TS News: వేరే జిల్లాకు వెళ్లలేక.. ఉద్యోగం మానలేక..!
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాబాపూర్కు చెందిన ఉపాధ్యాయురాలు(ఎస్జీటీ) బేతాల సరస్వతి (34) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. దశాబ్ద కాలం పాటు ఆమె సొంత మండలంలోనే ఉద్యోగం చేశారు. మొన్నటి వరకు భీమ్గల్ మండలం రహత్నగర్లో విధులు నిర్వహించేవారు. నూతన జీవో ప్రకారం కేటాయింపుల్లో భాగంగా ఆమె కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండా
ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
భీమ్గల్, న్యూస్టుడే: నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బాబాపూర్కు చెందిన ఉపాధ్యాయురాలు(ఎస్జీటీ) బేతాల సరస్వతి (34) ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. దశాబ్ద కాలం పాటు ఆమె సొంత మండలంలోనే ఉద్యోగం చేశారు. మొన్నటి వరకు భీమ్గల్ మండలం రహత్నగర్లో విధులు నిర్వహించేవారు. నూతన జీవో ప్రకారం కేటాయింపుల్లో భాగంగా ఆమె కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండా ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. బతుకుదెరువు కోసం ఖతార్ వెళ్లిన భర్త భూమేష్కు ఈ విషయం తెలియజేయగా.. ఇబ్బందులు పడుతూ ఉద్యోగం చేయడం ఎందుకని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకు వెళ్లలేక.. సొంత ఊరిలో ఉండలేక ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ ఈ నెల 7న కొత్త పాఠశాలకు వెళ్లి విధుల్లో చేరారు. అక్కడ ఆమె ఒక్కరే ఉపాధ్యాయురాలు. ఆదివారం ఇంట్లో ఇద్దరు కుమారుల(కవలలు)కు అన్నం పెట్టి ఇప్పుడే వస్తానని బంగ్లాపైకి వెళ్లి దూలానికి తాడుతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సరస్వతి సొంతూరు నుంచి ప్రస్తుతం పోస్టింగ్ పొందిన మర్లకుంట తండా 110 కి.మీ. దూరం. ఆమె సోదరుడు లోకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు.
గుండె నొప్పితో మరో టీచర్..
మరిపెడ, న్యూస్టుడే: ఛాతీలో మంట.. కడుపు, గుండెలో నొప్పితో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలు శ్రీమతి(46) మృతి చెందారు. ఆమె భర్త సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం యర్జర్ల శివారు పూసలతండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న శ్రీమతి ఇటీవలి కేటాయింపుల్లో ములుగు జిల్లా ఏటూరునాగారం సమీపంలోని రొయ్యూరు పాఠశాలకు బదిలీ కాగా విధుల్లో చేరారు. హనుమకొండ నగరంలోని న్యూశాయంపేటలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి అస్వస్థతకు గురి కాగా కుటుంబసభ్యులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఛాతీలో నీరు పేరుకుందని, గుండె వేగం పెరిగిందని వైద్యులు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆమె మృతి చెందినట్లు భర్త సత్యనారాయణరెడ్డి తెలిపారు. సుదూర ప్రాంతానికి బదిలీ కావడంతో ఆమె ఆందోళనతో అస్వస్థతకు గురై ఉంటుందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.
అవి కేసీఆర్ ప్రభుత్వ హత్యలే: సంజయ్
ఈనాడు, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఆత్మహత్య తనను కలిచివేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ‘317 జీవోతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చనిపోతున్నారు. ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వ హత్యలే’ అని ఆరోపించారు. దీనిపై భాజపా పోరాటం చేస్తుందని.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న, గుండె పోటుతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని భాజపా డిమాండ్ చేసింది.
ఆ జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం: రేవంత్
గాంధీభవన్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కుతంత్రపు వ్యూహంలో భాగంగా తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఆయన స్పందించారు. ఈ చావులకు ప్రభుత్వంతో పాటు వత్తాసు పలికే ఉద్యోగ సంఘాల నాయకులూ బాధ్యులేనన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!