TET Exam: జూన్ 12న టెట్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నారు. ఎస్సీఈఆర్టీ సంచాలకురాలు, టెట్ సభ్య కార్యదర్శి రాధారెడ్డి గురువారం ఈ మేరకు వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ మే 29వ తేదీన ఆదివారం నిర్వహించాలని ప్రతిపాదించింది.
రేపటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నారు. ఎస్సీఈఆర్టీ సంచాలకురాలు, టెట్ సభ్య కార్యదర్శి రాధారెడ్డి గురువారం ఈ మేరకు వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ మే 29వ తేదీన ఆదివారం నిర్వహించాలని ప్రతిపాదించింది. అయితే పదో తరగతి పరీక్షల కారణంగా ఇబ్బంది అవుతుందని భావించిన ప్రభుత్వం జూన్ 12న నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఆ రోజు ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్, పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రాన్ని శుక్రవారం నుంచి www.tstet.cgg.gov.in వెబ్సైట్లో ఉంచుతామని రాధారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 2017 జులై తర్వాత పాఠ్య పుస్తకాల సిలబస్లో మార్పు చేయనందున టెట్లో కూడా పాత సిలబస్ ఉంటుందని భావిస్తున్నారు. కానీ బీఈడీ, డీఈడీలో మెథడాలజీకి కొత్త పుస్తకాలు వచ్చినందున ఆ ప్రకారం టెట్లో ప్రశ్నలుంటాయని చెబుతున్నారు.
* టెట్ ప్రాముఖ్యత: ఇందులో కనీస మార్కులు సాధిస్తేనే తర్వాత జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) రాయడానికి అర్హులు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్టీకి 80 శాతం వెయిటేజీ ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.
* 2011 నుంచి ఇప్పటికే అర్హత సాధించిన వారు: ఉమ్మడి ఏపీలో 4 సార్లు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు పరీక్ష జరిపారు. పాసైనవారు సుమారు 3 లక్షల మంది.
* ఈసారి టెట్కు హాజరయ్యే అభ్యర్థులు: కనీసం 3 లక్షల మంది అని అంచనా.
ఇదీ సిలబస్...
పేపర్-1: మనో విజ్ఞానశాస్త్రం (శిశు వికాసం, బోధనా పద్ధతులు), ఆంగ్లం, తెలుగు, పర్యావరణశాస్త్రం, గణితం అనే అయిదు భాగాలుంటాయి. ఒక్కో దానికి 30 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కుల ప్రశ్నపత్రం. ప్రతి విభాగంలో ఆరు మార్కులు బోధనా పద్ధతుల (పెడగాజి లేదా మెథడాలజీ)కు కేటాయిస్తారు. 1 నుంచి 8 తరగతుల వరకు ఉండే సిలబస్ ఆధారంగా ప్రశ్నలిస్తారు.
పేపర్-2: పేపర్-1 మాదిరిగానే అయిదు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కానీ ఇందులో 6-10 తరగతుల సిలబస్ ఆధారంగా ప్రశ్నలుంటాయి. సైన్స్, సోషల్ విద్యార్థులకు వేర్వేరు పేపర్లు ఉంటాయి. సైన్స్లో మనో విజ్ఞానశాస్త్రం, తెలుగు, ఆంగ్లం, గణితం, సైన్స్కు 30 మార్కుల చొప్పున ఉంటాయి. సోషల్ సైన్స్ వారికి మాత్రం గణితం, సైన్స్కు బదులు మొత్తం సాంఘిక శాస్త్రానికే 60 మార్కులు కేటాయిస్తారు.
ఇదీ టెట్ స్వరూపం
* అర్హులు: డీఈడీ, బీఈడీ పూర్తయిన వారు
* పేపర్లు: 2. పేపర్-1ను డీఈడీ, బీఈడీ అభ్యర్థులు రాయొచ్చు. పేపర్-2ను కేవలం బీఈడీ వారే రాయాలి.
* మొత్తం మార్కులు: 150 ప్రశ్నలకు 150 మార్కులు (ఒక్కో పేపర్కు). మైనస్ మార్కులు ఉండవు.
* ఉత్తీర్ణతకు కావాల్సిన మార్కులు: జనరల్ కేటగిరీకి 90, బీసీలు-75, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు 60.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు