Viveka Murder Case: నేరాన్ని నాపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తారన్నారు
కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్రెడ్డిలతో కలిసి వివేకానందరెడ్డిని హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్రెడ్డి,
దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ఈ విషయం నాతో చెప్పారు
అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డితో కలిసి వివేకాను హత్య చేయించానన్నారు
సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన కల్లూరు గంగాధర్రెడ్డి
ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్-కడప: కడప ఎంపీ వై.ఎస్.అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వై.ఎస్.భాస్కర్రెడ్డిలతో కలిసి వివేకానందరెడ్డిని హత్య చేయించినట్లు వారికి అత్యంత సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి తనతో చెప్పారని కల్లూరు గంగాధర్రెడ్డి సీబీఐకి తెలిపారు. ఆ నేరాన్ని తనపై వేసుకుంటే అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డిలు రూ.10 కోట్లు ఇస్తారంటూ శివశంకర్రెడ్డి ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు. పులివెందుల వాసి అయిన గంగాధర్రెడ్డి.. అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డిలకు అత్యంత సన్నిహిత అనుచరుడిగా ఉండేవారు. గతేడాది అక్టోబరు 2న సీబీఐ అధికారుల ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ‘‘అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, వారి కుటుంబానికి వివేకాతో తీవ్ర శత్రుత్వం ఉంది. వివేకా అనుచరులు అవినాష్రెడ్డిని, భాస్కర్రెడ్డిని, వారి కుటుంబాన్ని, దేవిరెడ్డి శివశంకర్రెడ్డిని సరిగా పట్టించుకునేవారు కాదు. అందుకే వారంతా వివేకాను అంతం చేయాలనుకునేవారు. 2019 ఆగస్టు చివరి వారంలో శివశంకర్రెడ్డి నాకు వాట్సప్ కాల్ చేశారు. అత్యవసరంగా మాట్లాడాలని, పులివెందులకు 8 కి.మీ. దూరంలోని గోదాము వద్దకు రావాలని పిలిస్తే వెళ్లాను. అవినాష్రెడ్డి పీఏ రమణారెడ్డి నా ఫోన్ తీసుకుని, మొదట అంతస్తుకు వెళ్లాలని సూచించారు. అక్కడ ఉన్న శివశంకర్రెడ్డి నా బాగోగులు తెలుసుకోవడంతో పాటు ఏం చేస్తున్నావని అడిగారు. ఏమీ చేయట్లేదని, తిరుపతిలో నా భార్యకు ఉద్యోగం ఇప్పించాలని అడిగాను. ‘నీ భార్య ఉద్యోగం గురించి ఎందుకు అంతలా ఆందోళన చెందుతావు.. నీకు మంచి ఆఫర్ ఇస్తాను’ అని చెప్పారు. ‘వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యానేరాన్ని నీపై వేసుకో. మరో ఇద్దరు, ముగ్గురితో కలిసి నువ్వే హత్య చేసినట్లు సిట్ అధికారుల ఎదుట అంగీకరించు. అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డిలతో కలిసి ప్రణాళిక వేసి, కొత్తవాళ్లతో వివేకాను హత్య చేయించా. హత్య చేసినవారిని పోలీసులు విచారిస్తే... వారు నిజం చెప్పేస్తే నేను, మిగతా వారు ఇబ్బందుల్లో పడతాం’ అని శివశంకర్రెడ్డి చెప్పారు. ఇది సీఎం జగన్ సొంత బాబాయ్ హత్య విషయమని.. తేడా వస్తే తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంటాననే ఉద్దేశంతో శివశంకర్రెడ్డి ఆఫర్ని నేను తిరస్కరించాను’’ అని గంగాధర్రెడ్డి తన వాంగ్మూలంలో వివరించారు.
వివేకా హత్యలో తండ్రీకుమారుల ప్రమేయం: ఆర్.వెంకటరమణ
‘వివేకా హత్యలో అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, డి.శివశంకర్రెడ్డిల ప్రమేయం ఉందని కడప, పులివెందుల నియోజకవర్గాల్లోని చాలామందికి తెలుసు. కానీ వారి అధికారబలాన్ని చూసి భయంతో ఎవరూ నోరు విప్పట్లేదు’ అని పులివెందులకు చెందిన ఆర్.వెంకటరమణ గతేడాది డిసెంబరు 1న సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. నేను గతంలో కడపలో సీబీఐ అధికారులను కలిసిన విషయాన్ని శివశంకర్రెడ్డి తెలుసుకున్నారు. ‘సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో హత్య జరిగిన ప్రదేశంలో నేను ఉన్నట్టుగా చెప్పావా?’ అని అడిగారు. ఆధారాల ధ్వంసం గురించి వారికి చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు’ అని వెంకటరమణ తన వాంగ్మూలంలో చెప్పారు.
వారికి వివేకాతో శత్రుత్వం: జగదీశ్వర్రెడ్డి
వివేకానందరెడ్డికి వైకాపాలో పెరుగుతున్న ఆదరణ చూసి అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, వారి అనుచరుడు డి.శివశంకర్రెడ్డి ఆయనతో శత్రుత్వం పెంచుకున్నారని పులివెందుల వాసి నర్రెడ్డి జగదీశ్వర్రెడ్డి సీబీఐకి తెలిపారు. కల్లూరు గంగాధర్రెడ్డి స్నేహితుడైన జగదీశ్వర్రెడ్డి గతేడాది డిసెంబరు 18న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు