Omicron: మరో ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్
ఒమిక్రాన్ వేరియంట్ ప్రాణాంతకం కాదని, వైరస్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని వైద్యఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. తాజాగా
ఒకరు హనుమకొండ మహిళ
మరొకరు హైదరాబాద్ యువకుడు
వైద్యఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు
ఈనాడు, హైదరాబాద్; న్యూస్టుడే యంత్రాంగం: ఒమిక్రాన్ వేరియంట్ ప్రాణాంతకం కాదని, వైరస్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని వైద్యఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు. తాజాగా ఇద్దరికి ఈ వేరియంట్ నిర్ధారణవడంతో కేసుల సంఖ్య తొమ్మిదికి పెరిగిందన్నారు. యూకే నుంచి హనుమకొండకు వచ్చిన మహిళకు, విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన మరో వ్యక్తికీ ఒమిక్రాన్ నిర్ధారణయినట్టు చెప్పారు. శ్రీనివాసరావు శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఒమిక్రాన్ ముప్పు ఉన్న పది దేశాల నుంచి ఇప్పటివరకు 6,764 మంది ప్రయాణికులు హైదరాబాద్కు వచ్చారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. ముప్పు లేని దేశాల నుంచి వచ్చిన వారిలో 2శాతం మందికి పరీక్షలు చేయగా ఏడు కేసులు వచ్చాయి. హనుమకొండకు చెందిన మహిళ(29) చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్లో భర్తతో కలిసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వివాహమై ఒక బిడ్డ జన్మించాక ఈ నెల 2న భారత్కు వచ్చారు. విమానాశ్రయంలో పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది. అప్పట్నుంచి ఇంట్లోనే ఐసొలేషన్లో ఉన్నారు. ఎనిమిదో రోజున ఇంటి వద్ద పరీక్ష చేయగా పాజిటివ్గా తేలింది. జన్యుక్రమ విశ్లేషణలో ఒమిక్రాన్గా వెల్లడైంది. ఈ నెల 13న దుబాయ్ నుంచి వచ్చిన మరో యువకుడు(30)కి ఒమిక్రాన్ సోకినట్లు గురువారం అర్ధరాత్రి తర్వాత నిర్ధారణయింది. పాతబస్తీ మీర్చౌక్ ఠాణా పరిధి పంజేషా గురాన్గల్లీకి చెందిన ఆ యువకుడినీ శుక్రవారం తెల్లవారుజామున గచ్చిబౌలిలోని టిమ్స్కు తరలించామని’’ శ్రీనివాసరావు తెలిపారు.
అదృశ్యమైన కెన్యా దేశస్థుడి గుర్తింపు
జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్ట, న్యూస్టుడే: పోలీసులు, వైద్యశాఖ అధికారుల కళ్లుగప్పి తిరుగుతున్న కెన్యా దేశానికి చెందిన ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యమైంది. మూడురోజుల క్రితం అతనికి ఈ వేరియంట్ నిర్ధారణయింది. ఫిలింనగర్లోని ఓ గెస్ట్హౌస్లో అతడు ఉన్నట్లు గుర్తించిన బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ‘మూడు రోజులుగా సదరు వ్యక్తి అపోలో ఆసుపత్రి ముందున్న గెస్ట్హౌస్లో గదికే పరిమితమైనట్టు ప్రాథమిక విచారణలో గుర్తించామని’’ బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు. గదిలో ఉన్న అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నామని, ఇద్దరినీ మాదాపూర్లోని టిమ్స్ ఆసుప్రతికి తరలించారని చెప్పారు.
95 శాతం మందిలో లక్షణాల్లేవు
ఒమిక్రాన్తో భయపడాల్సినంత ముప్పేమీ లేదని శ్రీనివాసరావు తెలిపారు. ‘ఇది సోకిన 95 శాతం మందికి ఎలాంటి వ్యాధి లక్షణాల్లేవు. ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల్లో ఒకట్రెండు మినహా ఎక్కడా ఆస్పత్రుల్లో చేరికలు జరగలేదు. డెల్టాలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్తో యూకేలో తప్ప ఎక్కడా మరణాలు నమోదు కాలేదు. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఒకేసారి 60 వేల మందికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లుచేశాం’’ అని వెల్లడించారు.
కొత్తగా 181 కరోనా కేసులు
రాష్ట్రంలో శుక్రవారం 39,781మందికి పరీక్షలు నిర్వహించగా 181 మందికి పాజిటివ్గా తేలింది. కరోనా చికిత్స పొందుతూ మరొకరు చనిపోవడంతో మరణాల సంఖ్య 4,013కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి