CM KCR: దేశమంతా తెలంగాణలా..
‘స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం ఉండాల్సిన విధంగా లేదు. దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోంది. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పనికిమాలిన దందా నడుస్తోంది. మనకు పరిశ్రమలు రావాలన్నా, కొత్తగా ఉద్యోగాలు రావాలన్నా వాతావరణం మంచిగా ఉండాలి. శాంతిభద్రతలు బాగుండాలి. మతం పేరిట కత్తులు పట్టి పొడుచుకుంటారు.. కర్ప్యూ, ఫైరింగ్ ఉంటాయంటే ఎవరూ రారు. మనం తెలంగాణను ఎంత బాగా చేసుకున్నామో, దేశమూ
అలా అభివృద్ధి చెందాలన్నదే నా ఆశయం
అందుకే దిల్లీ దాకా మనం కొట్లాడాల్సిన అవసరముంది
పోరాటానికి బయలుదేరా.. మీ అందరి దీవెనలు కావాలి
నారాయణఖేడ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు, సంగారెడ్డి: ‘స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం ఉండాల్సిన విధంగా లేదు. దుర్మార్గమైన వ్యవహారం జరుగుతోంది. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే పనికిమాలిన దందా నడుస్తోంది. మనకు పరిశ్రమలు రావాలన్నా, కొత్తగా ఉద్యోగాలు రావాలన్నా వాతావరణం మంచిగా ఉండాలి. శాంతిభద్రతలు బాగుండాలి. మతం పేరిట కత్తులు పట్టి పొడుచుకుంటారు.. కర్ప్యూ, ఫైరింగ్ ఉంటాయంటే ఎవరూ రారు. మనం తెలంగాణను ఎంత బాగా చేసుకున్నామో, దేశమూ అదే విధంగా అభివృద్ధి సాధించాలి. దేశం గురించి మనం కొట్లాడాల్సిన అవసరముంది. బంగారు తెలంగాణ మాదిరిగా.. బంగారు భారతదేశాన్ని తయారు చేసుకోవాలి’ అని సీఎం కె.చంద్రశేఖర్రావు ప్రజలకు వివరించారు. అమెరికా కంటే గొప్పగా దేశాన్ని తయారు చేసేలా ముందుకు సాగాలన్నారు. మనం అమెరికాకు పోవడం కాదు.. వాళ్లే ఇక్కడకు వచ్చేలా చేసే గొప్ప సంపద, వనరులు ఈ దేశంలో ఉన్నాయన్నారు. జాతీయ రాజకీయాల్లో మనం ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. తాను పోరాటానికి బయలుదేరానని.. ప్రజలందరి దీవెనలు కావాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు నీళ్లందించేలా రూపొందించిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులకు ఆయన సోమవారం నారాయణఖేడ్లో శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించనుందనే విషయాన్ని స్పష్టం చేశారు. ‘‘ఈ ఏడేళ్లలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో మీ అందరికీ తెలుసు. అనేక రంగాల్లో మనం దేశంలోనే నంబర్వన్గా నిలబడ్డాం. తలసరి విద్యుత్ వినియోగంలోనూ మనమే నంబర్ వన్. అర్హులందరికీ అసరా పింఛన్లు ఇస్తున్నాం. పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. ఆడపిల్లల పెళ్లికి రూ.లక్ష ఇస్తున్నాం. వ్యవసాయ రంగంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది మీ అందరికీ తెలుసు. విద్యార్థులు బయటకు వెళ్లి చదువుకోవాలంటే ఏ రాష్ట్రంలోనూ రూ. 20 లక్షలు ఇవ్వడం లేదు. మనం అంబేడ్కర్, జ్యోతిరావు ఫులే పేరు మీద అన్ని వర్గాల పిల్లలు విదేశాల్లో చదువుకునేలా స్కాలర్షిప్లు ఇస్తున్నాం. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి మీద రూ. 1.25 లక్షలు ఖర్చుచేస్తూ నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ఆ పిల్లలు బ్రహ్మాండంగా, అద్భుతంగా పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నారు.
అక్కడా.. రైతుబంధు, బీమా ఇస్తామంటున్నారు!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నన్ను అడిగారు. ‘మీరు రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నారంట.. ఎలా ఇస్తున్నరో చెప్పండి.. మేము ఇస్తాం’ అని అడిగారు. రైతు చనిపోతే పది రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా ఇచ్చేది ఒక్క తెలంగాణలోనే. రైతుబంధు కావాలంటూ దండం పెట్టాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఇవ్వాల్సిన పనిలేదు. యాసంగి, వానాకాలాల్లో నేరుగా మీ ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నాం. ఇలా దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. మనం అద్భుత ప్రగతి దిశగా దూసుకుపోతున్నాం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రజల కోసం తపించే వ్యక్తి హరీశ్రావు
హరీశ్రావుపై సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. క్రియాశీల మంత్రి అంటూ కితాబిచ్చారు. ప్రజల కోసం పనిచేయాలనే తపన ఉండే వ్యక్తి అని వివరించారు. ఆయన ఈ జిల్లాలో ఉండబట్టే అనేక మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఏడాదిన్నరలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతలను పూర్తి చేసి జిల్లాకు గోదావరి జలాలు అందేలా చూడాలని హరీశ్రావుకు సూచించారు. దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పథకాలకు తాను శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరో పదిరోజుల తర్వాత కేతకీ సంగమేశ్వర దర్శనం కోసం వస్తానన్నారు. ఆ సమయంలో సంగారెడ్డిలో వైద్యకళాశాలను ప్రారంభిస్తానన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి వరాలు కురిపించారు. సంగారెడ్డి, జహీరాబాద్ పురపాలికలకు రూ. 100 కోట్లు, మిగతా ఆరు పురపాలికలకు రూ. 150 కోట్లు, 699 పంచాయతీలకు ఒక్కోదానికి రూ. 20 లక్షల చొప్పున రూ. 140 కోట్లు కేటాయిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిదుల కోరిక మేరకు నిజాంపేటను కొత్త మండలం చేస్తామని ప్రకటించారు.
దేశం బాగుంటే తెలంగాణ మరింత అభివృద్ధి
మీరు చాలా గౌరవం, ప్రేమతో ఎమ్మెల్యేలను గెలిపిస్తున్నారు.. రాష్ట్రంలో కేసీఆర్ ఉండాలని దీవిస్తున్నారు. వలసవాదుల పాలనలో జరిగిన అన్యాయాలను మీ అందరి దీవెనలతో.. తిప్పికొట్టాం. సాగు, తాగునీళ్లు, కరెంటు, విద్య, వైద్య రంగాల్లో మనం దూసుకుపోతున్నాం. మన తలసరి ఆదాయం దేశంలో గర్వంగా చెప్పుకొనే స్థాయిలో ఉంది. మరింత అభివృద్ధి సాధించాలంటే.. రాష్ట్రమే కాదు దేశమూ బాగుండాలి. అప్పుడే తెలంగాణను మరింత మెరుగ్గా మార్చుకోగలం.
మాట్లాడినోళ్ల వద్దే ఇప్పుడు కరెంటు లేదు
‘‘పట్టుబట్టి మనం తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడే ముందు ఎన్నో బద్నాంలు పెట్టారు. ఎన్నో అపనమ్మకాలు కలిగించారు. మీకు కరెంటు రాదు.. చీకటైపోతది. పరిశ్రమలు మొత్తం తరలిపోతాయి.. మీకు పరిపాలన చేతకాదని అన్నారు. ఇప్పుడు వాళ్ల వద్దే కరెంటు లేదు. ఇవాళ తెలంగాణలో 24 గంటల కరెంటుంది. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోని నాణ్యమైన కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. మీరిచ్చిన శక్తితోనే ఇది సాధ్యమైంది. మంచినీళ్ల బాధ శాశ్వతంగా పోయింది.’’
- సీఎం కేసీఆర్
వేదికపైకి చిమ్నీబాయి
సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. నారాయణఖేడ్ ఉప ఎన్నికల సందర్భంగా 2017లో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్న చిమ్నీబాయి అనే మహిళ గురించి గుర్తు చేశారు. సర్దార్ తండాకు చెందిన ఆమె.. తమ తండాలో నీళ్లు లేవని, కరెంటు ఉండదని, రోడ్డు లేదంటూ తనకు చెప్పగా తాము అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. రానున్న రోజుల్లో నారాయణఖేడ్కు సాగునీళ్లు రానున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో చిమ్నీబాయి ఇక్కడే ఉండొచ్చు అని హరీశ్రావు అనగానే.. ఆమె ముందుకొచ్చారు. ఆమెను సీఎం కేసీఆర్ వేదికపైకి రమ్మన్నారు. తన పక్కనే కూర్చోబెట్టుకుని మాట్లాడారు. నారాయణఖేడ్ అభివృద్ధి కోసం హరీశ్రావు ఎంతగా కృషి చేశారో చెప్పడానికి చిమ్నీబాయిని ఇన్ని రోజులు గుర్తుంచుకోవడమే నిదర్శమని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు