Tamilisai soundararajan: అవమానాలు పట్టించుకోను
కొన్ని నిర్ణయాలను అంగీకరించకపోతే గవర్నర్ కార్యాలయాన్ని అవమానిస్తారా..? ప్రొటోకాల్ ఉల్లంఘిస్తారా? అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. గవర్నర్ పర్యటనకు వెళితే కలెక్టర్, ఎస్పీలు అక్కడకు రారా..?
కౌశిక్రెడ్డి అభ్యర్థిత్వంపై సంతృప్తి చెందలేదు
అంగీకరించకపోతే గవర్నర్ కార్యాలయాన్ని అవమానిస్తారా?
ప్రభుత్వంతో సత్సంబంధాలే కోరుకున్నా
సీఎం, మంత్రులతో చర్చకు సిద్ధం
విలేకరుల ప్రశ్నలకు గవర్నర్ తమిళిసై సమాధానాలు
ప్రధానమంత్రి మోదీతో భేటీ
ఈనాడు, దిల్లీ: కొన్ని నిర్ణయాలను అంగీకరించకపోతే గవర్నర్ కార్యాలయాన్ని అవమానిస్తారా..? ప్రొటోకాల్ ఉల్లంఘిస్తారా? అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. గవర్నర్ పర్యటనకు వెళితే కలెక్టర్, ఎస్పీలు అక్కడకు రారా..? అటువంటి నిబంధన ఏమైనా ఉందా? అని అన్నారు. తాను ఈ అవమానాలను పట్టించుకోనని..తెలంగాణ ప్రజలను ప్రేమిస్తానని తెలిపారు. బుధవారం ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాజ్భవన్కు, సీఎంవోకు మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సమావేశానంతరం ఆమె తెలంగాణభవన్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఎమ్మెల్సీగా కౌశిక్రెడ్డి అభ్యర్థిత్వంపై చెబుతూ అది గవర్నర్ కోటాఅని..సేవా విభాగంలో ఉందన్నారు. అభ్యర్థిత్వం విషయంలో తాను సంతృప్తి చెందలేదని చెప్పారు. ఈ విషయంలో తననెవరూ బలవంతం చేయలేరన్నారు. అది తన హక్కన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు రాజ్భవన్కు వచ్చినా చర్చిస్తానన్నారు. అధికారులు వచ్చి ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా పర్యటనలకు దూరం కాబోనన్నారు. రాజ్భవన్ పారదర్శంగా ఉంటుందన్నారు. ఉగాది సంబురాలు చేసినప్పుడు తాను అందరినీ పిలిచానన్నారు. కొంత మంది ఫలానా కారణాలతో రాలేమని ఫోన్ చేసి చెప్పారని... కొందరి నుంచి అటువంటి సమాధానం కూడా లేదన్నారు. విస్మరించి అవమానించారని చెప్పారు. తాను అహంకారిని(ఈగోయిస్ట్) కాదని స్నేహపూరిత వ్యక్తినని...తననెవరూ వేలెత్తి చూపలేరన్నారు.
రాజ్భవన్, సీఎంవో మధ్య ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు
‘‘రాజ్భవన్, సీఎంవో మధ్య ఏం జరిగిందో తెలంగాణ మీడియా ప్రసారం చేసింది. విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రధానికి ప్రత్యేకంగా నివేదించాల్సిన అవసరం లేదు. నా అధికారాలు ఇవి..అవి అంటూ బలవంతంగా వినియోగించను. నేను స్నేహపూరిత వ్యక్తిని. వివాదాస్పద వ్యక్తిని కాను.. దీనర్థం ప్రభుత్వం చెప్పే ప్రతిదాన్నీ ఆమోదిస్తానని కాదు. నేను కూడా రాజ్యాంగాధిపతిని. నాకూ అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడూ చట్టాన్ని, వ్యవస్థను అనుసరిస్తా. అలా వెళుతున్నప్పుడు దాన్ని ఇంకో విధంగా చూసి ప్రభుత్వం గవర్నర్ను అవమానించాలని చూస్తే పట్టించుకోను. నన్ను అక్కడ తమిళిసైగా కాకుండా గవర్నర్గా గౌరవించాలి. రాజ్యాంగాన్నీ గౌరవించాలి. ఇవాళ నేను ఉండొచ్చు. రేపు వేరే గవర్నర్ రావచ్చు. ప్రభుత్వం పంపే ప్రతి ఒక్కటీ అంగీకరించాలని లేదు. గతంలో రెండు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమోదించా. అవేవీ వివాదాస్పదం కాలేదు. గవర్నర్కోటా నియామకాలు రాజకీయ నిర్ణయం కాదు. రాజ్యాంగబద్ధ నిర్ణయం. మరో విషయం మండలి ప్రొటెం ఛైర్మన్ గురించి చెప్పారు. ప్రొటెంపై పాయింట్ లేవనెత్తితే వారు మళ్లీ పంపించారు. అది కూడా రాజ్యాంగపరమైందే. నేను ఏదైనా వ్యవస్థాపరమైన అంశాన్ని లేవనెత్తితే హృదయపూర్వకంగా అంగీకరించాలి లేదా చర్చించాలి. ఎప్పుడూ ప్రభుత్వంతో సత్సంబంధాలు కోరుకున్నా. అయినా గవర్నర్తో ప్రభుత్వం అలా వ్యవహరించడానికి కారణం ఏంటో తెలియదు. అంతమాత్రాన నేను ఆగిపోను. ముందుకువెళ్తూనే ఉంటా. మహమ్మారి కాలంలో సలహాలు ఇచ్చా. ఇలా చేయాలని నేను చెప్పగలను. కానీ ప్రభుత్వం తన బాధ్యతలను తెలుసుకోవాలి. గవర్నర్ పర్యటనల గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్కు తెలుసు. ఆ పర్యటనలో ఎలా వ్యవహరించాలో కూడా వారికి తెలుసు. అయినా నేను సమస్య సృష్టించదల్చుకోలేదు. నేను చర్య తీసుకుంటే గవర్నర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నానని మీరే అంటారు. నేను ప్రభుత్వం గురించి రిపోర్ట్ కార్డు ఇవ్వడం లేదు. అయితే ఆసుపత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని తొలి నుంచి చెబుతున్నా. ఈ విషయాన్ని గవర్నర్గానే కాదు ఓ వైద్యురాలిగా కూడా చెప్పా. ఇటీవల కూడా వరంగల్ ఆసుపత్రిలో ఎలుక కొరికి వ్యక్తి చనిపోవడం బాధ కల్గించింది. కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని అభినందించా. కొన్ని విషయాల్లో సూచనలు చేశా. ప్రభుత్వం నాకు ఎటువంటి నివేదిక ఇవ్వనప్పుడు నేనెలా గవర్నర్ ప్రసంగం చేయగలను? దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం భారీగా చేపట్టినందుకు ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాను. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి నేరుగా విమాన అనుసంధానత కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశాను. తెలంగాణలో నా గిరిజన ప్రాంత పర్యటన వివరాలు చెప్పా. ఇటీవల నాగర్కర్నూల్ జిల్లాలో చెంచులను కలిసేందుకు 500 కిలోమీటర్లు ప్రయాణించా. ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నా. 11, 12 తేదీల్లో భద్రాచలం వెళతా’ అని గవర్నర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు