Natural disasters:ప్రపంచాన్ని వణికించిన వైపరీత్యాలు
ఒకవైపు కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు మానవాళిని కోలుకోలేని దెబ్బతీశాయి. తుపాన్లు, వరదలు, అతి భారీ వర్షాలు.. తీవ్ర వడగాలులు, సుడిగాలులు, కరవు..
పది సంఘటనల్లో ఆస్తి నష్టం రూ.12.77 లక్షల కోట్లు
టాక్టే, యస్ తుపాన్లతో భారత్కు భారీ నష్టం
అతలాకుతలమైన ప్రపంచ దేశాలు
ఇదా హరికేన్తో అమెరికాలో జరిగిన విధ్వంసం
ఈనాడు హైదరాబాద్: ఒకవైపు కరోనాతో ప్రపంచం అల్లాడుతుంటే.. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు మానవాళిని కోలుకోలేని దెబ్బతీశాయి. తుపాన్లు, వరదలు, అతి భారీ వర్షాలు.. తీవ్ర వడగాలులు, సుడిగాలులు, కరవు.. ఇలా అన్ని రకాలుగా ప్రజలను తీవ్రంగా నష్టపరచాయి. వాతావరణ మార్పు ప్రభావంతో ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే పడటం, 240 కి.మీ వేగంతో గాలులు విరుచుకుపడటం, సముద్రాల నీటిమట్టాలు పెరగడం, భారీ సుడిగుండాలు జనాన్ని అతలాకుతలం చేశాయి. కరవుతో ఆహారం దొరక్క అల్లాడిన పరిస్థితులు మరికొన్ని దేశాల్లో నెలకొన్నాయి. ఇలా 2021వ సంవత్సరంలో భారీ నష్టం సంభవించింది. ఈఏడాది ప్రపంచంలో జరిగిన పది వైపరీత్యాల వల్ల సంభవించిన ఆర్థిక నష్టం అక్షరాలా రూ.12,77,250 కోట్లు. ఇందులో అత్యధికంగా కోల్పోయింది అమెరికాయే. గత ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సంభవించిన హరికేన్ వల్ల రూ.4,87,500 కోట్ల నష్టం వాటిల్లితే, తక్కువగా భారత్, మాల్దీవులు, శ్రీలంకను నష్టపరచిన టాక్టే తుపానుతో రూ.11,250 కోట్లు ఆర్థిక నష్టం సంభవించింది. వాతావరణ మార్పుల కారణంగా జరిగిన నష్టంపై లండన్కు చెందిన క్రిస్టియన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ప్రపంచంలోని వివిధ దేశాల శాస్త్రవేత్తలతో పాటు హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కు చెందిన ఓ ప్రొఫెసర్ కూడా ఈ నివేదిక తయారీలో పాలుపంచుకొన్నారు. 2021లో 1.5 బిలియన్ డాలర్ల (రూ.11250 కోట్లు) కంటే ఎక్కువ నష్టం వాటిల్లిన పది ప్రకృతి వైపరీత్యాలపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. వీటిలో టాక్టే, యస్.. ఈ రెండు తుపాన్ల వల్ల భారత్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. నివేదికలోని ముఖ్యాంశాలు...
యస్ తుపానుకు జలమయమైన కోల్కతా వీధులు
వరదలతో యూరప్ అతలాకుతలం
జులైలో సంభవించిన వరదలు, అతి భారీ వర్షపాతం కారణంగా జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లో ఒక్క రోజులోనే 240 మంది మరణించారు. రూ.3.225 లక్షల కోట్ల వరకు నష్టం వాటిల్లింది. వాతావరణ మార్పు వల్ల యూరప్లో తరచూ ఇలాంటి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కాలంలో 9 రెట్ల వరకు అధికమయ్యాయి.
భారత్లో తుపాన్ల విలయం
అరేబియా సముద్రంలో వచ్చిన మార్పులతో సంభవించిన టాక్టే తుపాను భారత్తో పాటు మాల్దీవులు, శ్రీలంకకు తీవ్రనష్టం కలిగించింది. మొత్తం 198 మంది చనిపోయారు. ముంబయితో పాటు గుజరాత్లో ప్రభావాన్ని చూపింది. 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంబయిలో చెట్లు కూకటివేళ్లతో కూలిపోయాయి. వాతావరణ మార్పుల వల్ల ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి. మే నెలలో బంగాళాఖాతంలో వచ్చిన యస్ తుపాను వల్ల 12 లక్షల మంది ఇళ్లను వదిలివెళ్లాల్సి వచ్చింది. ఒడిశాలో పదివేల గ్రామాలు దెబ్బతిన్నాయి. కోల్కతా వీధులను వరద ముంచెత్తింది.
ఫ్రాన్స్ను దెబ్బతీసిన కోల్డ్వేవ్
ఫ్రాన్స్లో కోల్డ్వేవ్ వల్ల వ్యవసాయానికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రత్యేకించి వైన్యార్డ్స్కు. 21వ శతాబ్దంలోనే వ్యవసాయానికి జరిగిన అతి పెద్ద నష్టంగా ఫ్రాన్స్ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో కోతకొచ్చిన పంట 80 శాతానికి పైగా పోయింది. ఇలాంటి కోల్డ్వేవ్స్ 60 శాతం పెరిగినట్లు మరోసంస్థ అధ్యయనం.
గడగడలాడిన అమెరికా
అమెరికాను గడగడలాడించిన హరికేన్ ఇదా కారణంగా లూసియానా రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యుత్తు సరఫరా లేకుండా గడపాల్సి వచ్చింది. నగరంలోని ఒక ప్రాంతంలో 75 శాతం ఇళ్లు నేలమట్టమయ్యాయి. టెక్సాస్లో ఫిబ్రవరిలో సంభవించిన శీతాకాల తుపాను వల్ల అధికారికంగా 210 మంది మరణించినట్లు పేర్కొన్నా.., వాస్తవానికి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని నివేదిక అంచనా. ఆర్థిక నష్టం 23 బిలియన్ డాలర్లుగా పేర్కొనగా, 200 బిలియన్ డాలర్లు ఉంటుంది.
మనదేశానికి తీవ్ర నష్టం
వాతావరణ మార్పుల వల్ల సంభవించే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే దేశాల్లో భారతదేశం ఒకటని తాజా నివేదికను బట్టి స్పష్టమవుతోంది. వాతావరణ పరిరక్షణ కోసం 2020 నుంచి ఏటా 100 బిలియన్ డాలర్లను సమీకరించాలని అంగీకరించిన దేశాలు ఆచరణలో అమలు చేయలేదు. ఇందుకు నిధులే ప్రధాన సమస్య. వాతావరణ మార్పుల వల్ల కలిగే నష్టాలను నిరోధించడానికి సాంకేతికత బదిలీ, నిధులు ప్రధానం.
-డాక్టర్ అంజల్ ప్రకాశ్, ఐ.ఐ.ఎం.. హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూన్ 8-11 మధ్య నైరుతి రుతుపవనాల ప్రవేశం
రానున్న వానాకాలంలో రాష్ట్రమంతటా సాధారణ వర్షపాతం మించి అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. -
గల్ఫ్ కార్మికులకు బోర్డు
గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల దివ్యక్షేత్రం శోభాయమానంగా మారింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రామాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పారాయణలతో అంతా రామమయమైంది. -
తెలంగాణ వైపు ఏనుగుల మంద!
మహారాష్ట్రలో సంచరిస్తున్న ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అటవీశాఖ భావిస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్లో అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
చందా సరిగా కట్టరు.. కార్మికులకు వైద్యసేవలు అందవు..!
కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలోకి వచ్చే కార్మికులకు వైద్యసేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంస్థ చర్యలు చేపట్టింది. కార్మికుల వైద్యసేవల బీమా చందా సొమ్ము సక్రమంగా చెల్లించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోనుంది. -
చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. -
శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. -
బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అసభ్య దూషణల కేసులో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. తన రూపం, పేరు మార్చేసుకుని ‘శివ అన్నపురెడ్డి’ పేరిట ఇన్నాళ్లూ కొనసాగిస్తున్న ఫేస్బుక్ ఖాతాను తొలగించేశారు. -
శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. -
జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు
భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
వైకాపా పోస్టులను తొలగించండి
వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. -
వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
అసామాన్య అనన్య
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 60 మంది విజేతలుగా నిలిచారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
నాటక రంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీనటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. మంగళవారం రాత్రి వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని త్యాగరాయగానసభలో జరిగిన తెలుగు రంగస్థల దినోత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
కేసుల వివరాలు అందించిన పోలీసులు
భాజపా తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల వివరాలను పోలీసులు అందజేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 22కి వాయిదా
ఈడీ తనపై నమోదుచేసిన కేసులో పూర్తిస్థాయి బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. -
భద్రాద్రి సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి
భద్రాచలం సీతారామస్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి అనుమతిచ్చింది. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో అంగరంగ వైభవంగా కల్యాణం జరగనున్న విషయం తెలిసిందే. -
ప్రచార రథంపై చెప్పుల దండ
ఎన్నికల ప్రచార రథాన్ని అడ్డుకొని.. అభ్యర్థి చిత్రపటంపై చెప్పులతో దాడి చేసినందుకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. -
18 నుంచి సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్-దానాపూర్ల మధ్య ఏప్రిల్, మే నెలల్లో అన్రిజర్వుడ్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. ఏప్రిల్ 18 నుంచి జూన్ 29 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మీటింగ్లో నోట్స్ రాయడం స్టీవ్ జాబ్స్కు నచ్చదట.. ఎందుకో తెలుసా?
-
‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించిన ఆప్
-
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
-
దూకుడైన బ్యాటింగ్తోనే కప్ కొట్టగలం..: రికీ పాంటింగ్
-
ఎన్నికల్లో భాజపా తుడిచిపెట్టుకుపోతుంది: అఖిలేష్ యాదవ్
-
వలసలు, పస్తులు లేని వికసిత ఏపీ మనందరి బాధ్యత: పవన్