Telangana: స్టడీ సర్కిళ్లలో డిజిటల్ శిక్షణ
రాష్ట్రంలో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అభ్యర్థులను సన్నద్ధం చేసేలా ఉచిత శిక్షణ అందించేందుకు స్టడీసర్కిళ్లు సిద్ధమవుతున్నాయి. వీలైనంత ఎక్కువమందికి శిక్షణ అందించేందుకు
ఆన్లైన్ పాఠాలు, వీడియోలు, మాక్ టెస్టులు
ఏప్రిల్ నుంచి తరగతుల ప్రారంభానికి ఏర్పాట్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద అభ్యర్థులను సన్నద్ధం చేసేలా ఉచిత శిక్షణ అందించేందుకు స్టడీసర్కిళ్లు సిద్ధమవుతున్నాయి. వీలైనంత ఎక్కువమందికి శిక్షణ అందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమశాఖలు ఏర్పాట్లు చేశాయి. ఉద్యోగ ప్రకటనల మేరకు స్వల్పకాలిక శిక్షణ కోర్సులు ఏప్రిల్ నుంచి ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యాయి. ఒక్కో స్టడీసర్కిల్లో 100 మందికే అవకాశమున్నప్పటికీ, డిజిటల్ వనరుల ద్వారా వీలైనంత ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వనున్నాయి. యూట్యూబ్ ఛానెళ్లు, వీడియో పాఠాలు, ఆన్లైన్ శిక్షణతో మరింతమందికి పాఠాలు చేరువ చేయనున్నాయి. శిక్షణ సంస్థలకు వెళ్లలేని పేద అభ్యర్థులకు ఈ అవకాశం ఉపయోగకరమని సంక్షేమాధికారులు తెలిపారు.
‘‘రాష్ట్రంలోని 11 స్టడీ సర్కిళ్ల పరిధిలో 1100 మందికి, ఐఏఎస్ స్టడీ సర్కిల్లో 150 మందికి శిక్షణ ఏప్రిల్తో ముగియనుంది. పోలీసు విభాగంలో 18 వేల పోస్టులు ఉండటంతో 3 వేల మందికి ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు పోలీసుశాఖ సహకారం తీసుకుంటున్నాం. అభ్యర్థులకు వసతితో పాటు కొలువు దక్కేలా కఠిన శిక్షణ అందిస్తాం. జిల్లా కేంద్రాల్లో కనీసం 100 మందికి డేస్కాలర్ విధానంలో జూనియర్, డిగ్రీ కళాశాలల్ని గుర్తించి అక్కడ రోజూ శిక్షణ అందిస్తాం. మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తాం’’ అని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆర్.వేణుగోపాలరావు తెలిపారు.
స్టయిపెండ్ ఇచ్చి ఉచిత శిక్షణ
ఐటీడీఏల పరిధిలో మూడు, మన్ననూరు(మహబూబ్నగర్), హైదరాబాద్లలో ఒక్కోటి చొప్పున ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలున్నాయి. 10 వేల మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ పూర్తయింది. ఉద్యోగ నోటిఫికేషన్లు దృష్టిలో పెట్టుకుని గతంలోనే ప్రాథమిక పరీక్ష నిర్వహించి గ్రూప్స్, డీఎస్సీ, పోలీసు ఉద్యోగాల శిక్షణకు 615 మందిని ఆ శాఖ ఎంపిక చేసింది. పోలీసు కొలువుల కోసం 300 మందికి స్పోర్ట్స్ స్కూల్లో శిక్షణ నడుస్తోంది. నల్గొండ, నిజామాబాద్ యువజన శిక్షణ కేంద్రాల్లో తరగతులతో పాటు వసతి గృహాలు, పాఠశాలల్లో నోటిఫికేషన్లకు అనుగుణంగా తరగతులు నిర్వహించనుంది. ‘‘డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు శిక్షణ ఇస్తాం. స్వల్పకాలిక కోర్సులుంటాయి. వసతికి అవకాశం లేని ప్రాంతాల్లో అభ్యర్థులకు స్టయిపెండ్ ఇస్తాం’’ అని ఎస్టీ స్టడీసర్కిల్ డైరెక్టర్ వి.సముజ్వల తెలిపారు.
లక్ష మందికి అవకాశం కల్పించేలా...
దాదాపు లక్ష మందికి శిక్షణను చేరువ చేయాలని బీసీ స్టడీసర్కిల్ నిర్ణయించింది. టెలిగ్రాం, యూట్యూబ్ ఛానెళ్లతో వీడియో పాఠాలు అందుబాటులో ఉంచుతుంది. రోజూ మాక్టెస్టులు నిర్వహించనుంది. 119 నియోజకవర్గాల పరిధిలో అధ్యయన కేంద్రాలు తెరిచి 50 వేల మంది బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనుంది. ప్రస్తుతం 12 కేంద్రాల్లో మూణ్నెల్ల ఫౌండేషన్ కోర్సు కొనసాగుతోంది. శిక్షణార్థులకు స్టయిపెండ్ ఇవ్వాలని నిర్ణయించింది. ‘‘మంత్రి కమలాకర్, కార్యదర్శి వెంకటేశంల సహకారంతో బీసీ స్టడీసర్కిల్ ద్వారా శిక్షణ పొందే విద్యార్థుల కోసం ప్రత్యేక టెలిగ్రాం, యూట్యూబ్ ఛానెళ్లు సిద్ధం చేశాం. టెలిగ్రాం ఛానెల్లో రోజూ 100 ప్రశ్నలు ఇస్తున్నాం. ఈఛానెల్ 2 వేల మందికి అందుబాటులో ఉంది. 10 వేల మందికి విస్తరిస్తాం’’ అని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని