CM KCR:సరైన సమయంలో గళం విప్పారు
కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పాలన, విధానాలను వ్యతిరేకిస్తూ ఫెడరల్ న్యాయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే ప్రకటించారు. సమగ్రంగా చర్చించేందుకు ముంబయి రావాలని ఆయన ఆహ్వానించగా కేసీఆర్ అంగీకరించారు.
కేంద్రంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు.. కేసీఆర్తో మహారాష్ట్ర సీఎం
ముంబయికి రావాలని ఆహ్వానం.. 20న వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి
ఈనాడు - హైదరాబాద్
కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పాలన, విధానాలను వ్యతిరేకిస్తూ ఫెడరల్ న్యాయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే ప్రకటించారు. సమగ్రంగా చర్చించేందుకు ముంబయి రావాలని ఆయన ఆహ్వానించగా కేసీఆర్ అంగీకరించారు. ఈ నెల 20న తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లనున్నారు. సీఎంవో కార్యాలయం చెప్పిన వివరాల ప్రకారం..‘‘ఠాక్రే బుధవారం కేసీఆర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ధోరణి, వివిధ రాజకీయ అంశాలపై చర్చించారు. మీరు గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. దీనికి ప్రజలందరి నుంచి మద్దతు లభిస్తుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు పూర్తి సహకారం అందిస్తామని ఠాక్రే అన్నారు. ఈ దేశాన్ని విభజనశక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో గళం విప్పారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు పోరాటం కొనసాగించాలని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. వీటిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు వీలుగా ముంబయికి రావాలని, తమ ఆతిథ్యాన్ని తీసుకోవాలని కేసీఆర్ను కోరగా తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 20న ముంబయికి వస్తున్నట్లు చెప్పారు’’.
సీఎం రాష్ట్రాల పర్యటనలు
భాజపా పాలనపై వివిధ రాజకీయ పార్టీల మద్దతు సమీకరణలో భాగంగా కేసీఆర్ మరోసారి రాష్ట్రాలు పర్యటించనున్నారు.20న ముంబయితో ప్రారంభిస్తారు. గత కొన్ని రోజలుగా ఆయన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో కేంద్రం వైఖరి, దానికి వ్యతిరేక వ్యూహం గురించి చర్చించారు. కేరళ సీఎం పినరయి విజయన్ హైదరాబాద్ రాగా ఆయనతోనూ సీఎం సమావేశమయ్యారు. నాలుగు రోజుల క్రితం ఉద్ధవ్ఠాక్రేతోనూ ప్రాథమికంగా చర్చించారు. మళ్లీ ఠాక్రే ఆహ్వానం మేరకు ముంబయిలో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఆయన మరోసారి బెంగాల్, తమిళనాడు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు ఒడిశా సీఎం నవీన్పట్నాయక్తోనూ కేసీఆర్ మంతనాలు సాగిస్తున్నారు. త్వరలో ఒడిశా పర్యటనకు వెళ్లే వీలుంది. ముందుగా పలువురు ముఖ్యమంత్రులతో చర్చించిన అనంతరం ఆయన దిల్లీకి వెళ్లి అక్కడ విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యనేతలతో భేటీ అయ్యే వీలుంది.
21న బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన
ముఖ్యమంత్రి కేసీఆర్ 18 నుంచి మరోసారి వరుస పర్యటనలకు వెళ్లనున్నారు. ఈ నెల 18న మేడారం సమ్మక్క సారలమ్మల జాతరకు హాజరుకానున్నారు. 20న ముంబయి వెళ్తారు. 21న నారాయణఖేడ్లో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. 23న..మల్లన్నసాగర్ రిజర్వాయర్ను కేసీఆర్ ప్రారంభించనున్నారు.
వార్ధా బ్యారేజీపైనా చర్చ
ఈనాడు హైదరాబాద్: మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశంలో వార్ధా బ్యారేజీ నిర్మాణం గురించి కూడా కేసీఆర్ చర్చించనున్నట్లు తెలిసింది. గతంలో ప్రాణహితపై తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించేందుకు ఒప్పందం కుదిరింది. మొదట 152 మీటర్లతో చేపట్టగా ముంపు సమస్యతో మహారాష్ట్ర సానుకూలత వ్యక్తం చేయలేదు. దీంతో పునరాకృతిలో భాగంగా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి కాళేశ్వరం చేపట్టిన ప్రభుత్వం, ప్రాణహిత వద్ద 148 మీటర్లతో చేపట్టి అదిలాబాద్ జిల్లాలోని ఆయకట్టుకే పరిమితం చేసింది. ఇటీవల ఈ బ్యారేజీని తుమ్మిడిహట్టి వద్ద కాకుండా వార్ధాపైన చేపట్టాలని ప్రతిపాదించింది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?