AP News: జై కిసాన్... జైజై అమరావతి
వారసత్వంగా వస్తున్న భూములను అప్పగించి, ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతి వెలుస్తోందని సంతోషించిన రైతులు... ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా
తిరుపతిలో రైతుల మహోద్యమ సభ విజయవంతం.. పాల్గొన్న వివిధ పక్షాలు
అమరావతిపై మడమ తిప్పిన జగన్.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం
ఈనాడు, తిరుపతి: వారసత్వంగా వస్తున్న భూములను అప్పగించి, ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతి వెలుస్తోందని సంతోషించిన రైతులు... ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా గర్జించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్రగా వచ్చి, తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభతో రాష్ట్ర, దేశ దృష్టిని ఆకర్షించారు. పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా ప్రజలు పెద్దసంఖ్యలో సభకు తరలివచ్చి అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. సభ జరుగుతున్నంతసేపు జై కిసాన్, జైజై అమరావతి నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. సభకు అధికార వైకాపా మినహా అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని ఐకాస నేతలు చెబుతున్న సమయంలో తాను వచ్చినట్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు ముందుకొచ్చారు. దీంతో సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది. అమరావతి కరకట్ట దాటి తొలిసారిగా తిరుపతిలో నిర్వహించిన సభ విజయవంతం కావడం పట్ల ఐకాస నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సభకు పలువురు న్యాయవాదులు తరలివచ్చారు. ప్రజలు తరలిరాకుండా పోలీసులు ఆటంకాలు సృష్టించారంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు. సిద్ధాంతాలు వేరైనా విపక్ష పార్టీలన్నీ ప్రజల కోసం ఒక్కటయ్యాయి. సైద్ధాంతిక విభేదాలు పక్కనపెట్టి అమరావతి నినాదానికి కట్టుబడ్డారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినదించాయి.. రైతులు, మహిళలు చేస్తున్న ధర్మపోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెదేపా, కాంగ్రెస్, భాజపా, సీపీఐ, జనసేనల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం రైతులు చేసే పోరాటానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.
అమరావతిపై మడమ తిప్పిన జగన్: చంద్రబాబు
ఈనాడు, తిరుపతి, అమరావతి: ఏపీకి రాజధాని అమరావతి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మడమ తిప్పారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘అమరావతినే రాజధానిగా పెట్టండి. చిన్న రాష్ట్రం... ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు. 30 వేల ఎకరాలు సరిపోతుందని ఎన్నికల ముందు అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే.. మూడుముక్కలాట ఆడుతున్నారు. అమరావతి ఏ కొద్దిమంది రాజధానో కాదు... ప్రజలు కోరుకున్న రాజధాని.. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతిపై ఆయనకు ఎందుకింత కుళ్లు?’ అని నిలదీశారు. అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు సభకు వస్తుంటే అడ్డుపడ్డారని, నేతల ఇళ్లకు పోలీసుల్ని పంపారని ఆరోపించారు. తిరుపతిలో శుక్రవారం నిర్వహించిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ... ‘అమరావతి మునిగిపోతుందన్నారు.. దేశంలోని ఎన్నోనగరాల్లోకి వరద నీరొచ్చినా ఈ మూడేళ్లలో అమరావతి ఎప్పుడైనా మునిగిందా? పునాది సరిగాఉండదన్నారు. హైదరాబాద్, చెన్నై కంటే బ్రహ్మాండమైన పునాదులు వేసుకోవచ్చని చెన్నై ఐఐటీ చెప్పింది. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. భూసేకరణలో అలాంటి పదమే లేదని హైకోర్టు, సుప్రీంకోర్టులు చెప్పాయి’ అని గుర్తుచేశారు. అమరావతికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా సహా కాంగ్రెస్, జనసేన, సీపీఐ, సీపీఎంల నేతలూ అమరావతే రాజధాని అని స్పష్టంగా చెప్పారన్నారు. ‘అమరావతిపై కులముద్ర వేస్తున్నారు... అమరావతి పరిరక్షణ సమితి శివారెడ్డి, ఏపీ రాజధాని పరిరక్షణ సమితి శ్రీనివాస్లది ఏ కులం? ఇక్కడకు వచ్చిన నాయకులది ఏ కులం? సమాధానంచెప్పే ధైర్యం జగన్కి ఉందా?’అని ప్రశ్నించారు.
దోపిడీ కోసమే విశాఖలో రాజధాని
- కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ భాజపా నేత
అమరావతిలో దోచుకోవడానికి ఏమీ లేదని అదే అభివృద్ధి చెందిన విశాఖలో అయితే అన్నీ దోచుకోవచ్చనే ఉద్దేశంతోనే అక్కడ రాజధాని పెడతామంటున్నారు. మూడు రాజధానులతో అభివృద్ధే ప్రభుత్వ విధానమైతే గత రెండున్నరేళ్లలో రాయలసీమలో ఎలాంటి అభివృద్ధి ఎందుకు చేయలేదు? ఈ ముఖ్యమంత్రి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసేశారు.
అమరావతిని మార్చడం ఎవరితరం కాదు
-కె.రఘురామ కృష్ణరాజు, వైకాపా ఎంపీ
విభజన చట్టం ప్రకారం రాజధానిగా ఏర్పడిన అమరావతిని మార్చడం ఎవరితరమూ కాదు. మీరంతా ధైర్యంగా ఉండండి. అమరావతి రూపశిల్పి చంద్రబాబు... ప్రజల భాగస్వామ్యంతో, సెల్ఫ్ ఫైనాన్సింగ్ నమూనాలో నిర్మించాలనుకున్నారు. అయితే ఒకాయన దురదృష్టవశాత్తూ హ్రస్వదృష్టితో అపార్థం చేసుకున్నారు.
మూడు ముక్కలు చేశారు
-కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
మీ రాజధాని నగరం ఏదీ? అని ఎవరైనా అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని నగరంగా మిగలడం చాలా అవమానకరం. 1952 నుంచే బెజవాడలోనే రాజధాని ఉండాలని సీపీఐ తరఫున డిమాండు చేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకూ మేం మాట తప్పలేదు. మడమ తిప్పలేదు. అమరావతి అనే ముక్కుపచ్చలారని పసికందును మూడు ముక్కలుగా నరికేసి.. మూడు ప్రాంతాల్లో పడేసి ఇదే రాజధాని అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు