Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష
గుజరాత్లోని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. సుదీర్ఘ కాలం విచారణ అనంతరం శుక్రవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. దేశంలో ఒక న్యాయస్థానం ఒకేసారి ఇంతమందికి మరణ దండన విధించడం ఇదే తొలిసారి! ఇంతకుముందు 1998లో తమిళనాడులోని టాడా కోర్టు రాజీవ్గాంధీ హత్యకేసులో గరిష్ఠంగా 26 మందికి మరణశిక్ష విధించింది.
మరో 11 మందికి యావజ్జీవం
ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
దేశంలో ఇంత మందికి మరణశిక్ష ఇదే మొదటిసారి
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో 2008లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మంది దోషులకు ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది. సుదీర్ఘ కాలం విచారణ అనంతరం శుక్రవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. దేశంలో ఒక న్యాయస్థానం ఒకేసారి ఇంతమందికి మరణ దండన విధించడం ఇదే తొలిసారి! ఇంతకుముందు 1998లో తమిళనాడులోని టాడా కోర్టు రాజీవ్గాంధీ హత్యకేసులో గరిష్ఠంగా 26 మందికి మరణశిక్ష విధించింది.
2008, జులై 26న... అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 70 నిమిషాల వ్యవధిలోనే 21 బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనల్లో మొత్తం 56 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికి పైగా గాయపడ్డారు. యావద్దేశాన్ని తీవ్రంగా కలచివేసిన ఈ పేలుళ్లపై అహ్మదాబాద్, సూరత్లలో మొత్తం 35 కేసులు నమోదయ్యాయి. ప్రత్యేక న్యాయస్థానం వీటన్నింటినీ కలిపి విచారణ ప్రారంభించింది. మొత్తం 78 మందిపై అభియోగాలు నమోదుకాగా, వీరిలో ఓ వ్యక్తి అప్రూవర్గా మారాడు. మిగతా 77 మందిపై 2009లో విచారణ ఆరంభమైంది. మొత్తం 1,171 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను నమోదు చేసిన న్యాయస్థానం... ఈ నెల 8న 49 మందిని దోషులుగా తేల్చింది. మరో 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ క్రమంలోనే, ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్.పటేల్ శుక్రవారం దోషులకు శిక్షను ఖరారుచేస్తూ తీర్పు వెలువరించారు. 38 మందికి మరణ దండన, 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దోషుల్లో 48 మందికి రూ.2.85 లక్షలు, ఒకరికి రూ.2.88 లక్షల చొప్పున జరిమానా విధించారు. హత్య, నేరపూరిత కుట్ర, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి అభియోగాల కింద ఈ శిక్షలను ఖరారు చేశారు.
మృతుల కుటుంబాలకు రూ.లక్ష..
పేలుళ్లలో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. తీర్పు వెలువరిస్తున్న సమయంలో... దోషులంతా అహ్మదాబాద్లోని సబర్మతి కేంద్ర కారాగారం, దిల్లీలోని తిహార్ జైలుతో పాటు భోపాల్, గయ, బెంగళూరు, కేరళ, ముంబయి జైళ్ల నుంచి వీడియో ద్వారా విచారణకు హాజరయ్యారు.
ఇంకా నలుగురిపై అభియోగాలు...
వరుస పేలుళ్ల కేసును గుజరాత్ పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా ఛేదించాయి. రాజస్థాన్, దిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక పోలీసులు కూడా దర్యాప్తులో సహకరించారు. ఈ కేసులో మరో నలుగురిపైనా ఆరోపణలు నమోదైనా, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది తెలిపారు. వరుస బాంబు పేలుళ్లపై తొలుత విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ త్రివేది... ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. తీర్పు వెలువరించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎ.ఆర్.పాటిల్ 2017 జులై 14 నుంచి వాదనలు వింటూ వచ్చారు.
స్వాగతించిన బాధిత కుటుంబాలు
పేలుళ్లలో మృతిచెందినవారి కుటుంబ సభ్యులు ఈ తీర్పును స్వాగతించారు. మిగతా దోషులకూ మరణ శిక్షను ఖరారుచేసి ఉంటే బావుండేదని ఈ పేలుళ్లలో తండ్రిని, సోదరుడిని కోల్పోయి... తీవ్రంగా గాయపడిన యశ్ వ్యాస్ పేర్కొన్నాడు. అతని తండ్రి దుష్యంత్ వ్యాస్ ఓ క్యాన్సర్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. కుమారులిద్దరికి సైకిల్ తొక్కడం నేర్పిద్దామని సాయంత్రం వారిని సరదాగా బయటకు తీసుకువెళ్లగా... పేలుళ్లు సంభవించాయి! ఆ ధాటికి దుష్యంత్తో పాటు యశ్ సోదరుడు కూడా మృతిచెందారు. 50% కాలిన గాయాలతో యశ్ చాలా నెలలు ఐసీయూలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. తొమ్మిదేళ్ల వయసులో ఇంతటి ఘోరాన్ని చూసిన యశ్... ఇప్పుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. భారీ పేలుడు కారణంగా పాక్షికంగా వినికిడి శక్తిని కోల్పోయాడు.
‘‘ఈ సమయం కోసమే మా అమ్మ, నేను 13 ఏళ్లుగా నిరీక్షించాం. మిగతా దోషులకూ ఇదే శిక్షను ఖరారుచేసి ఉంటే బావుండేది’’ అని ఈ దుర్ఘటనలో తండ్రిని, సోదరుడిని కోల్పోయి... తీవ్రంగా గాయపడిన యశ్ వ్యాస్ పేర్కొన్నారు.
గోద్రా అల్లర్లకు ప్రతీకారంగానే..
2002-గోద్రా రైలు దుర్ఘటన అనంతరం చెలరేగిన అల్లర్లలో వెయ్యి మందికి పైగా మృతిచెందారు. దీనికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) రగిలిపోయింది. అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్లకు ప్రణాళిక రూపొందించింది. దీన్ని అమలు చేయడంలో మధ్యప్రదేశ్కు చెందిన సఫ్దర్ నగోరి, కుమరుద్దీన్ నగోరిలతో పాటు... గుజరాత్కు చెందిన ఖయూముద్దీన్ కపాడియా, జాహిద్ షేక్, షంషుద్దీన్ షేక్ తదితరులు కీలక పాత్ర పోషించారు. సఫ్దర్, జాహిద్లు పేలుడు పదార్థాల కొనుగోలుకూ, ఐఎం అనుబంధ నిషేధిత ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)కూ నిధులు సేకరించినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు.
మోదీనీ చంపాలనుకున్నారు...
అహ్మదాబాద్లో వరుస బాంబు పేలుళ్లు చేపట్టడంతో పాటు... నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని కూడా హతమార్చాలని కుట్రదారులు ప్రణాళికలు వేసినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుధీర్ బ్రహ్మభట్ చెప్పారు. కేసు దర్యాప్తు సందర్భంగా ఓ నిందితుడు ఈ విషయాన్ని వెల్లడించినట్టు పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారని ఆయన వివరించారు. సదరు వ్యక్తిని న్యాయస్థానం దోషిగా తేల్చి, శిక్ష విధించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు