Student Loan: విద్యారుణాలకు ‘పూచీ’కత్తెర
కూకట్పల్లికి చెందిన రమేష్కు గత ఏడాది హైదరాబాద్లోని ప్రముఖ మేనేజ్మెంట్ కాలేజీలో ఎంబీఏ సీటు వచ్చింది. ఏడాదికి ఫీజు రూ.3 లక్షలు. ఆ కాలేజీలో చదివితే ప్రాంగణ నియామకానికి, మంచి ప్యాకేజీ లభించేందుకూ అవకాశం ఉంది.
హామీ లేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోని బ్యాంకులు
25 శాతం మించని మంజూరు
ఉన్నత చదువులకు దూరమవుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులు
ఈనాడు - హైదరాబాద్
కూకట్పల్లికి చెందిన రమేష్కు గత ఏడాది హైదరాబాద్లోని ప్రముఖ మేనేజ్మెంట్ కాలేజీలో ఎంబీఏ సీటు వచ్చింది. ఏడాదికి ఫీజు రూ.3 లక్షలు. ఆ కాలేజీలో చదివితే ప్రాంగణ నియామకానికి, మంచి ప్యాకేజీ లభించేందుకూ అవకాశం ఉంది. నెలకు రూ.30 వేల వేతనంతో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఆ విద్యార్థి తండ్రి విద్యారుణం కోసం తన వేతన ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించగా కుదరదనే సమాధానం వచ్చింది. ‘అనేక బ్యాంకులను సంప్రదించినా ఫలితం లేకపోయింది. ఫిక్స్డ్ డిపాజిట్ లేదా బ్యాంకులో ఖాతా ఉండి ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపే వ్యక్తి పూచీకత్తు, కనీసం రూ.20 లక్షల స్థిరాస్తి పత్రాలు చూపితే తప్ప విద్యారుణం ఇవ్వలేమని చెప్పడంతో చివరకు ఆ సీటు వదులుకున్నాం’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అది ఆయనొక్కరి ఆవేదన మాత్రమే కాదు.. ఏటా ఈ రుణాలను ఆశిస్తున్న వేల మందిది.
తెలంగాణలో విద్యా రుణాలు అందుకోవడం విద్యార్థులకు గగనంగా మారింది. ఏటా లక్ష్యాలను ఘనంగా నిర్దేశించుకుంటున్న బ్యాంకులు ఇవ్వడంలో మాత్రం వెనకడుగు వేస్తున్నాయి. ఏటా పెరిగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లక్ష్యాలను పెంచుకుంటున్నట్టు గణాంకాల్లో కన్పిస్తున్నా.. మంజూరు మాత్రం 25 శాతం మించడం లేదు. 2015-21 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఏ సంవత్సరంలోనూ మంజూరు లక్ష్యాలను రుణ సంస్థలు చేరుకోకపోవడం వాస్తవ పరిస్థితికి నిదర్శనం.
పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యా రుణాలు విరివిగా ఇవ్వాలని 2013-14 ఆర్థిక సంవత్సరంలో నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్వారా ఏటా లక్ష్యాలను నిర్దేశిస్తోంది. బ్యాంకులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఏటా ప్రముఖ విద్యా సంస్థల్లో వృత్తి విద్యా కోర్సుల్లో సీటు వచ్చిందనే ధ్రువీకరణతో బ్యాంకు మెట్లు ఎక్కిన వారికీ అవమానాలు తప్పడం లేదు. ఏదైనా పూచీకత్తు ఉంటేనే దరఖాస్తు ఇవ్వాలని బ్యాంకులు ముఖం మీదే చెప్పి పంపుతున్నాయని పలువురు విద్యార్థులు ‘ఈనాడు’తో చెప్పారు. ‘‘ఐఐటీ, ఎన్ఐటీ లాంటిచోట్ల ప్రవేశాలు లభించే పక్షంలో ఆ విద్యా సంస్థలే అవసరమైన వారికి బ్యాంకుల ద్వారా రుణాలను అందించేందుకు సహకరిస్తున్నాయి. మిగిలిన చోట్ల ఆ పరిస్థితి లేదు. దీంతో రుణాల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్న తల్లిదండ్రులకు ఆయా రుణ సంస్థలు కొర్రీలతో చుక్కలు చూపిస్తున్నాయి.. ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే ప్రతినెలా నికర ఆదాయం కలిగి ఉన్న వారి దరఖాస్తులనే పరిశీలనలోకి తీసుకుంటున్నాయి. పరపతి ఉన్న వ్యక్తులతో హామీ, ఉద్యోగుల పూచీకత్తు, చెల్లింపు విధానాలు, కోర్సులు, ఇలా రకరకాల నిబంధనలతో దరఖాస్తులు వెనక్కు పంపేందుకే ప్రాధాన్యమిస్తున్నాయి’ అని రుణాల కోసం ప్రయత్నించి విఫలమైన పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపారు. దీంతో తప్పనిసరిగా ఉన్నత చదువుల కోసం అధిక వడ్డీలతో ప్రైవేటు రుణాలవైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని, లేదంటే ఆస్తులు అమ్ముకోవడం మినహా మరోమార్గం ఉండటం లేదని వాపోయారు. అయితే బ్యాంకుల వాదన మరోలా ఉంది. ‘నిబంధనలు సరళంగా ఉన్నా విద్యా రుణాలను తిరిగి వసూలు చేసుకునే సమయంలో ఇబ్బందులు తప్పడంలేదు. ఈ రుణాల్లో దీర్ఘకాలిక చెల్లింపులు లేనివి(ఎన్పీఏ) సుమారు 12 శాతం దాకా ఉంటున్నాయి. అందుకే సాధారణ రుణాలకు పాటించాల్సిన నిబంధనలే పాటించాల్సి వస్తోంది’’ అని ప్రముఖ బ్యాంకు రుణాలను పర్యవేక్షించే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు.
విద్యా రుణాలకు అర్హతలు, ఆర్బీఐ మార్గదర్శకాలు ఇలా
* యూజీసీ, ఏఐటీయూసీ గుర్తింపు ఉన్న విద్యా సంస్థల్లో అన్ని కోర్సుల్లో చదివే విద్యార్థులు అర్హులే.
* ఉన్నత విద్యకు రూ.10 లక్షలు ఇవ్వాలి..
* విదేశాల్లో విద్యా సంస్థల ఫీజులు, ఇతర అవసరాలకు సరిపడా మంజూరు చెయ్యాలి.
* ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.4 లక్షల వరకు ఇవ్వొచ్చు.
* రూ.4 లక్షల నుంచి రూ.7.5 వరకూ మూడో వ్యక్తి (థర్డ్పార్టీ గ్యారెంటీ) పూచీకత్తుతో..
* 7.5 లక్షలకు పైబడిన రుణాలకు స్థిరాస్తి (టాంజియిల్ కొలేటరల్ సెక్యూరిటీ) పూచీకత్తు అవసరం..
* రుణాలు తిరిగి చెల్లింపు విధానం, వడ్డీరేట్లు బ్యాంకుల ఆధారంగా మార్చుకోవచ్చు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ