TS News: గిరాకీని బట్టి మార్కెట్ విలువ
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువల మదింపునకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల విలువలు గణనీయంగా పెంచేలా ప్రక్రియ సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువను
రెండ్రోజుల్లో కొత్త ధరలు కొలిక్కి
రెండేళ్లకోసారి సవరించాలనే యోచనలో సర్కారు
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువల మదింపునకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల విలువలు గణనీయంగా పెంచేలా ప్రక్రియ సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువను 40 శాతం పైగా పెంచనున్నారని విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమలులోకి తెచ్చేలా రెండ్రోజులుగా జిల్లా రిజిస్ట్రార్లు హైదరాబాద్లోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో చేస్తున్న మదింపు ప్రక్రియ ముగింపుదశకు చేరుకుంది. రెండ్రోజుల్లో ప్రభుత్వ ఆమోదానికి దస్త్రాన్ని పంపనున్నారు.
ఎనిమిది నెలల్లోనే మరోసారి ఎందుకు?
ఉమ్మడి రాష్ట్రంలో 2013లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలను సవరించారు.తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి 2021 జులైలో మార్కెట్ ధరలను సవరించడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు. ఏటా సుమారు రూ.3,000-3,500 కోట్ల అదనపు రాబడి వస్తుందని సర్కారు అంచనా వేసింది. గత ఎనిమిది నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్యతో పాటు ఆదాయం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్యే తొమ్మిది లక్షలు దాటింది. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆస్తులకు భారీ డిమాండ్ ఉంది. ఏడేళ్ల తర్వాత మార్కెట్ విలువలు పెంచినా వాస్తవంగా ఉన్న బహిరంగ మార్కెట్ ధరలకు పొంతనలేదని సర్కారు గుర్తించింది. ఇటీవల హెచ్ఎండీఏ ద్వారా భూములను విక్రయించినపుడు ఈ అంశాన్ని గమనించింది. దీంతో రిజిస్ట్రేషన్కు ప్రాతిపదికగా ఉండే మార్కెట్ విలువల్లో మరింత హేతుబద్ధత ఉండాలని భావిస్తోంది. అందుకే ఎనిమిది నెలల్లోనే మరోమారు సవరించాల్సి వస్తోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. సాధారణంగా రెండేళ్లకు ఒకసారి మార్కెట్ విలువల్ని సవరిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని.. తాజాగా స్థిర పరచి రెండేళ్లకోసారి సవరణ ప్రక్రియ చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. భవిష్యత్తులో ప్రభుత్వ రాబడుల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం కీలకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ భూముల విలువ ప్రస్తుతం ఉన్నదానికంటే 50 శాతం, ఖాళీ స్థలాల మార్కెట్ విలువ 35 శాతం, అపార్ట్మెంట్ ప్లాట్ల విలువ 25 శాతం పెంచేలా కసరత్తు జరుగుతోంది.
ప్రస్తుత విధానం ఇది..
వ్యవసాయ భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతాలను పరిధులుగా నిర్ణయించి ప్రతిదాంట్లో కనీస ధరతో పాటు తక్కువ, మధ్య, గరిష్ఠ శ్రేణి విలువలు అమలులో ఉన్నాయి. ఖాళీ స్థలాలకు సంబంధించి రెవెన్యూ గ్రామాలు, మండల కేంద్రాలు, 50 వేల జనాభా కంటే తక్కువ ఉన్న పురపాలక పట్టణాలు, గ్రేడ్1 పురపాలక పట్టణాలు, నగరపాలక సంస్థలు, హెచ్ఎండీఏ పరిధి-1, హెచ్ఎండీఏ పరిధి-2, జీహెచ్ఎంసీ పరిధిలో వేర్వేరు మార్కెట్ విలువలున్నాయి. ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు- నగరపాలక సంస్థలు, హైదరాబాద్ మహా నగర పాలక సంస,్థ జీహెచ్ఎంసీ పరిధి అంటూ వివిధ వర్గీకరణలున్నాయి. వీటిలో కూడా డోర్ నంబర్లు, వీధుల ప్రాతిపదికగా వేర్వేరు మార్కెట్ రేట్లు అమలులో ఉన్నాయి.
విలువల సవరణకు ఉత్తర్వులు
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలను సవరించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి అనుమతిచ్చారు. ఉత్తర్వులకనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. -
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
Margadarsi Chit Fund Case: లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇదీసంగతి!
-
ఇందూరులో వడగళ్ల బీభత్సం
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గాలివాన పడింది. -
ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
దీక్షాదివస్ స్ఫూర్తిగా... రాష్ట్రంకోసం పునరంకితం
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పేర్కొన్నారు. -
ఆర్మీ క్విజ్ ఫైనల్స్కు తేజ విద్యాలయ విద్యార్థులు
భారత సైనిక దళం ఆధ్వర్యంలో మంగళవారం చెన్నైలోని ఆఫీసర్స్ శిక్షణ అకాడమీ ఆడిటోరియంలో ఆర్మీ క్విజ్ సౌతిండియా సెమీ ఫైనల్స్ నిర్వహించారు. -
స్మితా సభర్వాల్కు నీటిపారుదల శాఖ బాధ్యతలు
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఏసీ) ప్రభుత్వం నియమించింది. -
నేడు, రేపు సర్కారు బడులకు ఎన్నికల సెలవులు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్ఎంఎస్ల ద్వారా ఆదేశాలిచ్చారు. -
అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: గవర్నర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. -
‘మేడిగడ్డ’పై నిపుణుల కమిటీ!
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.


తాజా వార్తలు (Latest News)
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్