Andhra News: 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే: మంత్రి బొత్స

ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాదేనని, బహుశా దాన్ని ఆధారంగా చేసుకునే న్యాయస్థానాలు మాట్లాడి ఉంటాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన సచివాలయంలో

Published : 08 Mar 2022 08:34 IST

ప్రభుత్వం దృష్టిలో అమరావతి శాసన రాజధాని

ఈనాడు, అమరావతి: ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాదేనని, బహుశా దాన్ని ఆధారంగా చేసుకునే న్యాయస్థానాలు మాట్లాడి ఉంటాయని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘ప్రభుత్వం దృష్టిలో అమరావతి శాసన రాజధాని మాత్రమే. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఈ తీర్మానానికి దిల్లీ ఆమోదం తీసుకున్నారా? చట్ట ప్రకారం చేశారా? అంటే అలాంటిదేదీ జరగలేదు. అందువల్ల విభజన చట్టం ప్రకారం 2024 వరకు మన రాజధాని హైదరాబాదే. రాజధానిని మేం గుర్తించాక పార్లమెంట్‌కు పంపి అక్కడ ఆమోదం పొందాక చట్ట సవరణ చేయాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని మంత్రి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని