ఆన్‌లైన్‌లో కనిపించని టిక్కెట్లు.. నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం

టిక్కెట్లు బుక్‌ చేసినా సాంకేతిక కారణాలతో కనిపించకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బది పడ్డ ఘటన శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు

Updated : 20 Dec 2021 07:15 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: టిక్కెట్లు బుక్‌ చేసినా సాంకేతిక కారణాలతో కనిపించకపోవడంతో మహిళా ప్రయాణికులు ఇబ్బది పడ్డ ఘటన శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన శిరీష, సుప్రియ కుటుంబ సభ్యులు శ్రీలంకలోని కొలంబోలో నివాసం ఉంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన శిరీష, సుప్రియ ఇద్దరు చిన్నారులతో కలిసి శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ యూఎల్‌-178 విమాన సర్వీస్‌లో కొలంబో వెళ్లడానికి ఓ ఏజెన్సీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్‌ చేశారు. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక లోపం కారణంగా వారి టికెట్లను శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ వెబ్‌సైట్‌లో చూపించడం లేదంటూ నలుగురు ప్రయాణికులను వదిలేసి విమాన సిబ్బంది వెళ్లిపోయారు. తాము మోసపోయామని గ్రహించి ఆందోళన చెందుతున్న ఆ ప్రయాణికులను విమానాశ్రయంలోని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేందుకు వీల్లేకుండా సుమారు గంటన్నర పాటు ఉంచారని,  మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని శిరీష, సుప్రియ తెలిపారు. తర్వాత వారు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని