Telangana News: వడ్లు కొనేదాకా వదలం
తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వడ్ల సేకరణకు కేంద్రం ససేమిరా అంటోందని పేర్కొంటూ.. తెరాస సమరభేరి మోగించింది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో పెద్దఎత్తున నిరసనలు, దీక్షలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ల పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎమ్మెస్లు, జిల్లా పరిషత్ల ఛైర్పర్సన్లు, సభ్యులు, మండల పరిషత్ల అధ్యక్షులు, సభ్యులు, పురపాలక సంఘాలు, రైతుబంధు సమితులు, సహకార సంఘాల అధ్యక్షులు,...
యాసంగి ధాన్యం మొత్తం తీసుకోవాల్సిందే
కేంద్రం తీరుపై భగ్గుమన్న తెరాస
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, కార్యకర్తలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వడ్ల సేకరణకు కేంద్రం ససేమిరా అంటోందని పేర్కొంటూ.. తెరాస సమరభేరి మోగించింది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో పెద్దఎత్తున నిరసనలు, దీక్షలు చేపట్టింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ల పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎమ్మెస్లు, జిల్లా పరిషత్ల ఛైర్పర్సన్లు, సభ్యులు, మండల పరిషత్ల అధ్యక్షులు, సభ్యులు, పురపాలక సంఘాలు, రైతుబంధు సమితులు, సహకార సంఘాల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రైతుల నుంచి ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన వైఖరి మార్చుకునేంత వరకు పోరాటం ఆగదని, వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తామని మంత్రులు, నేతలు పేర్కొన్నారు. 594 మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన దీక్షలు జరిగాయి. తెరాస శ్రేణులతో పాటు రైతులు ర్యాలీగా తరలివచ్చి పాల్గొన్నారు.
దీక్షల్లో పాల్గొన్న మంత్రులు
కరీంనగర్ జిల్లా కరీంనగర్ గ్రామీణ మండలం గోపాల్పూర్ వద్ద రైతుల నిరసన, ధర్నాలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధాన్యాన్ని తూర్పారబట్టారు. కేంద్రం ధాన్యం కొనేంతవరకు పార్టీలకు అతీతంగా రైతులందరూ నిరసనలు చేపట్టాలని సూచించారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేటలో జరిగిన దీక్షలో వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడలో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబిత పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ జిల్లా రాయపర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర, జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాయపర్తిలో నిర్వహించిన ఎడ్లబండ్ల ర్యాలీ ఆకర్షణగా నిలిచింది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో తెరాస శ్రేణులు చేపట్టిన నిరసన దీక్షలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే రైతులంతా ఏకం కావాలని సూచించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో రవాణాశాఖ మంత్రి పువ్వాడఅజయ్కుమార్ పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్రం వ్యవహరిస్తున్న నియంతృత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. సూర్యాపేటలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. రైతులు వరి సాగు చేయాలని, వడ్లు కొంటామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెబితే.. కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేలు ఆయా మండలాల్లో దీక్షల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్వాల్లో జరిగిన దీక్షలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు ప్రజాగాయకుడు గద్దర్ పాల్గొని సంఘీభావం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్పల్లి, ఉమ్దాసాగర్ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
రేకుల డబ్బాలు కావు.. నివాస గృహాలే!
ఇక్కడ కనిపిస్తున్నవి రేకుల డబ్బాలు అనుకుంటే పొరపాటే. అవి నివాస గృహాలే. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.