Telangana News: సభ ఆమోదం లేకుండానే ఖర్చులు!
రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన పారదర్శక బడ్జెట్ విధానాలను అనుసరించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సూచించింది. శాసనసభ ఆమోదం లేకున్నా భారీ మొత్తంలో వ్యయం జరుగుతోందని
ఆరేళ్లలో రూ.1.32 లక్షల కోట్ల వ్యయం
పద్దుల నిర్వహణపై కచ్చితత్వం లేదు
బడ్జెట్ ప్రతిపాదనల్లో వాస్తవికత ఏదీ!
పారదర్శక విధానం పాటించాలి
పేలవంగా అంతర్గత నియంత్రణ వ్యవస్థ
రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక
ఈనాడు - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన పారదర్శక బడ్జెట్ విధానాలను అనుసరించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సూచించింది. శాసనసభ ఆమోదం లేకున్నా భారీ మొత్తంలో వ్యయం జరుగుతోందని పేర్కొంది. బడ్జెట్ ప్రతిపాదనల్లో వాస్తవికతలేదని, బడ్జెట్ అమలుపై నియంత్రణ, పర్యవేక్షణ తగినంతగాలేదని పేర్కొంది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ ఆడిట్ నివేదికలను మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. అందులోని ముఖ్యాంశాలివి..
బడ్జెట్ కేటాయింపులు లేకుండానే వ్యయం చేయడం శాసనసభ అధికారాన్ని తగ్గించినట్లవుతుంది. 2014-15 నుంచి ఆరేళ్లలో అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసిన రూ. 1,32,547 కోట్ల వ్యయాన్ని క్రమబద్ధీకరించాల్సి ఉంది. కొన్ని కేటాయింపులకు మించి ఖర్చు చేయగా, అనుబంధ కేటాయింపులకు శాసనసభ ఆమోదం లేకున్నా ఖర్చు చేశారు. కేటాయింపులు, ఖర్చుల మధ్య తేడాలను స్పష్టంగా వివరించలేదు. పేలవమైన అంతర్గత నియంత్రణ వ్యవస్థను ఇది ప్రతిబింబిస్తోంది. పద్దుల నిర్వహణ ఆందోళన రేకెత్తిస్తోంది. భారత ప్రభుత్వ అకౌంటింగ్ ప్రమాణాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాలి. పదేపదే మిగులు ఏర్పడుతున్న శాఖలను హెచ్చరించి వాటి సామర్థ్యానికి అనుగుణంగా బడ్జెట్లో మార్పులు చేయాలి. అవసరం లేకున్నా అనుబంధ కేటాయింపులు చేయడం, ఏడాది చివరలో తిరిగి కేటాయించడం వంటివి పరిహరించాలి. రుణాలపై ఆధారపడకుండా వివిధ అభివృద్ధి పథకాల నిధుల కోసం అదనపు వనరులను సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేయాలి. కేటాయింపులు లేకుండా అధిక వ్యయం విషయంలో శాసనసభలో డిమాండ్లను ప్రవేశపెట్టేలా గవర్నర్ చూడాలి. పీడీ అకౌంట్ల నిర్వహణ పారదర్శకంగా లేదు. బడ్జెట్ను తగిన రీతిలో విశ్లేషించి అర్థవంతంగా వినియోగ పద్దులను తయారు చేయాలి.
* 2020-21లో పెట్టుబడి వ్యయం అంతకుముందు ఏడాదితో పోలిస్తే రూ. 16,859 కోట్ల నుంచి రూ. 15,922 కోట్లకు తగ్గింది. నిర్దిష్టమైన రాబడులు లేని సంస్థల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం 2017-18 నుంచి 2019-20 మధ్య చెల్లించింది. వాటిలో మిషన్ భగీరథ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ, జలమండలి, టీఎస్ఐఐసీ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఎస్సీ, ఎస్టీ సహకార అభివృద్ధి సంస్థలు ఉన్నాయి.
* 198 పీడీ ఖాతాలకు గాను 139 ఖాతాల్లో 2021 మార్చి ఆఖరు నాటికి లావాదేవీలు లేవు. వినియోగంలో లేనివాటిని మూసివేయడంలేదు.
కేటాయింపుల్లో సగమే ఖర్చు
* రుణమాఫీకి రూ. 6,012 కోట్లు కేటాయించినా రూ. 213 కోట్లే ఖర్చు చేశారు. రెండు పడకల గదుల ఇళ్లకు రూ. 5,000 కోట్లు ఇచ్చినా రూ. 550 కోట్లే వ్యయం అయింది.
* రాష్ట్ర విపత్తు స్పందన నిధిలో 2019-20లో రూ. 1,003 కోట్లు ఉన్నా రూ. 25.8 కోట్లే వ్యయం చేశారు.
* పురపాలక, సామాజిక సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల శాఖల్లో రూ. 1000 కోట్లు అంతకంటే ఎక్కువ మిగులు ఏర్పడుతోంది. పురపాలకశాఖ, గృహనిర్మాణశాఖ, నీటిపారుదలశాఖ, పరిశ్రమల శాఖలో మూడేళ్లలో సగంకంటే తక్కువ నిధులే ఖర్చయ్యాయి.
* ఎస్సీ, ఎస్టీలకు జనాభా కంటే ఎక్కువ నిధులను కేటాయించారు. ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో 21 శాతం, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో 26 శాతం వ్యయం కాలేదు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి నిధులు 2016-17 నుంచి వినియోగం తక్కువగా ఉంది.
* సాధారణ డిపాజిట్లను చిన్న పద్దు ఖాతాకు బదిలీ చేయడం ఆందోళనకరమైన పరిణామం. రూ. 7,836 కోట్లను ఇలా బదిలీ చేశారు.
* పీడీ ఖాతాల నిధులను ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించకూడదు. ఏడు ప్రభుత్వ కంపెనీలు/కార్పొరేషన్లలోని పీడీ ఖాతాల్లో జమ చేసిన రూ. 1,075 కోట్లను ప్రభుత్వ పద్దులకు వెలుపల ఉన్న బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. ఇందులో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, క్రిస్టియన్ వెల్ఫేర్ ఉన్నాయి,
* ప్రభుత్వ పద్దులు, శాసనసభ పర్యవేక్షణకు వెలుపల ఉండే బ్యాంకు ఖాతాలకు భారీగా నిధులను బదిలీ చేశారు.
* ప్రభుత్వ కంపెనీలు, స్వయంపాలక సంస్థల పద్దుల నిర్వహణలో జాప్యం జవాబుదారీతనాన్ని పలుచన చేస్తోంది.
* ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం వచ్చి ఏడేళ్లయినా క్యాపిటల్ పద్దు కింద రూ. 1,51,349 కోట్లు, రుణాలు, అడ్వాన్సుల కింద రూ. 28,099 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల కింద రూ. 4,474 కోట్లు, సస్పెన్స్ ఖాతా కింద రూ. 238 కోట్లు, అనామతు పద్దు కింద రూ. 310 కోట్ల పంపకం జరగాల్సి ఉంది.
తప్పనిసరి వ్యయాలు పైపైకి
రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరి ఖర్చులు పెరుగుతున్నాయి. వేతనాలు, పింఛన్లపై వ్యయం, వడ్డీల చెల్లింపులు 2015-16 నుంచి పెరుగుతున్నాయి. 2020-21లో రెవెన్యూ వ్యయంలో దాదాపు 54 శాతం తప్పనిసరి ఖర్చులు ఉన్నాయి. రెవెన్యూ రాబడిలో జీతాలు, వేతనాలు 24 శాతం, వడ్డీల చెల్లింపు, పింఛన్లపై వ్యయం 13 శాతంగా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!