TS News: పరి‘శ్రమకు’ దిక్కేది!
కరోనా సంక్షోభంతో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రభావం నుంచి కోలుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా 2.6 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు రావడం లేదు. రోజూ 22 లక్షల మంది కార్మికులు హాజరు కావాల్సి ఉండగా... 15 లక్షల మందే వస్తున్నారు. కరోనాకు ముందు మూడు పూటలా నడిచే పరిశ్రమల్లో ఎక్కువశాతం ఇప్పుడు రెండు పూటలే నడుస్తున్నాయి.
చిక్కులు వీడని చిన్న కార్ఖానాలు
కరోనా ప్రభావం నుంచి కోలుకోని పారిశ్రామికవేత్తలు
పెరిగిన ముడిసరకుల ధరలు.. తగ్గిన ఆర్డర్లు, ఉత్పత్తులు
రుణసాయం అందించడానికి బ్యాంకుల నిరాసక్తత
దరఖాస్తుల దశ దాటని ‘ఆత్మనిర్భర్ భారత్’
రాష్ట్ర ప్రభుత్వ రాయితీల కోసం ఎదురుచూపులు
లక్ష్మి.. రంగారెడ్డి జిల్లాలోని మహిళా పారిశ్రామికవేత్త. మల్కాపూర్లో బ్యాగుల తయారీ పరిశ్రమ నడుపుతున్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు అది నడవలేదు. అప్పులు చెల్లించలేదని బ్యాంకులు పరిశ్రమను జప్తు చేశాయి. పునరుద్ధరించేందుకు ఆమె నానా అవస్థలు పడుతున్నారు.
ఈనాడు, హైదరాబాద్: కరోనా సంక్షోభంతో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రభావం నుంచి కోలుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా 2.6 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కార్మికులు పూర్తిస్థాయిలో విధులకు రావడం లేదు. రోజూ 22 లక్షల మంది కార్మికులు హాజరు కావాల్సి ఉండగా... 15 లక్షల మందే వస్తున్నారు. కరోనాకు ముందు మూడు పూటలా నడిచే పరిశ్రమల్లో ఎక్కువశాతం ఇప్పుడు రెండు పూటలే నడుస్తున్నాయి. ఆర్డర్లూ తగ్గాయి. ప్రభుత్వరంగ సంస్థలు, మరికొన్ని ప్రైవేటు సంస్థల నుంచే అవి వస్తున్నాయి. దాంతో 60% మేరకే ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఆర్డర్లకు 50% ముందస్తు చెల్లింపులు జరగాల్సి ఉన్నా.. అలా చేయడం లేదు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు సొంత పెట్టుబడులతోనే ముడిసరకులను కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది అప్పులపాలవుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలకు తోడు రవాణా ఖర్చులు పెరగడంతో ప్లాస్టిక్, ఇనుము, అల్యూమినియం, ఇతర ముడిసరకుల ధరలు పెరిగాయి. ఆ మేరకు ఉత్పాదక వస్తువుల ధరలను పెంచితే కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. దీంతో పాత ధరలకే విక్రయించాల్సి వస్తోంది.
జీఎస్టీ భారం
వస్తువుల ముడిసరకుల కొనుగోలు సమయంలో పారిశ్రామికవేత్తలు 18 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. వాటితో ఉత్పత్తులు చేసి విక్రయించిన తర్వాత కొనుగోలుదారుల్లో చాలా మంది జీఎస్టీ చెల్లించడం లేదు. దీంతో పారిశ్రామికవేత్తలకు పన్ను భారం పెరుగుతోంది. విలువ ఆధారితంగానే జీఎస్టీ చెల్లించడానికి అధికారులు అనుమతించడం లేదు.
బ్యాంకుల నిస్సహాయత
కొవిడ్తో నష్టపోయిన పారిశ్రామికవేత్తలను బ్యాంకర్లు ఆదుకోవడం లేదు. కరోనాకు ముందుతో పోలిస్తే బ్యాంకుల రుణసాయం 42% తగ్గింది. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో గతంలో ఏటా రూ.42 వేల కోట్ల మేరకు ఎంఎస్ఎంఈలకు రుణాలను బ్యాంకులు అందించాయి. గత రెండేళ్లలో రూ.19 వేల కోట్ల కంటే తక్కువ రుణాలనే ఇచ్చారు. సీజీటీఎంఎస్ఈ పథకం కింద పూచీకత్తు లేకుండా రూ.కోటి వరకు రుణం ఇవ్వాల్సి ఉన్నా... అవీ మంజూరు కావడం లేదు.
నిరర్థక ఆస్తులుగా పరిశ్రమలు
ఆదాయం లేక... పారిశ్రామికవేత్తలు బ్యాంకుల కిస్తీలు చెల్లించడం లేదు. కరోనా దృష్ట్యా ఈ గడువును 6నెలలకు పెంచాలని వారు కోరుతున్నా బ్యాంకులు ఒప్పుకోవడం లేదు. కిస్తీలు చెల్లించనందుకు గత రెండేళ్లలో 1200కి పైగా పరిశ్రమలను నిరర్థక ఆస్తులుగా ప్రకటించాయి. వాటి వేలం, జప్తులు కొనసాగుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద పరిశ్రమలకు ఎలాంటి సాయం అందలేదని, దరఖాస్తుల ప్రక్రియే ప్రహసనంగా మారిందని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. పరిశ్రమలకు వివిధ సబ్సిడీలు, రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.1500 కోట్లను కేటాయించినా రూ.1000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.
* రాజు.. వరంగల్లో కేబుల్ తయారీదారు. కొవిడ్ సమయంలో పరిశ్రమ మూతపడింది. గత ఏడాది మార్చిలో ప్రారంభించాక ఇప్పుడిప్పుడే ఆర్డర్లు వస్తున్నాయి. ఇదే సమయంలో ఒమిక్రాన్ రావడంతో మళ్లీ ఆర్డర్లపై ప్రభావం పడింది. క్రయవిక్రయాలు తగ్గిపోయాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి
- తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు సుధీర్రెడ్డి
పరిశ్రమలు కష్టకాలంలో ఉన్నాయి. పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రుణాల వాయిదాతోపాటు పునరుజ్జీవ ప్యాకేజీని కేంద్రం ప్రకటించి ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సబ్సిడీలు విడుదల చేయాలి.'
చిన్న పరిశ్రమలను ఆదుకుంటాం
- పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. నష్టాల్లో ఉన్న పరిశ్రమలకు హెల్త్క్లినిక్ ద్వారా చేయూతనిస్తున్నాం. పరిశ్రమలకు అండగా నిలిచేందుకు త్వరలో మార్గనిర్దేశకేంద్రం ఏర్పాటు చేస్తాం. చిన్న పరిశ్రమల కష్టాలపై మంత్రి కేటీఆర్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. రుణాల వాయిదాను కోరాం. రాయితీలను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..