ఖాళీలు మిగలకుండా.. పక్కా ప్రణాళిక
రాష్ట్రంలో ఈసారి ఉద్యోగ నియామకాలను పక్కాగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పోస్టులు మిగలకుండా అన్నింటినీ భర్తీ చేయాలని చూస్తోంది. అభ్యర్థులు గడువులోగా విధుల్లో చేరకపోతే వారిని వదిలేసి ప్రాధాన్య క్రమంలో
ఎవరైనా ఒకటికి మించి పోస్టులకు ఎంపికైనా.. ఏదో ఒకటే ఖరారు
గడువులోపు చేరకుంటే తదుపరి అర్హులైనవారికి అవకాశం
ప్రభుత్వ యోచన..
వివిధ ప్రతిపాదనలపై అధికారుల కసరత్తు
ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలో ఈసారి ఉద్యోగ నియామకాలను పక్కాగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పోస్టులు మిగలకుండా అన్నింటినీ భర్తీ చేయాలని చూస్తోంది. అభ్యర్థులు గడువులోగా విధుల్లో చేరకపోతే వారిని వదిలేసి ప్రాధాన్య క్రమంలో మిగిలిన అర్హులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీని విధివిధానాలపై కసరత్తు చేస్తోంది. గతంలో వివిధ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరకపోతే చాలా పోస్టులు ఖాళీగా మిగిలిపోయేవి. వాటిని మిగులు పోస్టులుగా తేల్చి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే భర్తీ చేసేవారు. ఒకసారైతే వివిధ పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో దాదాపు 500 మందికి పైగా ఒకటికి మించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారు విధుల్లో చేరని కారణంగా వివిధ శాఖల్లో 500 పోస్టులు భర్తీ కాలేదు. అర్హులు ఎందరో ఉన్నా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. దీంతో ఆ 500 పోస్టుల్లో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఉద్యోగాన్వేషణలో అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు ప్రయత్నించడం మామూలే. కొందరు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతుంటారు. చివరకు నచ్చిన పోస్టును ఎంచుకొని, మిగిలిన వాటిని వదిలేస్తారు. దీంతో అవన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆశావహులైన నిరుద్యోగులు తర్వాతి నోటిఫికేషన్ వరకు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని నివారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు సూచించింది. అధికారులు పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నారు.
అధికారులు మరింత కసరత్తు చేసి నోటిఫికేషన్లలోని పోస్టులు ఏ మాత్రం మిగలకుండా చూడడం కోసం మరికొన్ని ప్రతిపాదనలు కూడా రూపొందించనున్నారని తెలుస్తోంది. వాటిలో మెరుగైన విధానాన్ని ఖరారు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
తొలి ప్రతిపాదన: ఏ పోస్టులకు వెళ్తున్నారో ఆరా
ప్రస్తుతం రాతపరీక్షల సమయంలో అభ్యర్థులు ఇప్పటికే ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారా అనే సమాచారం తీసుకుంటారు.అభ్యర్థుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేసి ఎవరు ఏయే పరీక్షలు రాస్తున్నారో తెలుసుకుంటారు. తర్వాత ఒకటి మించి ఉద్యోగాలకు ఎంపికైన వారిని గుర్తించి వారు ఏ పోస్టులో చేరాలనుకుంటున్నారో, దేనిని వదిలేస్తారో ఆరా తీస్తారు. వారు వదిలిపెట్టిన పోస్టులకు జాబితాలో ఉన్న తర్వాతి అర్హులకు అవకాశం ఇస్తారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా గడువులోగా నియామక ఉత్తర్వులు తీసుకోకుంటే వారికి ఏదో ఒకచోట పోస్టింగ్ ఖరారు చేసి మిగిలిన వాటి నుంచి మినహాయిస్తారు.
రెండో ప్రతిపాదన: కేరళ, తమిళనాడు విధానం
కేరళ, తమిళనాడుల్లో పోస్టులు మిగిలిపోకుండా.. అర్హుల జాబితాలోని తర్వాతి వారికి అవకాశమిచ్చి నోటిఫికేషన్లలోని పోస్టులన్నీ భర్తీ చేస్తున్నారు. రాతపరీక్షల అనంతరం ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరయ్యే అభ్యర్థులకు మాత్రమే పోస్టింగ్ ఖరారు చేస్తారు. అదే ఉద్యోగం అతను/ఆమెకు ఖరారవుతుంది. మిగిలిన వాటికి అర్హత (ఎలిమినేషన్) కోల్పోతారు. ఎవరైనా రాని పక్షంలో వరస క్రమంలో అర్హులైనవారికి అవకాశమిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం ఎంసెట్ కౌన్సెలింగ్, కేంద్రంలో నీట్ కౌన్సెలింగ్ ఇదే తరహాలో సాగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఐదు జతల ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి
బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. -
సంక్షిప్త వార్తలు
ఫోన్ ట్యాపింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్