Telangana News: బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్ల్లు?
రాష్ట్రంలో మరో భారీ బడ్జెట్కు రంగం సిద్ధమవుతోంది. సొంత రాబడులపై విశ్వాసంతో పూర్తి ఆశావహంతో పెద్దపద్దుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. రూ.రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ దిశగా అడుగులు వేస్తోంది.
సొంత ఆదాయంలో గణనీయ వృద్ధి
సంక్షేమం, దళితబంధుకు పెద్దపీట
భారీగా పెరగనున్న ప్రభుత్వ వ్యయం
2022-23 పద్దుపై ఆర్థికశాఖ కసరత్తు వేగవంతం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ బడ్జెట్కు రంగం సిద్ధమవుతోంది. సొంత రాబడులపై విశ్వాసంతో పూర్తి ఆశావహంతో పెద్దపద్దుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. రూ.రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేసింది. పన్నురాబడులు, పన్నేతర ఆదాయం, ఎఫ్ఆర్బీఎం పరిధిలో పెరగనున్న రుణాలు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో వృద్ధిరేటు పెరుగుదల తదితర అంశాల ప్రాతిపదికగా పెద్దబడ్జెట్ను రూపొందిస్తున్నారు. సంక్షేమం, వ్యవసాయం, దళితబంధు పథకానికి భారీగా కేటాయింపులుండాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో పద్దు పరిమాణం పెరగనుంది. ప్రస్తుత అంచనా రూ.2.30 లక్షల కోట్లు కాగా వచ్చే బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్లు దాటుతుందని విశ్వసనీయ సమాచారం. పద్దు కసరత్తు ఈ నెల మూడో వారంలోపు పూర్తిచేయాలని ఆర్థికశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. శాఖల వారీ ప్రతిపాదనల పరిశీలన దాదాపు పూర్తయింది.
పెరిగిన వాణిజ్య పన్నులశాఖ ఆదాయం
అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే విభాగాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వాణిజ్య పన్నులశాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖల స్థితిగతులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఆదాయ పెంపుపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు.
* 2021-22 ఆర్థిక సంవత్సంలో వాణిజ్యపన్నులశాఖ సాధించిన రాబడి మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు 25 నాటికే వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ శాఖ అంచనాలు దాటనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, అమ్మకంపన్ను ఆదాయ పెరుగుదల 15-20 శాతం ఉంటుందని భావిస్తున్నారు.
* రిజిస్ట్రేషన్ల ఆదాయం ఈ సారి రూ.12,500 కోట్లుగా అంచనా వేయగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం రూ.15,000 కోట్లు దాటనుంది. జీఎస్డీపీలో వృద్ధిరేటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిలో తీసుకునే రుణం మొత్తం కూడా పెరగనుంది. ప్రస్తుత ఏడాది ఈ రుణ లక్ష్యం రూ.45,559గా అంచనా వేసింది.
* ప్రభుత్వం సంక్షేమం, వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో ఈ సారి ఈ రెండు ప్రాధాన్య రంగాలకు భారీ కేటాయింపులుంటాయని అంచనా. దళితబంధును పూర్తి స్థాయిలో అమలు చేయడం లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ సంక్షేమానికి పెద్దమొత్తంలో నిధులివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఆర్సీ అమలు, పథకాలకు కేటాయింపులు, వివిధ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసే వ్యయం కూడా పెరగనుంది. దీంతో బడ్జెట్ పరిమాణం పెరగడం అనివార్యమని ఆర్థికశాఖ అధికారులు విశ్లేషించారు. ఆదాయ అంచనాలపై దాదాపు స్పష్టత రావడంతో బడ్జెట్ ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చి సీఎంకి నివేదించడానికి ఆర్థికశాఖ సిద్ధమైంది.
తొలగిన అవరోధాలతో పక్కాగా పన్నేతర రాబడి
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా సర్కారు భారీగా నిధులను సమకూర్చుకోనుంది. ఈ బడ్జెట్లో భూముల అమ్మకం ద్వారా రూ.20వేల కోట్ల అంచనా వేయగా ఇప్పటికి రూ.5,000 కోట్లలోపే వచ్చింది. అయితే విక్రయానికి అవరోధాలు తొలగిపోవడంతో వేలం ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే వేలం వేసిన భూములకు రికార్డు స్థాయిలో ధరలు, హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ఎస్టేట్ జోరు తదితర అంశాలతో భూముల అమ్మకం ద్వారా భారీ రాబడిని అంచనా వేస్తుంది. న్యాయపరమైన వివాదాలు పరిష్కారం కావడంతో పాటు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ద్వారా భూముల విక్రయానికి రంగం సిద్ధంచేస్తోంది. కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందే మొత్తం రూ.32వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM