గొప్పగా ఆలోచించాలి.. ప్రపంచంతో పోటీపడాలి
మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం స్థలాలను, అదనంగా
మహిళా పారిశ్రామిక పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం స్థలాలు అతివలకే ఇస్తున్నామని వెల్లడి
ఈనాడు, సంగారెడ్డి: మహిళా పారిశ్రామికవేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం స్థలాలను, అదనంగా 10 శాతం పెట్టుబడి రాయితీనీ వారికి అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని గొప్పగా ఆలోచించాలని.. అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచంతో పోటీపడాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామిక పార్కును ఆయన మంగళవారం ప్రారంభించారు. ఎఫ్ఎల్ఓ జాతీయ అధ్యక్షురాలు ఉజ్వలా సింఘానియా, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు ఉమా చిగురుపాటి, ఎఫ్ఎల్ఓ ప్రతినిధులతో కలిసి పార్కు ప్రాంగణంలోని పైలాన్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే నాలుగో అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 18 వేల అనుమతులు ఇచ్చామన్నారు. తద్వారా 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.6 మిలియన్ ఉద్యోగాలను సృష్టించామని చెప్పారు. సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం మరో 100 ఎకరాలైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బల్క్డ్రగ్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్ దేశానికే రాజధానిగా మారిందని చెప్పారు. వ్యాక్సిన్ల విషయంలో మన నగరం ప్రపంచ రాజధాని అని ఆయన వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా పారిశ్రామికవేత్తలు ఆహారశుద్ధి, ఏరోస్పేస్, డిఫెన్స్, హెల్త్కేర్ రంగాల్లో సరికొత్త ఉత్పత్తులను రూపొందించేలా చొరవ చూపాలన్నారు.
‘ఉద్యామిక’తో మహిళా పారిశ్రామికవేత్తలకు దన్ను
మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఉండేలా దేశంలోనే తొలిసారిగా ‘ఉద్యామిక’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టనున్నామని కేటీఆర్ వెల్లడించారు. కార్పస్ ఫండ్ను అందుబాటులోకి తేవడం, వారి ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపడమే లక్ష్యంగా దీన్ని రూపొందించామన్నారు. 2018లో ప్రారంభించిన వి-హబ్ ద్వారా 2,194 మంది మహిళలు అంకుర సంస్థలను నెలకొల్పారని వెల్లడించారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం రూ.66.3 కోట్ల నిధులు సమకూర్చినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్రంజన్, టీఎస్ఐఐసీ అధ్యక్షుడు గ్యాదరి బాలమల్లు, సీఈవో మధుసూదన్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
అతివలకు వరం
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో మహిళాపారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్ ఎఫ్ఎల్ఓ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని గొప్పగా ఆలోచించాలని.. అంతర్జాతీయస్థాయి ఉత్పత్తులను తయారు చేస్తూ ప్రపంచంతో పోటీపడాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు