CM KCR: 24 గంటల్లో చెప్పాలి
‘తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోదీ, పీయూష్ గోయల్కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మా రాష్ట్రం సహా అన్ని చోట్లా ధాన్యం కొనుగోలు చేయండి. మీ నుంచి ఆదేశాల కోసం 24 గంటలు ఎదురు చూస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. మా నిర్ణయం తీసుకుంటాం. మీ వెంట మాత్రం పడతాం. అప్పుడు ఏమవుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో దిల్లీ తెలంగాణభవన్లో సోమవారం నిర్వహించిన దీక్షలో ఆయన ప్రసంగించారు. 30 నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణ చరిత్ర..
ధాన్యం కొనాలని మోదీ, గోయల్కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా
స్పందిస్తే మంచిది.. లేకపోతే రైతులను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు
నూకలు తినండనే అహంకారం మీకెక్కడి నుంచి వచ్చింది?
పీయూష్ గోయల్ కాదు... ఆయన పీయూష్ గోల్మాల్
ప్రశ్నించిన పార్టీలు.. నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులా?
జైలుకు పంపుతామంటారా? దమ్ముంటే రండి
నూతన వ్యవసాయ విధానం రావాలి
దిల్లీ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు - దిల్లీ
భాజపా నేతలు అడ్డగోలుగా వ్యవహరించారు. పంట మార్పిడి చేయాలని గోయల్ సూచించారు. మా మంత్రులు, ఎమ్మెల్యేలు, సర్పంచులు రైతుల వద్దకెళ్లి చెప్పారు. మరోపక్క కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వరి వేయండి.. పంట మేం కొంటాం...ముఖ్యమంత్రి మాటలు పట్టించుకోనవసరం లేదన్నారు.(ఈ సమయంలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ వీడియోలను ప్రదర్శించారు). ప్రతి గింజా కొంటామన్న కిషన్రెడ్డి ఇప్పుడు ఎటు పోయారో తెలియదు. మా ప్రజాప్రతినిధులంతా దిల్లీలో దీక్ష చేయడానికి వస్తే భాజపా వాళ్లు హైదరాబాద్లో దీక్ష పెట్టారు. మా హక్కుల కోసం మేం హస్తినలో ఉద్యమిస్తే అక్కడ దీక్ష చేయడానికి వారికి సిగ్గుండాలి.
మా రైతులను గంగలో పడేయడం నేను బతికుండగా జరగదు. రక్షించుకుంటాం. అయితే దేశవ్యాప్తంగా భాజపా తీరు ఎలా ఉందో తెలియజేస్తాం. నేను ఈ రోజో రేపో వెళతా. సమస్యకు సమాధానం కనిపెడతా... పరిష్కరిస్తా. మళ్లీ దిల్లీ వస్తా. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తా. రైతులకు రాజ్యాంగపరమైన రక్షణ లభించే వరకు.. కనీస మద్దతు ధర చట్టరూపంలో వచ్చే వరకు పోరాడతాం. సాధ్యమైనంత త్వరగా కలిసొచ్చే సీఎంలు, పార్టీల సమ్మతితో దేశంలో భగభగ మండే భూకంపం సృష్టిస్తాం’’
సాగు చట్టాల విషయంలో దేశ రైతులకు ప్రధాని స్వయంగా క్షమాపణ అడగాల్సి వచ్చింది. మన ప్రధాని క్షమాపణలతోనూ వ్యాపారం చేయగలిగిన వ్యక్తి. ఎన్నికలు వచ్చినప్పుడు క్షమాపణ చెబుతారు. ఈ దేశ రైతులు బిచ్చగాళ్లు కాదు.. తమ హక్కును డిమాండ్ చేస్తున్నారు. నూతన వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని ప్రధానిని కోరుతున్నా. మీతో ఆ పని కాకపోతే మిమ్మల్ని పక్కకు తప్పించి.. వచ్చే నూతన ప్రభుత్వంతో దేశమంతటికీ వర్తించే సమగ్ర నూతన వ్యవసాయ విధానం వచ్చేలా చూస్తాం’’
ప్రతిపక్ష పార్టీల నేతలెవరైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు వారి వెంటపడతాయి. వారి పార్టీలో అంతా సత్యహరిశ్చంద్రులా? ఆయన సోదరులా? భాజపాలో ఒక్క నేతపైకి సీబీఐ, ఈడీ వెళ్లవు. ప్రజాహిత సీఎంలను జైలుకు పంపుతామని ప్రతి రాష్ట్రంలో తమాషా చేస్తున్నారు. ఎవరిని జైలుకు పంపుతారు. దమ్ముంటే రండి. వీరి(భాజపా) చిన్నచితకా నేతలు సీఎంని జైలుకు పంపుతామని మొరుగుతున్నారు. నేను మౌనంగా కూర్చోను. తెలంగాణలో చేయాల్సింది చేశా. ఇక ముందు దేశం కోసం చేస్తా. అందుకోసం మేం బయలుదేరాం’’
- సీఎం కేసీఆర్
‘తెలంగాణ రైతుల తరఫున నరేంద్ర మోదీ, పీయూష్ గోయల్కు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. మా రాష్ట్రం సహా అన్ని చోట్లా ధాన్యం కొనుగోలు చేయండి. మీ నుంచి ఆదేశాల కోసం 24 గంటలు ఎదురు చూస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలుసు. మా నిర్ణయం తీసుకుంటాం. మీ వెంట మాత్రం పడతాం. అప్పుడు ఏమవుతుందో చూడండి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ‘రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో దిల్లీ తెలంగాణభవన్లో సోమవారం నిర్వహించిన దీక్షలో ఆయన ప్రసంగించారు. 30 నిమిషాలు మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణ చరిత్ర.. రైతుల కష్టాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దిగుబడి పెంపునకు కారణాలు.. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యవహరించిన తీరు.. రాష్ట్ర భాజపా నేతల తీరును ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీపై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ప్రసంగం ఆద్యంతం హిందీలో సాగింది.‘‘దేశానికి అన్నంపెట్టే రైతులను నూకలు తినమనే అహంకారం మీకెక్కడి నుంచి వచ్చింది.. రైతులను సొంత పొలాల్లోనే జీతగాళ్లను చేయాలనుకుంటున్నారు..రాజకీయం వేరు. రైతుల విషయం వేరు. ఇప్పుడు నేను రైతుల విషయమే మాట్లాడుతున్నా. నేను మరోసారి దిల్లీ వచ్చాక మిగతా విషయాలు చెబుతా. రాష్ట్రపతి ఎన్నిక తర్వాతో.. ముందో వచ్చి మా మిత్రులతో కలిసి మాట్లాడతా. మనకు విజయం రావచ్చు. రాకపోవచ్చు. తెలంగాణ రైతుల డిమాండ్ కోసం వచ్చాం. ధాన్యం కొనాలని ప్రధాని నుంచి ఆదేశం వస్తే మంచిది. రాకపోయినా మంచిదే. మనం పేదోళ్లం కాదు. మన చేతుల్లో సమస్యకు సమాధానం ఉంది. రేపు, ఎల్లుండిలోగా దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత దేశంలోని రైతుల కోసం పోరాడతాం.
రైతు కంటి నుంచి నీరొస్తే ప్రభుత్వం పడిపోతుంది
దాదాపు 2వేల కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ నుంచి ఇంత ఎండలో మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, రైతులు రావడానికి కారణమేమిటో మోదీ తెలుసుకోవాలి. కష్టపడే రైతు కంటి నుంచి నీరొస్తే ప్రభుత్వం పడిపోతుంది. మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డితో పాటు కొందరు మంత్రులు తెలంగాణ రైతుల డిమాండ్లను విన్నవించేందుకు దిల్లీ వస్తే వారితో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యవహరించిన తీరు దారుణంగా, అవమానకరంగా ఉంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను నూకలు తినమన్నారు. ఆయన పీయూష్ గోయల్ కాదు.. పీయూష్ గోల్మాల్. వారికేమైనా వెయ్యేళ్లు పాలించడానికి అవకాశమిచ్చారా? మంత్రులు వచ్చినప్పుడు మూడేసి గంటలు కూర్చోబెట్టి వెళతారా? తిరిగి మాపైనే నిందలు మోపుతారా? ఇదేనా ఆయన నీతి? కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇదేనా? ఇది సరికాదు. దేశ ప్రజల గుండెల్లో మంట మండుతోంది. ఆ మంట మా గుండెల్లోనూ ఉంది. అది మిమ్మల్ని ఖతం చేసేవరకు పోదు. అప్పుడు పీయూష్ గోల్మాల్ పారిపోవడం ఖాయం. హిట్లర్, ముస్సోలిని, నెపోలియన్ వంటి వారే పోయారు. ఈయన ఎంత?
నాడు దుఃఖ భరితం.. ఇప్పుడు అద్భుతం
దేశ చరిత్రపై పీయూష్ గోయల్కు ఏం పరిజ్ఞానం ఉందో నాకు తెలియదు. మా తెలంగాణ కథ వేరే ఉంది. మేం ప్రత్యేక రాష్ట్రంగా ఉండేవాళ్లం. దిల్లీ మమ్మల్ని బలవంతంగా ఆంధ్రప్రదేశ్లో కలిపింది. ఆ తర్వాత మేం అనేక బాధలు పడ్డాం. మా ప్రాంతంలో కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలేదు. ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో 30 లక్షల బోర్లు ఉన్నాయి. వాటి కరెంటు, మోటార్లకు మా రైతులు రూ.25వేల కోట్లు ఖర్చుపెట్టారు. అదీ మా వ్యథాభరిత కథ. కాకతీయ రాజులు ఏర్పాటు చేసిన చిన్న నీటిపారుదల వ్యవస్థ ఏపీ ప్రభుత్వ చిన్నచూపుతో ధ్వంసమైంది. ఫలితంగా వెయ్యి అడుగుల లోతుకి భూగర్భజలం పడిపోయింది. కరెంటు అయిదారు గంటలు మించి ఉండేది కాదు. మహబూబ్నగర్ జిల్లాలో 35 లక్షల మంది ఉంటే 20 లక్షల మంది పొట్ట చేతపట్టుకొని వలసపోయారు. తెలంగాణ ప్రజలు 1956 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 1969 ఉద్యమంలో 400 మంది యువత పోలీస్ తూటాలకు బలయ్యారు. 2001లో తెలంగాణ నినాదంతో గులాబీ జెండా ఎత్తుకున్నా. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించా. 2014, జూన్ 2న మా రాష్ట్రం ఏర్పడింది. తెరాసకు ప్రజలు అవకాశమివ్వడంతో మేం రైతులకు తొలి ప్రాధాన్యం ఇచ్చాం. 46 వేల చెరువులను మిషన్ కాకతీయ పేరుతో పునరుద్ధరించాం. కరెంటు కష్టాలు అధిగమించాం. ఇప్పుడు దేశం మొత్తంమీద 24 గంటలపాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మరోవైపు దేశంలో కరెంటు కోసం పోరాటాలు చూస్తున్నాం. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లోనూ రైతులు రోడ్లపై పడ్డారు. ఇప్పుడు మా చెరువులు నిండాయి. 30 లక్షల బోర్లు నడుస్తూ పంట దిగుబడి పెరిగితే పీయూష్ గోల్మాల్ తెలంగాణలో ఏం అద్భుతం జరిగిందంటున్నారు. మీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాం. మా పార్లమెంట్ నేత కేశవరావు ఓ ప్రశ్న అడిగితే మీకు అర్థం కావడం లేదని మీరంటున్నారు. అర్థం కానిది కేశవరావుకు కాదు.. మీకు. 2014- 2022 మధ్యకాలంలో తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చాం.
అన్నం పెట్టే రైతులను దోషులుగా నిలబెడతారా?
నీతి, నిజాయతీలతో ప్రజలను ప్రేమించే ప్రధాని అయితే తెలంగాణ రైతుల కష్టాన్ని ప్రశంసించేవారు. అందుకు విరుద్ధంగా అవమానించేవారా? అన్నం పెట్టే రైతులను దోషులుగా నిలబెడతారా? ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వం, పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రధాని వద్ద చిన్న తెలంగాణలో రైతులు పండించిన పంట కొనుగోలు చేసే ధనం లేదా? మోదీకి మనసు లేదా? మీకు తెలంగాణ ఓట్లు కావాలి.. సీట్లు కావాలి.. కానీ ధాన్యం వద్దు. దేశంలోని రైతు భూములన్నీ కార్పొరేట్లపరం చేసి వాళ్ల భూముల్లో వాళ్లనే జీతగాళ్లు చేయాలనేది కేంద్ర విధానం.
టికాయిత్పై ప్రశంసల జల్లు
రాకేశ్ టికాయిత్ తండ్రి మహేంద్ర టికాయిత్ గొప్ప రైతు నేత. 1978-80ల్లో ఆయన ఒక్క పిలుపు ఇస్తే లక్షలాది మంది రైతులు కదిలేవారు. ఈ రోజు ఉపవాసమైనా రాకేశ్ టికాయిత్ మన కోసం దీక్షకు వచ్చారు. దేశంలో రైతు మహా సంగ్రామం ప్రారంభవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు, రైతులు ఆయనకు అండగా నిలుస్తారు. కేంద్రం ఆయనను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అయినా ఎంతో దృఢంగా నిలిచారు. రైతుల డిమాండ్ల కోసం 13 నెలలుగా పోరాడటం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు’ అని కేసీఆర్ ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని