Telangana: ఉద్యోగనామ సంవత్సరం
తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల నియామకాలకు శ్రీకారం చుట్టనుంది. లక్ష కొలువుల భర్తీకి కార్యాచరణ ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీ గురించి వెల్లడించనుంది. శాసనసభ వేదికగా
లక్ష ఖాళీల భర్తీ.. కొత్త పోస్టులు కూడా
నేడే నియామకపు క్యాలెండర్
అసెంబ్లీలో వెల్లడించనున్న సీఎం
జిల్లాలవారీగా భర్తీ చేసే స్థానిక ఉద్యోగాలు వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల నియామకాలకు శ్రీకారం చుట్టనుంది. లక్ష కొలువుల భర్తీకి కార్యాచరణ ప్రకటించనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలతో పాటు కొత్త పోస్టుల భర్తీ గురించి వెల్లడించనుంది. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు దీనిపై బుధవారం ప్రకటన చేయనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేలా క్యాలెండర్ను వెల్లడించనున్నట్లు సమాచారం. వివిధ శాఖల్లోని ఖాళీలతో పాటు ఇప్పటికే మంజూరు చేసిన పోస్టులు, కొత్త పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఉన్నవి, కొత్తగా అనుమతి ఇవ్వాల్సినవి తదితర అంశాలపై పూర్తి సమాచారం సిద్ధం చేసినట్లు తెలిసింది. కొత్త నియామకాలకు ఆర్థికపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని 2022-23 బడ్జెట్లో రూ. 4,000 కోట్లు కేటాయించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్ ప్రసంగంలోనే కొలవుల గురించి ప్రకటించాలని మొదట భావించినా ముఖ్యమంత్రే దీనిపై శాసనసభ వేదికగా వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుత ఖాళీలతో పాటు కొత్తగా అవసరమైన పోస్టుల భర్తీని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త పోస్టుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్త జోనల్ విధానం అమలు, ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది.
సర్వీస్ కమిషన్, బోర్డుల ద్వారా..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో భర్తీ చేయాల్సిన ఉద్యోగాలతో పాటు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, గురుకులాల రిక్రూట్మెంట్ బోర్డు, పంచాయతీరాజ్ సర్వీసెస్ నియామక బోర్డు, సింగరేణి రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులపై కసరత్తు చేశారు. ప్రాధాన్యక్రమంలో నియామక ప్రక్రియపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. గ్రూప్ 1, 2, 3, 4లతో పాటు గురుకులాల్లో బోధన సిబ్బంది, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుళ్లు, ఇతర నియామకాలపై ప్రకటన చేయనుంది. స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయిస్తూ ప్రత్యేక క్యాలెండర్ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.
టీచర్ల రిక్రూట్మెంట్పైనా స్పష్టత
గురుకులాల్లోనే సుమారు 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. పాఠశాల విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసే క్రమంలో మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వీలుగా టెట్ను నిర్వహించాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. దీంతోపాటు ఇటీవల పాఠశాలల ఫీజులపై నియమించిన కమిటీ కూడా టెట్ నిర్వహించాలని సిఫారసు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో టీచర్ రిక్రూట్మెంట్ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. 18,000 నుంచి 20,000 ఉపాధాయ పోస్టులు అవసరమని అంచనా. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా హైతుబద్ధీకరణ పూర్తి చేస్తే ఖాళీలపై స్పష్టత వస్తుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలవారీగా పోస్టుల వివరాలు
కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చాక స్థానికులకు ఉద్యోగ నియామకాల్లో ఎలా మేలు జరిగిందో స్పష్టం చేసేలా ప్రభుత్వం దృష్టిసారించింది. పోస్టుల భర్తీలో స్థానిక నిరుద్యోగ యువతకు ఎలాంటి న్యాయం జరగనుందో వివరించనుందని తెలిసింది. ఈ నేపథ్యంలో భర్తీ కానున్న స్థానిక ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను జిల్లాలవారీగా వెల్లడించనున్నట్లు తెలిసింది.ఋ‘
లక్షకు చేరిన ఖాళీలు..
పదోన్నతులు, జీవో 317 ప్రకారం బదిలీల ప్రక్రియకు ముందు వివిధ శాఖల్లో సుమారు 60,000 పోస్టులు భర్తీ చేయడానికి అవకాశం ఉందని ఆర్థికశాఖ మంత్రిమండలికి వివరించింది. తర్వాత కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడం, పదోన్నతులు పూర్తికావడంతో ఖాళీలపై చాలావరకు స్పష్టత వచ్చినట్లు తెలిసింది. సుమారు నెలరోజుల ముందు ప్రభుత్వం చేసిన కసరత్తులో సుమారు 70,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని గుర్తించినట్లు సమాచారం. పరిపాలన సంస్కరణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి శేషాద్రి ఆధ్వర్యంలో నియమించిన కమిటీ కూడా ఉద్యోగ ఖాళీలు, కొత్త నియామకాలు, అదనపు పోస్టులు తదితర అంశాలపై వివరాలను ప్రభుత్వానికి అందించినట్లు తెలిసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సర్కారు దాదాపు లక్ష కొలువుల భర్తీపై ప్రకటనకు సిద్ధమైందని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ