Telangana: అమ్మో.. ఇంత ఖర్చా?
ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న నమ్మకంతో ఆదిలాబాద్కు చెందిన ఒక అభ్యర్థి శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చారు. ఊర్లో తండ్రి రెండెకరాల కౌలు రైతు. ఫీజు, ఖర్చుల వివరాలు తెలుసుకున్న ఆ అభ్యర్థి...
పోటీ పరీక్షల శిక్షణ కోసం నగరానికి నిరుద్యోగులు
ఫీజులు చూసి బెంబేలు
ప్రత్యామ్నాయాల వైపు చూపు
ఈనాడు - హైదరాబాద్
ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న నమ్మకంతో ఆదిలాబాద్కు చెందిన ఒక అభ్యర్థి శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చారు. ఊర్లో తండ్రి రెండెకరాల కౌలు రైతు. ఫీజు, ఖర్చుల వివరాలు తెలుసుకున్న ఆ అభ్యర్థి అవాక్కయ్యారు. భరించే స్థితి లేకపోవడంతో లైబ్రరీలో చదువుకుంటున్న వారిని అడిగి కొన్ని పుస్తకాలు కొనుగోలు చేసి ఊరెళ్లిపోయారు.
రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడొస్తాయో కానీ, శిక్షణ కోసం ఉద్యోగార్థుల ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. కరోనాకు ముందుతో పోల్చితే ప్రైవేటు శిక్షణ సంస్థలు, వసతి గృహాల ఫీజులు దాదాపు రెట్టింపయ్యాయి.పేరున్న శిక్షణ సంస్థల్లో గ్రూప్-1 కోచింగ్కు రూ.60వేలు- లక్ష చెల్లించాల్సి వస్తోంది. త్వరలోనే ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న ఆశతో గ్రూప్-1, 2, 3, 4 శిక్షణ కోసం గ్రామాల నుంచి యువత హైదరాబాద్కు వస్తున్నారు. కరోనాతో ఓవైపు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అప్పులు చేసి కొలువుల ఆశతో శిక్షణ కేంద్రాల వైపు వెళ్తున్నారు. గ్రూప్-1 శిక్షణ, వసతి, పుస్తకాలు తదితర వాటి కోసం సగటున ఒక్కో అభ్యర్థి ఏడాదికి రూ.2.50-3 లక్షల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నవారికి ఈ ఖర్చు రెండింతలవుతోంది. వీటిని భరించలేని కొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ ఇంటికి వెళ్లిపోతున్నారు. కరోనాకు ముందు గ్రూప్-1, 2 ఫీజులు తక్కువగా ఉండేవి. మధ్యస్థాయి శిక్షణ సంస్థలు గ్రూప్-1కు రూ.35 వేలు, గ్రూప్-2కు రూ.15 వేల వరకు తీసుకునేవి. ప్రస్తుతం గ్రూప్-2కు రూ.25 వేలవరకు తీసుకుంటున్నాయి. కరోనాకు ముందు నెలకు రూ.4-5 వేలు ఉండే మెస్ ఛార్జీలు రూ.8-12 వేలయ్యాయి. ఉదాహరణకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పరీక్ష కోసం శిక్షణ సంస్థల్లో మూడేళ్ల క్రితం రూ.16వేల ఫీజు ఉండేది. ఇటీవల రూ.25-40 వేలకు పెరిగిందని ఆ పరీక్షకు శిక్షణ పొందిన అభ్యర్థి రాజు వెల్లడించారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు స్టడీరూమ్ పేరిట నెలకు రూ.1,500-2,000 వసూలు చేసే సంస్థలూ వెలిశాయి. మహమ్మారితో పోటీపరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను వదిలిపెట్టడం లేదు. ఇదే సమయంలో ప్రత్యక్ష తరగతుల కన్నా, ఆన్లైన్ కోచింగ్కు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ మేరకు శిక్షణ సంస్థలు ప్రత్యేక యాప్లు రూపొందించాయి. ఫీజులూ భారీగానే ఉంటున్నాయి. గ్రూప్-1 కోసం కొన్ని సంస్థలు రూ.50 వేలు వసూలు చేస్తున్నాయి. ఆన్లైన్ పాఠాలతో పాటు స్టడీమెటీరియల్ ఇస్తామని చెబుతున్నాయి. గ్రూప్-2 కోసం రూ.5-8 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఈ ఫీజుల్లో ఎలాంటి రాయితీలివ్వడం లేదు.
ప్రత్యామ్నాయాల వైపు చూపు
* ఫీజులు, ఖర్చులు పెరగడంతో అభ్యర్థులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.గతంలో కొందరు అభ్యర్థులు గ్రూప్-1, 2 కోసం సమగ్రంగా రాసుకున్న నోట్స్ను అశోక్నగర్, దిల్సుఖ్నగర్లోని కొన్ని జిరాక్స్ కేంద్రాలు విక్రయిస్తున్నాయి.గ్రూప్-2 అన్ని సబ్జెక్టుల నోట్స్కు రూ.1,800-2,000 వరకు వసూలు చేస్తున్నాయి.
* తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ వెర్షన్లతో రావడం లేదు. దీంతో అభ్యర్థులు పాతపుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. అప్డేటెడ్ సమాచారం కోసం దినపత్రికలు, యూట్యూబ్ను ఆశ్రయిస్తున్నారు. రిఫరెన్స్ పుస్తకాల కోసం రూ.4-5వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది.
* యూట్యూబ్లో కొందరు నిపుణులు గ్రూప్-1, 2 సబ్జెక్టులు, చరిత్ర, కరెంట్ అఫైర్స్ తదితర సమాచారాన్ని వీడియోల రూపంలో అప్లోడ్ చేస్తున్నారు. వాటిని కొందరు వినియోగించుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.