Tamilisai Soundararajan: డ్రగ్స్, అవినీతిపై అమిత్షాకు చెప్పా
హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగం పెరిగిందని, యువతరం నాశనమవుతోందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్షాకు నివేదించినట్లు తెలిపారు. అవినీతిపైనా రిపోర్టు చేశానని చెప్పారు. గవర్నర్కు ప్రొటోకాల్ కల్పించని అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందువల్ల ముందస్తు ఎన్నికలకు పోయే
గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారనడం సరికాదు
భాజపా మనిషినని నాపై ఎలా ముద్ర వేస్తారు?
కేసీఆర్లా వ్యవహరించి ఉంటే శాసనసభ రద్దయ్యేది
సమ్మక్క సారక్క జాతరలో అధికారులు రాని విషయం ఎమ్మెల్యే సీతక్క చెప్పారు
విలేకరులతో ఇష్టాగోష్ఠిగా తమిళిసై
ఈనాడు - దిల్లీ
హైదరాబాద్లో డ్రగ్స్ వినియోగం పెరిగిందని, యువతరం నాశనమవుతోందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్షాకు నివేదించినట్లు తెలిపారు. అవినీతిపైనా రిపోర్టు చేశానని చెప్పారు. గవర్నర్కు ప్రొటోకాల్ కల్పించని అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లానన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అందువల్ల ముందస్తు ఎన్నికలకు పోయే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను గురువారం ఉదయం ఆమె కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు.. ఇతర అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. అనంతరం తెలంగాణభవన్లో విలేకరులతో గవర్నర్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘గవర్నర్ రాజకీయం చేస్తున్నారని మంత్రులు మాట్లాడడం సరికాదు. వారిని (ముఖ్యమంత్రి, మంత్రులు) పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా రాలేదు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళితే భాజపా మనిషినని నాపై ఎలా ముద్ర వేస్తారు? అక్కడ పార్టీ జెండా ఏమైనా ఎగురవేశానా? పార్టీ బెటాలియన్ నాతో వచ్చిందా? ఆ వ్యాఖ్యలు విని నవ్వుకోవడం తప్ప ఏం చేయగలం. నేను ఇప్పటివరకు భాజపా నేతలకు కేవలం ఒకటి, రెండు సార్లు మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చా. ఇతర పార్టీల నేతలే ఎక్కువ కలిశారు. గవర్నర్కు గౌరవం ఇస్తున్నామని మంత్రి (జగదీశ్రెడ్డి) చెప్పేది నిజమైతే గణతంత్ర వేడుకలకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు రాలేదు? సమ్మక్క, సారక్క జాతరకు నన్ను ఎందుకు పిలవలేదు? ఇదేనా గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గౌరవం? అయినా నేను పట్టించుకోలేదు. అధికారులు రాని విషయం గుర్తించి స్థానిక ఎమ్మెల్యే సీతక్క ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు. నాలుగైదు నెలలుగా జరుగుతున్న సంఘటనలు చూస్తూ... గవర్నర్కు అన్ని విధాలా ప్రొటోకాల్ కల్పిస్తున్నట్లు మంత్రులు ఎలా చెబుతారు? తెలంగాణలో మంచి సుసంపన్నమైన సంస్కృతి ఉంది.. సోదరసోదరీమణుల్లా కలిసిపోతారు.. నేను తెలంగాణ సోదరిని.. గవర్నర్గా కాకపోయినా.. ఒక సాధారణ మహిళగానైనా గౌరవం ఇవ్వాలా..?లేదా? నేను దిల్లీ వచ్చిన మూడు రోజుల్లో తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ కనీసం కనిపించలేదు. నేను ఉంటున్న శబరి బ్లాక్ వైపు రాలేదు. ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నందున రాలేకపోతున్నట్లు అర్థం చేసుకున్నా.
15 రోజులు సభ అనుమతి పత్రాలు తొక్కిపెట్టి ఉంచినట్లయితే..
ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో నేనూ వ్యవహరిస్తే ఇప్పటికే శాసనసభ రద్దయ్యేది. నిబంధనల ప్రకారం ఆరు నెలలకోసారి సమావేశాలు జరపాలి. గవర్నర్ ప్రసంగం లేకుండా జరపొచ్చు. కానీ గవర్నర్ సంతకం లేకుండా ప్రారంభించకూడదు. నా ప్రసంగం లేకుండా చేసినా సరే నేను సమావేశాల ప్రారంభానికి సంతకం చేశా. అప్పటికి సమావేశాలు జరిగి ఆరు నెలల కాలం ముగియడానికి కేవలం 15 రోజుల వ్యవధే ఉంది. ఆ పదిహేను రోజులు శాసనసభ సమావేశాల అనుమతి దస్త్రాన్ని తొక్కిపెట్టి ఉంచినట్లయితే సభే రద్దయ్యేది. కానీ నేను హుందాగా వ్యవహరించా. నేను పెద్ద రాజకీయ కుటుంబంలో జన్మించా. మా నాన్న ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒక దఫా ఎంపీగా చేశారు. చట్టాలు, రాజకీయాలపై అవగాహన ఉంది. తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలిగా నాటి ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా తీవ్రంగా గళం విప్పేదాన్ని.
అది రాజ్భవన్ కార్యక్రమం
రాజ్భవన్లో ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫొటో లేదనడం సరికాదు. అది పూర్తిగా రాజ్భవన్ కార్యక్రమం. రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు పెట్టాలని చెప్పాను. ఉద్దేశపూర్వకంగా సీఎం ఫొటో పెట్టవద్దనుకోలేదు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫొటో పెట్టాం. ఆ రోజు ఆయనను (సీఎం) పిలిచినా రాలేదు. కొందరు మంత్రులు వచ్చినందుకు సంతోషం. గవర్నర్ కార్యాలయాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో..? రాజ్భవన్కు, ప్రగతి భవన్కు దూరం ఎందుకు పెరిగిందో నాకు తెలియదు. ఈ విషయాన్ని మీడియానే అడగాలి. రాజ్యాంగ హోదాలో ప్రభుత్వంపై నేను విమర్శలు చేయడం లేదు. మీడియా ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇస్తున్నా.
మా అమ్మ చనిపోయినా సీఎం పరామర్శించలేదు
మా అమ్మ చనిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం పరామర్శించలేదు. ఆమె భౌతిక కాయాన్ని తమిళనాడు చేర్చేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటుగా తీసుకెళ్లాం. అమ్మ చనిపోయిన వార్తను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయాలకు నేను స్వయంగా ఫోన్ చేసి చెప్పాను. రాష్ట్రపతి వెంటనే ఫోన్ చేసి ఓదార్చారు. విదేశాల్లో ఉన్న ప్రధాని సాయంత్రానికి ఫోన్లో మాట్లాడారు. భౌతికకాయాన్ని చూసేందుకు కేసీఆర్ మాత్రం రాజ్భవన్కు రాలేదు. కనీసం ఫోన్లో పరామర్శించలేదు. గత గవర్నర్ నరసింహన్ మాతృమూర్తి చనిపోతే భౌతికకాయం తరలించే వరకు సీఎం రాజ్భవన్లోనే ఉన్నారని నాకు కొందరు చెప్పారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, దిల్లీల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్ల మధ్య దూరం కనిపిస్తున్నా ఆ ముఖ్యమంత్రులు, గవర్నర్లకు ఇచ్చే గౌరవంలో వ్యత్యాసం చూపడం లేదు. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. గతేడాది జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, నా పుట్టిన రోజు ఒకే రోజు కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత నుంచి రాజ్భవన్ను, గవర్నర్ కార్యాలయాన్ని అవమానిస్తున్నారు. కౌశిక్రెడ్డిని ఎమ్మెల్సీగా నియమించాలనే ప్రతిపాదనను ఆమోదించని తర్వాత పరిస్థితి బాగా దిగజారింది. పుదుచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్గా అక్కడ కొన్ని సలహాలిచ్చి సమస్యలు పరిష్కరించా. తెలంగాణలో సలహాలిచ్చే పరిస్థితి లేదు.
రోడ్డు.. రైలు మార్గంలోనే..
ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా ప్రజల కోసం నా విధిని నిర్వహిస్తా. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాచలానికి రైలు, రోడ్డు మార్గాల్లో వెళతా.. శ్రీరామ పట్టాభిషేకం, కల్యాణానికి హాజరవుతా’’ అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సదుపాయం కల్పిస్తుందిగా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘‘ఆ జవాబును మీడియాకే వదిలేస్తున్నా’’అని గవర్నర్ తెలిపారు. సమ్మక్క, సారక్క జాతర, నాగర్కర్నూల్ జిల్లాకూ రోడ్డు మార్గంలోనే వెళ్లానని నొక్కిచెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి తెలంగాణ, పుదుచ్చేరిలోని వివిధ అంశాలపై వివరించానన్నారు. స్వాతంత్య్ర అమృతమహోత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పానని గవర్నర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆమె దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.
భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడంలో కేసీఆర్ దిట్ట..
ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడంలో కేసీఆర్ దిట్ట.. ఆయన ప్రసంగాలు ప్రజలను మంత్రముగ్ధులను చేస్తాయి. అయితే అది ఎంతో కాలం కొనసాగదు. నేను తొలి నుంచి కేసీఆర్ను అన్నా అని పిలుస్తున్నా. కేసీఆర్ ఇప్పటికైనా రాజ్భవన్కు వస్తే అన్నా అంటా. ఆయనతో అన్ని అంశాలు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!