CM KCR: సమరశంఖం పూరిద్దాం
తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణపై కేంద్రం మొద్దునిద్ర నటిస్తోందని, మరింత ఒత్తిడి పెంచి దాని వైఖరిని మార్చేందుకు పోరాటమే శరణ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
కేంద్రం మెడలు వంచేలా కార్యాచరణ
పెద్దఎత్తున ఆందోళనలతో తెలంగాణ తడాఖా చూపుదాం
ధాన్యం సేకరణ కోసం ఊరూరా తీర్మానాలు
2వ తేదీ తరువాత దిల్లీలో ధర్నాలు
పార్లమెంటులోనూ నిరసనలు
మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో యాసంగి ధాన్యం సేకరణపై కేంద్రం మొద్దునిద్ర నటిస్తోందని, మరింత ఒత్తిడి పెంచి దాని వైఖరిని మార్చేందుకు పోరాటమే శరణ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విన్నపాలను వినే పరిస్థితిలో కేంద్రం లేదని, దాంతో చర్చలు, వినతులు అవసరం లేదని తెలిపారు.
తెలంగాణ తడాఖా చూపుదామని, ప్రకటించిన విధంగా రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు చేద్దామని సూచించారు. దిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్లతో సీఎం శుక్రవారం సమావేశమయ్యారు.దాదాపు ఏడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. దిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో చర్చల సారాంశాన్ని మంత్రులు కేసీఆర్కు వివరించారు. అనంతరం ధాన్యం కొనుగోళ్ల కార్యాచరణపై చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ...‘‘కేంద్రం తెలంగాణపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. తీవ్ర వివక్షను కొనసాగిస్తోంది. రాజకీయ కారణాలతో తమ ధర్మాన్ని విస్మరిస్తోంది. అత్యంత కీలకమైన అంశంపై కనీస పట్టింపు లేదు. రైతాంగంపై కరడుగట్టిన వ్యతిరేకతతో వ్యవహరిస్తోంది. ఎన్డీయే హయాంలో రైతులకు ఒరిగిందేమీ లేదని మరోసారి నిరూపించింది. ఇప్పటికే నల్లచట్టాలను తెచ్చి రైతులను బాధించిన కేంద్రం రాష్ట్ర రైతాంగాన్నీ ఇబ్బందులు పెడుతోంది. పంజాబ్ తరహా విధానం తెలంగాణలో అమలు చేయడానికి ఆటంకాలేమీ లేవు. పెద్దగా ఆర్థికభారం ఉండదు. కేంద్రం సేకరణకు ముందుకొస్తే రాష్ట్ర ప్రభుత్వపరంగా సహకరించేందుకు సంసిద్ధతను తెలియజేసినా... నిమ్మకు నీరెత్తినట్లు మొండితనం చూపుతోంది. కేంద్రమంత్రి పీయూష్గోయల్ పక్కా వ్యాపారిగా నిరూపించుకుంటున్నారు. రైతులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పొలాల్లోకి వచ్చి చూస్తే పరిస్థితి తెలుస్తుంది.
పోరు ఉద్ధృతం చేద్దాం
కేంద్రంపై పోరు ఉద్ధృతం చేద్దాం. బహుముఖ ఒత్తిడి పెంచుదాం. పంజాబ్ తరహాలో ధాన్యం సేకరణ చేపట్టాలని అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్లు, జిల్లాపరిషత్లు, రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, ఆత్మ కమిటీలు, పురపాలక సంఘాల్లో తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపుదాం. పార్లమెంటులోనూ ఎంపీలు నిరసన తెలియజేస్తారు. రాష్ట్రంలో దశల వారీగా ఆందోళనలు కొనసాగిద్దాం. వచ్చే నెల రెండో తేదీ తర్వాత దిల్లీకి వెళ్లి ధర్నా చేద్దాం. ఈ పోరాటంలో ఇతర పార్టీల మద్దతు తీసుకుందాం. పోరాటం తీవ్రస్థాయికి చేరాలి. ఇందులో అన్నదాతలను భాగస్వాములను చేద్దాం. ఆందోళనలతో దిల్లీలో ప్రకంపనలు పుట్టిద్దాం. గిరిజన రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. విభజన హామీల అమలుపైనా నిలదీద్దాం. ఉగాది తరువాత కేంద్రం మెడలు వంచేలా కార్యాచరణ ఉంటుంది’’ అని సీఎం తెలిపారు.
నిర్దయగా కేంద్రం
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ‘‘కేంద్రం రైతాంగంపై పూర్తి నిర్దయతో ఉంది. కేంద్రమంత్రి పీయూష్గోయల్ మానవత్వం మరిచి మాట్లాడుతున్నారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు. పరిస్థితిని ఏ మాత్రం అర్థం చేసుకోవడం లేదు. రాష్ట్ర భాజపా నేతలు ఏమి చెబితే అదే చెబుతున్నారు తప్ప కనీస విషయపరిజ్ఞానం లేదు. కేంద్రం వైఫల్యాలను రాష్ట్రంపై రుద్దాలని చూస్తున్నారు’’ అని సీఎంకు వివరించినట్లు తెలిసింది. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు శనివారం తెలంగాణ భవన్లో దిల్లీలోని పరిస్థితులు, రాష్ట్రంలో ఆందోళనలపై విలేకరుల సమావేశంలో వివరించనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...