Telangana News: ఇప్పుడేం చేద్దాం?
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే కొనాల్సి వస్తే ఆ ధాన్యాన్ని ఏం చేయాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? కొనుగోలుకు కావాల్సిన సాధన సంపత్తి ఎంత ఉంది? తదితర అంశాలపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
వడ్ల కొనుగోలుపై రాష్ట్ర సర్కారు తర్జన భర్జన
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమాలోచనలు
ఈ-వేలం అవకాశాల పైనా అధికారుల దృష్టి
ఈనాడు - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే కొనాల్సి వస్తే ఆ ధాన్యాన్ని ఏం చేయాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు ఏమిటి? కొనుగోలుకు కావాల్సిన సాధన సంపత్తి ఎంత ఉంది? తదితర అంశాలపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర మంత్రుల బృందం దిల్లీ వెళ్లి కేంద్రమంత్రి గోయల్ను కలిసినా తగిన హామీ లభించలేదు. మరోసారి కేంద్రంతో సంప్రదింపులు జరిపితే ఎలా ఉంటుందనే దానిపైనా అంతర్గతంగా చర్చలు సాగుతున్నట్లు అధికారవర్గాల సమాచారం. తెలంగాణలో యాసంగిలో ఎండవేడిమి కారణంగా ధాన్యంలో తేమ శాతం తగ్గిపోయి మిల్లింగ్ సమయంలో నూకలు ఎక్కువ వస్తాయి. అందుకే యాసంగి ధాన్యాన్ని మిల్లర్లు ఉప్పుడు బియ్యంగా మారుస్తారు. ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని కేంద్రం స్పష్టంగా తేల్చి చెప్పేసింది. ఉగాది తర్వాత వరి కోతలు ముమ్మరం కానున్నాయి. ఆలోపు ప్రత్యామ్నాయ ప్రణాళికను ఖరారు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
మిల్లర్లతో సంప్రదింపులు
రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏంచేయాలనే దానిపై ప్రభుత్వం అన్ని మార్గాలనూ పరిశీలిస్తోంది. ధాన్యం మొత్తాన్ని స్వయంగా కొనటమా? లేక మిల్లర్లతో కొనిపించడమా? అని కూడా యోచిస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లోని మిల్లర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే కనీస మద్దతు ధరకు తాము కొనలేమని మిల్లర్లు చెబుతున్నట్లు తెలిసింది. లెవీ విధానం ఎత్తివేసిన తరవాత మిల్లర్లు సొంత పెట్టుబడి లేకుండా ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతోనే వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పుడు వారు పెట్టుబడి పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపటం లేదు. ఏ గ్రేడు ధాన్యం క్వింటాకు కనీస మద్దతు ధర రూ. 1,980, సాధారణ రకం ధర రూ. 1,960గా ఉంది. ఇప్పటికే నిజామాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో క్వింటాకు రూ. 1,500 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారు.
ఈ-వేలం ద్వారా అమ్మవచ్చా?
గత యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 92.32 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుత సీజన్లో 35 లక్షల ఎకరాల్లో వరి సాగయినట్లు చెబుతోంది. ఆ లెక్క ప్రకారం 60 నుంచి 70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మించకపోవచ్చని అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యాన్ని కొనకపోతే రైతులు ఆందోళన చెందే పరిస్థితి వస్తుంది. దీనిని అధిగమించాలంటే ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను రూపొందించాల్సిందే. కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొని ఈ-వేలం ద్వారా విక్రయించటం ఒక ప్రత్యామ్నాయంగా ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వగా మిగిలిన ధాన్యాన్ని ఈ-వేలం రూపంలో విక్రయిస్తోంది. గత ఏడాది మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించింది. బియ్యంగా మార్చి విక్రయించటం కన్నా ధాన్యంగా విక్రయిస్తేనే ప్రభుత్వంపై భారం తక్కువ పడుతుందని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య