత్వం ఇప్పటికే సన్నద్ధమైంది. రోజూ సుమారు 40 వేల పరీక్షలు చేస్తుండగా.. వీటిని 50-60 వేలకు పెంచాలని నిర్ణయించాం. లక్షణాలున్న వ్యక్తులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొవిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయి. అందుకే హోంఐసోలేషన్ కిట్లనూ సమృద్ధిగా సమకూర్చుకున్నాం. 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సొంతంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని సాధించాం. ఈ వేరియంట్ అక్కడక్కడా వ్యాక్సిన్ నుంచి కూడా తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి మన చేతుల్లో అన్నింటికంటే పదునైన ఆయుధం మాస్కు. గత కొద్దిరోజుల్లో మాస్కు ధరించే వారి సంఖ్య దాదాపు 50 శాతానికి పెరిగింది. రానున్న రోజుల్లో 100 శాతం మంది మాస్కు ధరించాలి. ఒకవేళ వైరస్ బారినపడ్డా ప్రాణాలు కోల్పోకుండా వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తాయని నిరూపణ అయింది.
విమానాశ్రయంలో పరీక్షలను మరింత బలోపేతం చేస్తాం. ముప్పు లేని దేశాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వస్తే హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశాలున్నాయి. ఒమిక్రాన్ రకం అని తేలితే అప్పుడు ఆసుపత్రిలో చేర్చాలి. రాబోయే రోజుల్లో లాక్డౌన్ ఉండే పరిస్థితుల్లేవు. అవసరమైన చోట ఆంక్షలుంటాయి. ప్రభుత్వం మూడోదశ ఉద్ధృతిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంది’’ అని శ్రీనివాసరావు తెలిపారు.
కొత్తగా 186 కొవిడ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా 186 కొవిడ్ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 6,78,874కు పెరిగింది. ముప్పు దేశాల నుంచి బుధవారం 1,248 మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాగా.. వీరికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఒమిక్రాన్ ఉందా? లేదా? అని తేల్చడానికి జన్యుక్రమ విశ్లేషణ కోసం ముగ్గురి నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. ఈ ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. ఈ నెల 15న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కొవిడ్ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు బుధవారం విడుదల చేశారు. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయగా.. ఇప్పటి వరకూ 4,010 మంది మృతిచెందారు.
అవసరాన్ని బట్టి ఇంటింటికీ వ్యాక్సిన్లు: మంత్రి హరీశ్రావు
ఈనాడు డిజిటల్, సిద్దిపేట: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం సిద్దిపేట పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గర్భిణులు టీకా తీసుకోవద్దనే అపోహలు వీడాలన్నారు. అవసరాన్ని బట్టి సిబ్బంది ఇంటింటికీ వచ్చి వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట