Vanama Raghava: భూ కబంధుడు
ఎకరాల కొద్దీ అటవీ భూములను కొల్లగొట్టాడు. అసైన్డ్ భూములను కబ్జా చేశాడు. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చిన వనమా రాఘవ అక్రమాలు. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం
రాఘవ ఆగడాల్లో నయా కోణాలు
పాల్వంచ కేటీపీఎస్, గ్రామీణం, న్యూస్టుడే: ఎకరాల కొద్దీ అటవీ భూములను కొల్లగొట్టాడు. అసైన్డ్ భూములను కబ్జా చేశాడు. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చిన వనమా రాఘవ అక్రమాలు. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కటకటాల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఆయన బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెడుతున్నారు. భూ దందాలు, అరాచకాలకు పాల్పడ్డాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొన్నింటిపై పోలీసులు కేసులు నమోదయ్యాయి. వెలుగు చూడనివి కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు.
అక్రమించిన అటవీ భూముల్లో ఆయిల్పాం సాగు
అటవీ భూములను చెరబట్టి
పాల్వంచ ప్రాదేశిక ప్రాంతంలోని (టెరిటోరియల్) బంగారుజాల అటవీ బీట్ పరిధిలో దాదాపు 50 ఎకరాల అటవీ భూమిని రాఘవ ఆక్రమించారు. పాల్వంచ పురపాలక సంఘం పరిధిలోకి వచ్చే 999 సర్వే నంబరు, ఉప సంఖ్యల పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్పాం పంట, అంతర్పంటగా మొక్కజొన్న సాగు చేపట్టారు. ఒకప్పుడు అడవి ఉండగా చెట్లను కొట్టేసి చదును చేసేశారు. ఆ పక్కనే రాఘవకు చెందిన పట్టా భూములు ఉన్నాయి. వాస్తవానికి ఈ సర్వే సంఖ్యలో 4,180 ఎకరాల భూమి ఉంది. దీనిలో 1,153 ఎకరాలు అటవీ భూమి, 850 ఎకరాలు పట్టా భూములున్నాయి. మిగిలింది రెవెన్యూ భూమి. ప్రస్తుతం అటవీ ప్రాంతం కొంత పోను మిగిలినదంతా ఆక్రమణలోనే ఉంది. మరోవైపు కొన్నేళ్ల క్రితం కొంత మందికి భూమిని ఎసైన్డ్ చేశారు. దీనిలో కొంత విస్తీర్ణాన్ని రాఘవ బెదిరించి ఎంతో కొంత చేతుల్లో పెట్టి లాక్కున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు చేపట్టని యంత్రాంగం
నిరుపేదలైన గిరిజనులు పోడు చేసుకున్న భూములను స్వాధీనపర్చుకోవడానికి నిత్యం వారి వెంట పడుతున్న అధికారులు.. రాఘవ ఆధీనంలోని అటవీ భూమిని వెనక్కు తీసుకోవడానికి ఎంత మాత్రం ప్రయత్నించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై పాల్వంచ అటవీశాఖ డివిజన్ అధికారి తిరుమలరావును వివరణ కోరగా.. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందగా వాటిపై విచారణ నిర్వహిస్తున్నామని, గుర్తించాక ఏదైనా విషయం చెబుతామని తెలిపారు.
ఎసైన్డ్ భూముల్లో 20 ఎకరాలు..
పాల్వంచ పురపాలక పరిధిలో పలు చోట్ల పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములనూ రాఘవ, ఆయన అనుచరులు ఆక్రమించారు. విజయవాడ-జగదల్పూర్ జాతీయ రహదారిలో ఉన్న ఈ పట్టణంలో పట్టా భూములున్న చోట స్థిరాస్తి వ్యాపారానికి మంచి గిరాకీ ఉండటంతో చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. రహదారి పక్కనే, ఎమ్మెల్యే వనమా వేంకటేశ్వరరావు నివాస గృహానికి ఎదురుగా ఉన్న చింతల చెరువులోనూ ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. చెరువు నీళ్లు నిల్వ ఉండే చోటే వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి భవనాలు నిర్మించారు. బంగారుజాలలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూముల్లో 20ఎకరాలను రాఘవ కబ్జా చేశారని బాధితులు చెబుతున్నారు. బాధితులు ఇంటి చుట్టూ తిరిగి ఒత్తిడి చేయడంతో ఎకరాకు రూ.10 వేలు మాత్రం చేతుల్లో పెట్టారని కొందరు పేర్కొంటున్నారు. పాల్వంచ కాంట్రాక్టర్స్ కాలనీకి చెందిన శ్రీదేవి తనకు వారసత్వంగా వచ్చిన భూమిని రాఘవ కబ్జా చేశాడని ఇప్పటికే ఫిర్యాదు చేశారు. వనమా రాఘవపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నా నేరాల కోణంలోనే(క్రైం) కేసులు నమోదు చేశారని, భూముల ఆక్రమణ, ఆర్థిక దందాలకు సంబంధించి ఎలాంటి విచారణలు చేపట్టడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
బెదిరించి లాక్కున్నాడు
మాకు ప్రభుత్వం ఇచ్చిన ఎసైన్డ్ భూమిని రాఘవ కబ్జా చేశాడు. మొక్కలు వేసి సాగు చేపట్టాడు. ఇంటికెళ్లి పలుమార్లు మా భూమి మాకు ఇవ్వాలని బతిమిలాడాం. ‘మీకు భూమి ఎక్కడుంది? మా భూమి అది’ అని ఇంటిల్లిపాది తిట్టారు. పహాణీలు, పాసుపుస్తకం ఉందని చెప్పినా తిరిగి ఇవ్వలే.
- వెంకట రమణ, బంగారుజాల, అసైన్డ్ లబ్ధిదారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ