Telangana News: గోదాముల గోస
పంటలు మార్కెట్లకు వస్తుండటంతో గోదాముల కోసం హైరానా మొదలైంది. మరో నెలరోజుల్లో రైతులు 78 లక్షల టన్నుల ధాన్యం, 20 లక్షల టన్నుల మొక్కజొన్నలు, 2 నుంచి 4 లక్షల టన్నుల ఇతర పంటలను అమ్మకానికి తెస్తారని మార్కెటింగ్శాఖ అంచనా. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 20.18 లక్షల టన్నుల నిల్వలకే
మార్కెట్లకు రానున్న దాదాపు కోటి టన్నుల ధాన్యం, మక్కలు
ప్రస్తుతం 20 లక్షల టన్నుల నిల్వకే అవకాశం
ఈనాడు - హైదరాబాద్
పంటలు మార్కెట్లకు వస్తుండటంతో గోదాముల కోసం హైరానా మొదలైంది. మరో నెలరోజుల్లో రైతులు 78 లక్షల టన్నుల ధాన్యం, 20 లక్షల టన్నుల మొక్కజొన్నలు, 2 నుంచి 4 లక్షల టన్నుల ఇతర పంటలను అమ్మకానికి తెస్తారని మార్కెటింగ్శాఖ అంచనా. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 20.18 లక్షల టన్నుల నిల్వలకే గోదాముల్లో ఖాళీ ఉంది. మిగిలిన పంటలను ఎక్కడ నిల్వ చేయాలనేదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది గిడ్డంగుల్లో ఖాళీల్లేక ఫంక్షన్హాళ్లలో పంటలు నిల్వ చేసి పరదాలు కప్పి ఉంచారు. అప్పుడు కరోనా కారణంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు లేవు. పంటల నిల్వకు ఉపయోగించుకున్నారు. కానీ ఈ నెల, వచ్చే నెల వేలాది పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు ఉన్నాయి. ఫంక్షన్హాళ్లను వాటి యజమానులు పంటల నిల్వకు ఇస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
నిల్వ సామర్థ్యం పెరిగినా...
రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో మొత్తం 39 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములే ఉండేవి. ప్రస్తుతం 72.64 లక్షల టన్నులకు పెరిగినా ఇంకా చోటు చాలడం లేదు. వీటిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు ఉన్న సొంత గోదాముల నిల్వ సామర్థ్యం 6.93 లక్షల టన్నులే. అది తీసుకున్న ఇతర సంస్థలవి కూడా కలిపితే మొత్తం సామర్థ్యం 29.50 లక్షల టన్నులు. ఇక మిగతావి ప్రైవేటు, ఇతర సంస్థలకు చెందినవి. ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పర్యవేక్షణలో ఉన్నవాటిలో ఖాళీ లేదు. మూడు లక్షల టన్నుల సామర్థ్యంతో కొత్తవాటి నిర్మాణం పూర్తవగా వాటిని ఈ నెలలోనే అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ కృషిచేస్తోంది. ఇవి కాకుండా ప్రైవేటు, ఇతర సంస్థలకు చెందిన వాటిల్లో మరో 17 లక్షల టన్నుల నిల్వకు మాత్రమే చోటు ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా మార్కెట్లకు వచ్చే వరిధాన్యం, దాన్ని మరపట్టిస్తే వచ్చే బియ్యం, మొక్కజొన్నలు, సెనగలు, వేరుసెనగలు ఎక్కడ నిల్వ చేయాలనేది సమస్యగా మారింది.
పెరిగిన సాగు విస్తీర్ణం.. దిగుబడులు
సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడులు పెరగడం వల్ల గిడ్డంగుల కొరత తీవ్రంగా ఉంది. గతేడాది కొన్న బియ్యంలో 11.31 లక్షల టన్నులను ‘భారత ఆహార సంస్థ’(ఎఫ్సీఐ) ఇంకా గోదాముల్లోనే ఉంచింది.వీటిని ఎప్పుడు ఇతర రాష్ట్రాలకు తరలిస్తారనేది తెలియడం లేదు. ఖాళీ అయితే ఆ మేరకు ఉపయోగించుకోడానికి వీలుంటుంది. మరోవైపు రేషన్కార్డులపై పంపిణీకి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మరో 17.32 లక్షల టన్నుల బియ్యంను గోదాముల్లో నిల్వ చేసింది. ఇవి రోజుకు కొంత చొప్పున గ్రామాలకు వెళుతున్నాయి. ఎంత ప్రయత్నించినా కోటి టన్నుల పంటల నిల్వకు చోటు దక్కడం కష్టమని అధికారులే చెబుతున్నారు. దీనికితోడు జూన్ నుంచి ప్రారంభమయ్యే పంటల సీజన్ కోసం అత్యవసర వినియోగం కోటా కింద 5 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయడానికి రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య గిడ్డంగులను వెదుకుతోంది. ప్రైవేటు వ్యాపారులకు మరో 5 లక్షల టన్నుల ఎరువుల నిల్వకు గోదాములు కావాలి. రాష్ట్రంలో కనీసం కోటి టన్నుల నిల్వ సామర్థ్యమున్నవి అవసరమని, అవి లేకనే ఏటా నిల్వలకు సమస్యలు ఎదురవుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. గతేడాది ఫంక్షన్హాళ్లలో నిల్వ చేసిన మొక్కజొన్నలు వర్షాలకు తడిశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న