CBI: అవినాష్పై అనుమానం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.
వివేకా హత్య కేసును ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం
అభియోగపత్రాల్లో సీబీఐ వెల్లడి
ఈనాడు - అమరావతి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. కడప లోక్సభ నియోజకవర్గం టికెట్టు అవినాష్రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని.. ఈ నేపథ్యంలోనే అవినాష్రెడ్డి ఆయన్ను హత్య చేయించి ఉంటారనే అనుమానం ఉందని వివరించింది. తమ దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది. హత్య వెనుక ఉన్న భారీ కుట్రను వెలికితీసే దిశగా దర్యాప్తు సాగిస్తున్నామని వెల్లడించింది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్రెడ్డి, షేక్ దస్త గిరిల ప్రమేయంపై పులివెందుల కోర్టులో సీబీఐ గతంలో దాఖలు చేసిన అభియోగపత్రాలు సోమవారం వెలుగు చూశాయి. ఇప్పటివరకూ దర్యాప్తులో గుర్తించిన అంశాలను సీబీఐ అందులో ప్రస్తావించింది. ప్రధానాంశాలివీ.
చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు
వివేకానందరెడ్డి హత్య నేరాన్ని నీపై వేసుకుని, అతణ్ని నువ్వే చంపినట్లు అంగీకరిస్తే రూ.10 కోట్లు ఇస్తా.. అంటూ కె.గంగాధరరెడ్డి అనే వ్యక్తికి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఆఫర్ చేశారు. నిందితుల్లో ఒకరైన దస్తగిరిని సీబీఐ అధికారులు విచారణ కోసం దిల్లీకి పిలిపించారని శివశంకర్రెడ్డికి తెలిసింది. సీబీఐకి తమ పేర్లు చెప్పకుండా ఉంటే జీవితం సెటిల్ చేస్తానంటూ ఆయన దస్తగిరికి హామీ ఇచ్చారు. దిల్లీలో దస్తగిరి కదలికలు కనిపెట్టేందుకు, సీబీఐ ఆయన్ను ఏం ప్రశ్నిస్తుందో తెలుసుకునేందుకు భరత్యాదవ్ను అక్కడికి పంపించారు. 2019 ఫిబ్రవరి 10నే వివేకా హత్యకు ప్రణాళిక సిద్ధమైంది. ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగిన ఈ కుట్రలో దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి భాగస్వాములయ్యారు.
ఎమ్మెల్సీగా పోటీకి అడ్డుతగిలారని..
వివేకా హత్యకు కుట్ర, హత్య తర్వాత ఆధారాల ధ్వంసంలో పాల్గొన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కడప జిల్లా వైకాపాలో కీలక నేత. 2017లో కడప స్థానిక సంస్థల నుంచి వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. దీంతో ఆ స్థానంలో పోటీ చేసిన వివేకాకు మద్దతివ్వలేదు. ఓటమి పాలైన వివేకా.. శివశంకర్రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు వివేకా వైకాపాలో చేరితే రాయలసీమలో తమ ప్రాబల్యానికి ఇబ్బందవుతుందని భావించిన శివశంకర్రెడ్డి.. ఆయన చేరికపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
హత్య ప్రణాళికలో అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి
‘వివేకాను హత్య చేస్తే శివశంకర్రెడ్డి రూ.40 కోట్లు ఇస్తారు. అందులో నీకు రూ.5 కోట్లు ఇస్తాం. ఈ హత్య చేస్తే నీ జీవితం సెటిల్ అయిపోతుంది. వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, శివశంకర్రెడ్డి వంటి పెద్దలు ఈ హత్య ప్రణాళికలో ఉన్నారు’ అని ఎర్ర గంగిరెడ్డి దస్తగిరితో చెప్పారు. వివేకా మృతి వార్త వెలుగుచూసిన తర్వాత 2019 మార్చి 15న ఉదయం 6.25 గంటలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఇతర సన్నిహితులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వైఎస్ భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, ఎర్ర గంగిరెడ్డికి కూడా అక్కడికి చేరారు. వివేకా మృతదేహం రక్తపు మడుగులో ఉన్నా.. ఆయన గుండెపోటుతో మరణించారంటూ అవినాష్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిలు ప్రచారం మొదలుపెట్టారు. ఇదే మాటను శివశంకర్రెడ్డి.. సాక్షి టీవీకి తొలిసారి చెప్పారు. వివేకా కుమార్తె, అల్లుడు రాకుండానే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించారు.
హత్య సమయంలో.. సునీల్ యాదవ్ అక్కడే
* 2019 మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 2.42 గంటల సమయంలో సునీల్ యాదవ్ వివేకా ఇంట్లో ఉన్నట్లు ఆయన జీమెయిల్ ఖాతాకు సంబంధించిన గూగుల్ కోఆర్డినేట్స్ ద్వారా వెల్లడైంది. హత్య జరిగిన రోజు, మర్నాడు సునీల్, దస్తగిరిల మధ్య పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు నడిచాయి.
* హత్య జరిగిన రోజు వివేకా ఇంటి ముందునుంచి ఉమాశంకర్రెడ్డి పారిపోతున్నదృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి.
*ఎర్ర గంగిరెడ్డి దిశా నిర్దేశంతో సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరిలు హత్య ప్రణాళిక అమలు చేశారు. హత్యకు కుట్ర రూపొందించిన నాలుగైదు రోజుల తర్వాత సునీల్ దస్తగిరికి రూ.కోటి ఇచ్చారు. ఉమాశంకర్రెడ్డి, సునీల్ కూడా రూ.కోటి చొప్పున పొందారు. దస్తగిరి తనకు వచ్చిన డబ్బుల్లో రూ.46.70 లక్షలు మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచగా సీబీఐ స్వాధీనం చేసుకుంది.
* పోలీసులకు మా పేర్లు చెబితే నిన్ను చంపేస్తాం.. అంటూ వాచ్మెన్ రంగన్నను గంగిరెడ్డి బెదిరించారు.
* దేవిరెడ్డి శివశంకర్రెడ్డి.. వివేకా హత్య విషయాన్ని దాచిపెడుతూ ఆయన పీఏ కృష్ణారెడ్డితో పులివెందుల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించారు. మృతదేహంపై తీవ్ర గాయాలున్నాయని, పడకగదిలోనూ, స్నానాలగదిలోనూ రక్తపు మడుగు ఉందనే విషయాలేవి ఫిర్యాదులో ప్రస్తావించకుండా దాచిపెట్టారు. దాని ఆధారంగానే కేసు నమోదు చేయాలని సీఐ శంకరయ్యపై ఒత్తిడి తీసుకొచ్చారు. ‘సార్... శివశంకర్రెడ్డి, గంగిరెడ్డిలు ఘటనాస్థలాన్ని ఎందుకు శుభ్రపరుస్తున్నారు? వారు ఆధారాలు ధ్వంసం చేస్తే కేసు సంక్లిష్టమవుతుంది’ అని సీఐ శంకరయ్య.. అక్కడున్న వైఎస్ ప్రతాప్రెడ్డితో అన్నారు.
* ఘటనాస్థలంలోని రక్తపు మరకలన్నింటినీ శివశంకర్రెడ్డి, గంగిరెడ్డి శుభ్రం చేయించారు. వివేకా తలకు గాయాలైనచోట్ల బ్యాండేజీ చుట్టించి కట్లు వేయించారు. శివశంకర్రెడ్డి ఆదేశాలతోనే పనిమనిషి లక్ష్మి ఈ రక్తపుమరకల్ని శుభ్రం చేశారు.
* నార్కో అనాలసిస్ పరీక్షకు శివశంకర్రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డిలు ఒప్పుకోలేదు.
* వివేకా తల, నుదురు, అరచేతిపై ఏడు గాయాలున్నట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. హెమరేజిక్ షాక్తో పాటు, మెదడుకు తీవ్ర గాయాలవటం వల్ల చనిపోయారని నివేదికలో వెల్లడైంది. గొడ్డలితో వివేకాను హత్య చేసి ఉండొచ్చని శవపరీక్ష చేసిన వైద్యులు వెల్లడించారు.
వ్యక్తిగత కక్షలతో హత్య కుట్రలోకి..
గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డిలు వ్యక్తిగత కక్షలతోనే వివేకా హత్య కుట్రలో భాగస్వాములయ్యారు. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నా ఓటమికి పని చేశావంటూ వివేకా తరచూ ఎర్రగంగిరెడ్డిని తిట్టేవారు. బెంగళూరులో ఓ భూవివాదాన్ని సెటిల్ చేసినందుకు వివేకా రూ.8 కోట్లు ఆశించారు. దానిలో తనకూ వాటా ఇవ్వాలని గంగిరెడ్డి అడిగినా వివేకా ఇవ్వలేదు. వివేకా ఆస్తులకు బినామీగా, ఆయన వెన్నంటే ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో తమ కుటుంబానికి అవకాశమివ్వలేదని గజ్జల ఉమాశంకర్రెడ్డి, డ్రైవర్గా తీసేశారని షేక్ దస్తగిరి ఆయనపై కక్ష పెంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్