Marriage Age: యువతులకు పెళ్లి @ 21
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహ వయసు రూపంలో ఎదురవుతున్న వివక్ష ఇక తొలగిపోనుంది. ఈ అంశంలోనూ ఏకరూపత తీసుకొచ్చేలా యువతుల కనీస పెళ్లి వయసును 18
కనీస వివాహ వయసు పెంపు
కేంద్ర మంత్రిమండలి ఆమోదం
1978 తర్వాత బాలికల పెళ్లి వయసులో మార్పు ఇప్పుడే
ఈనాడు, దిల్లీ: పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న మహిళలకు వివాహ వయసు రూపంలో ఎదురవుతున్న వివక్ష ఇక తొలగిపోనుంది. ఈ అంశంలోనూ ఏకరూపత తీసుకొచ్చేలా యువతుల కనీస పెళ్లి వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం పెంచనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశం దీనికి ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా బాల్య వివాహాల నిరోధక చట్టం-2006, ప్రత్యేక వివాహాల చట్టం, హిందూ వివాహాల చట్టం-1955లకూ కేంద్ర ప్రభుత్వం తగిన సవరణలు చేయనుంది. పార్లమెంటు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే సవరణ బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది చట్టరూపం దాల్చితే యువకులతో సమానంగా యువతుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా మారుతుంది. ఆ వయసు కన్నా ముందే పెళ్లి చేయడం నేరమవుతుంది.
ఏడాది క్రితమే ప్రస్తావించిన ప్రధాని
మహిళల కనీస వివాహ వయసును పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ గత ఏడాది ఎర్రకోటపై నుంచి చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ 2020-21 బడ్జెట్ ప్రసంగంలోనూ యువతుల పెళ్లి వయసు పెంచబోతున్నామనే సంకేతాన్నిచ్చారు. బాలికల వివాహ వయసును 15 నుంచి 18 ఏళ్లకు పెంచుతూ 1978లో నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు.
లక్ష్యం జనాభా నియంత్రణ కాదు: జయా జైట్లీ
మహిళల కనీస వివాహ వయసును పెంచడం వెనుక కారణం జనాభా నియంత్రణ కాదని జయా జైట్లీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. మహిళలకు సాధికారత కల్పించడం కోసమే వారి వివాహ వయసు పెంచాలని సిఫార్సు చేసినట్లు వివరించారు. సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలైన జయా జైట్లీ నేతృత్వంలో టాస్క్ఫోర్స్ నిపుణుల బృందం యువతుల వివాహ వయసు నిర్ధారణకు దేశ వ్యాప్తంగా విస్తృత సంప్రదింపులు జరిపింది.
కొనసాగుతున్న బాల్యవివాహాలు..
యువతుల కనీస వివాహ వయసు 18 ఏళ్లు అమల్లో ఉన్నా బాల్యవివాహాలు ఆగడం లేదు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, చదువుకుంటే ఎక్కువగా కట్నాలు ఇవ్వాల్సి ఉంటుందని చిన్నవయసులో పెళ్లిళ్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమల్లోకి తెచ్చిన తరువాత కొంత వరకు బాల్యవివాహాలు తగ్గినా.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 20-24 ఏళ్లలోపు మహిళల్లో 23.5 శాతం మందికి 18 ఏళ్లలోపు వివాహాలు జరిగినట్లు వెల్లడైంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో వెయ్యికి పైగా బాల్యవివాహాలు పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. 15-19 ఏళ్ల వయసులో గర్భం దాల్చుతున్న బాలికలు 5.8 శాతం మంది ఉన్నారు.
యువతుల ఆరోగ్యానికి మేలు
- డాక్టర్ బాలాంబ, ప్రముఖ గైనకాలజిస్టు
అమ్మాయిల వివాహ వయసు 21 ఏళ్లకు పెంచడంతో ఆరోగ్యపరంగా వారికెంతో మేలు జరుగుతుంది. 20-21 ఏళ్ల వయసులో అమ్మాయిల్లో పునరుత్పత్తి అవయవాల ఎదుగుదల పూర్తవుతుంది. 21-29 ఏళ్ల వయసులో గర్భం దాల్చితే తల్లి, బిడ్డకు ఆరోగ్యం. 18 ఏళ్లలోపు, 35 ఏళ్లు దాటిన తరువాత గర్భం దాల్చితే సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. బర్త్కెనాల్ చిన్నగా ఉండటంతో డెలివరీ ఇబ్బందితో సిజేరియన్ చేయాల్సి వస్తుంది. 18 ఏళ్ల సమయంలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది.
అమ్మాయిలకు స్వేచ్ఛ ఉండాలి
- జమీలా నిషత్, షాహీన్ ఉమెన్ రిసోర్సెస్
వివాహం అమ్మాయిల వ్యక్తిగత అభీష్టం మేరకు జరగాలి. బాలికకు 18 ఏళ్లు వచ్చినపుడు పరిణితితో ఓటు వేసే హక్కు రాజ్యాంగం కల్పిస్తోంది. ఆ వయసు వచ్చిన తరువాత యువతి తనకు ఇష్టమైనప్పుడు వివాహం చేసుకునే స్వేచ్ఛ అందించాలి. అంతేకానీ కనీస వయసు పేరిట ఆంక్షలు పెట్టడం సరికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?