Telangana News: భూసేకరణ భారమే!
ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ సంస్థల సమూహంగా రంగారెడ్డి జిల్లాలో 19 వేల ఎకరాల్లో ఔషధనగరిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 14 వేల ఎకరాల వరకు ప్రభుత్వ
భారీగా పెరిగిన భూముల విలువలు
పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రభావం
ఈనాడు - హైదరాబాద్
ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ సంస్థల సమూహంగా రంగారెడ్డి జిల్లాలో 19 వేల ఎకరాల్లో ఔషధనగరిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 14 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములు. మరో అయిదువేల ఎకరాలను సేకరించాల్సి రాగా దశల వారీగా అధికారులు నాలుగు వేలు సేకరించారు. చివరి దశకు వచ్చేసరికి మిగిలిన వెయ్యి ఎకరాలకు ధరలు అయిదురెట్లు పెరిగాయి.
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిపాదించిన పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వద్ద ధరలు భారీగా పెరగడంతో భూసేకరణ కష్టసాధ్యంగా మారుతోంది. ప్రత్యామ్నాయ స్థలాల వైపు ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ప్రాజెక్టుల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం 1.57 లక్షల ఎకరాలతో భూబ్యాంకును ఏర్పాటు చేసింది. ఇవన్నీ ప్రభుత్వ భూములే. పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు వీటిని ప్రభుత్వం కేటాయిస్తోంది. వీటితో పాటు కొత్తగా వచ్చే పరిశ్రమల కోసం, పారిశ్రామిక నడవాల కోసం అదనంగా భూసేకరణ అనివార్యమవుతోంది.
నడవాలపై ప్రభావం
రాష్ట్రంలో హైదరాబాద్-వరంగల్; హైదరాబాద్-నాగ్పుర్ పారిశ్రామిక నడవాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. రెండు మార్గాల్లో పదేసి వేల ఎకరాలలో వీటిని స్థాపించాలనుకుంది. అందులో మూడొంతుల భూములు ప్రభుత్వానివి కాగా...మిగతావి సేకరించేందుకు సన్నాహాలు చేపట్టింది. జాతీయ రహదారికి ఆనుకొని ఉండే భూములు అవసరం కాగా... దాని కోసం అన్వేషణ చేపట్టింది. అధికారులు ఎక్కడికి వెళ్లినా భారీగా ధరలు చెప్పడంతో టీఎస్ఐఐసీ అధికారులు కొనుగోలుకు వెనుకాడుతున్నారు. వీటికి తోడు హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్- బెంగళూరు పారిశ్రామిక నడవాలను ప్రభుత్వం కొత్తగా కేటాయించింది. ఆరు వేల ఎకరాల చొప్పున భూములను రెండు మార్గాల్లో సేకరించాల్సి ఉంది. ఈ మార్గాల్లో భారీ డిమాండు దృష్ట్యా భూసేకరణపై అధికారులు ఆందోళనలో ఉన్నారు. జహీరాబాద్ నిమ్జ్లో తొలుత భూములకు తక్కువ ధర ఉండేది. ఏటేటా ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు భూసేకరణ వ్యయం రెట్టింపు అయింది.
డ్రై పోర్టు ఏర్పాటులో జాప్యం
రాష్ట్రానికి బహుళవిధ లాజిస్టిక్స్ పార్కు(డ్రై పోర్టు)ను కేంద్రం మంజూరు చేసింది. దీనికి వెంటనే భూసేరణ చేయాలని సూచించింది. ప్రభుత్వం నల్గొండ జిల్లాలోని ఒక మండలంలో భూసేకరణ చేయాలని భావించింది. అక్కడ ధర పెరగడంతో సేకరణలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం దాన్ని మరో చోటుకు తరలించాలని యోచిస్తోంది. ఇవి గాక మరో 12 పారిశ్రామిక ప్రాజెక్టుల వద్ద ఇదే పరిస్థితి ఏర్పడింది.
నెలకొల్పే సంస్థలకే సేకరణ బాధ్యతలు!
రాష్ట్రానికి కొత్తగా వచ్చే సంస్థలు తమకు విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వేలైన్ల సమీపంలో భూములు కావాలని కోరుతున్నాయి. అక్కడ కొత్తగా సేకరించాల్సి ఉన్నందున ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం చూపిస్తోంది. కొన్ని సంస్థలు అంగీకరించినా మిగిలిన సంస్థలు తమకు అవే భూములు కావాలంటున్నాయి. తాము భూముల సేకరణకు పూనుకుంటే యజమానులు భారీగా ధరలను డిమాండు చేస్తున్నారని, అలాగాకుండా ఆయా సంస్థలే నేరుగా రంగంలోకి దిగాలని టీఎస్ఐఐసీ సూచిస్తోంది. దానికి అవసరమైన సాయం అందిస్తామని చెబుతోంది.
ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం: టీఎస్ఐఐసీ
పరిశ్రమలకు అవసరమైన భూములకు యజమానులు తమకు నచ్చిన ధరను డిమాండు చేస్తున్నారని టీఎస్ఐఐసీ వర్గాలు తెలిపాయి. వాటి ధరలతో పాటు సహాయ పునరావాసం వంటివి సమస్యాత్మకంగా మారుతున్నాయని వివరించాయి. ప్రస్తుత పరిస్థితులను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని ఆ వర్గాలు తెలియజేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ